Movie News

అదిరిపోయే ఆలోచన 112 రూపాయలు

స్టార్ క్యాస్టింగ్ లేకుండా తక్కువ బడ్జెట్ తో తీసే సినిమాలకు మంచి రన్ రావాలంటే సామాన్యులకు టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలి. ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోలకు ఏం చేయనక్కర్లేదు. టాక్ ఎలా ఉన్నా మొదటి వారం భారీగా వసూళ్లు రాబడతారు. కానీ జనాలకు అంతగా తెలియని తారాగణంతో తీసినప్పుడు సరసమైన ధర చాలా అవసరం. కీడా కోలా టీమ్ అదే చేస్తోంది. ఈ రోజు నుంచి తెలంగాణ మల్టీప్లెక్సుల్లో టికెట్ రేట్లను కేవలం 112 రూపాయలకు సవరించి ఎక్కువ శాతం ప్రేక్షకులు వచ్చేలా ఎత్తుగడ వేసింది. మాములుగా వీటి రేట్ 150 నుంచి 200 మధ్యలో ఉంటుంది.

అనూహ్యం ఏంటంటే మహేష్ బాబు ఏఎంబి సూపర్ ప్లెక్స్ లో కూడా ఇదే రేట్ పెట్టడం. ఇప్పటిదాకా ఈ థియేటర్ సముదాయంలో ఇంత తక్కువ ధర ఎప్పుడూ లేదు. సగానికి పైగా డిస్కౌంట్ ఇవ్వడం వెనుక సదరు యాజమాన్యంతో పాటు డిస్ట్రిబ్యూటర్, నిర్మాతల చొరవ చాలా ఉంటుంది. సింగల్ స్క్రీన్ లో కూడా లేని ఇంత తక్కువ మొత్తానికి మల్టీప్లెక్స్ అనుభూతి దక్కుతుందంటే ఎవరు మాత్రం వదులుకుంటారు. ఎల్లుండి జపాన్, జిగర్ తండా డబుల్ ఎక్స్ ఆపైన ఆదివారం టైగర్ 3 విడుదల కాబోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే కీడా కోలా మేకర్స్ తెలివైన నిర్ణయం తీసుకున్నారు.

రాబోయే రోజుల్లో కూడా ఈ తరహా స్ట్రాటజీలు కొనసాగించాలి. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. ఒక్కోసారి బజ్ లేదనుకుంటే రిలీజ్ రోజే వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇచ్చిన దాఖలాలు బోలెడు. గదర్ 2కి సైతం నెల రోజులయ్యాక 100 రూపాయల టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎటొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నియమ నిబంధనలు, పరిమితుల వల్ల మల్టీప్లెక్సులు మరీ తక్కువ రేటుకి టికెట్లు ఇవ్వలేకపోతున్నాయి. ఇటీవలి కాలంలో పివిఆర్ సంస్థ తరచు స్నాక్స్ ధరలను సవరించి 99 రూపాయలకు అమ్మడం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇలాంటివి రెగ్యులర్ గా ప్లాన్ చేస్తే అందరికీ మంచిది. 

This post was last modified on November 8, 2023 12:57 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

2 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

3 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

4 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

5 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

6 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

6 hours ago