డార్లింగ్ ప్రభాస్ సుదీర్ఘ యూరోప్ ట్రిప్ తర్వాత తిరిగి వచ్చేశాడు. మోకాలి గాయంతో రెండు నెలలు అక్కడే చికిత్సతో పాటు విశ్రాంతి తీసుకున్న బాహుబలి ఇండియాలో అడుగు పెట్టేశాడు. అక్టోబర్ లో తన పుట్టినరోజు నాడు అందుబాటులో లేకపోవడం, రిలీజ్ దగ్గరలో పెట్టుకుని కూడా సలార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో కొన్ని ఉపశమన చర్యలు ఇప్పటికిప్పుడు అవసరం. ముఖ్యంగా డిసెంబర్ 22 ఎంతో దూరంలో లేదు. సరిగ్గా ఓ నలభై రెండు రోజులు గడిచిపోతే వచ్చేస్తుంది. ఇంకా పబ్లిసిటీనే మొదలు కాలేదు కానీ చాలా పుకార్లు వ్యాపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సలార్ టీమ్ వెంటనే మేల్కోవాలి. ఎంత హైప్ ఉన్నా సరే తమ ప్రోడక్ట్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకూడదు. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి ఇద్దరు హీరోలకు వెంటేసుకుని దేశమంతా తిరిగాడు. అడిగినవాళ్లకు కాదనకుండా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇతర రాష్ట్రాల్లో ఈవెంట్లు చేశాడు. అంత పెద్ద మల్టీస్టారర్ కే ఆ రేంజ్ లో కష్టపడాల్సి వచ్చింది. అలాంటిది సలార్ విషయంలో ఏ చిన్న నిర్లక్ష్యమైనా కరెక్ట్ కాదు. ముంబై నుంచి హైదరాబాద్ దాకా ఎన్నో కార్యక్రమాలు ప్లాన్ చేయాలి. అసలు ముందైతే సరైన టీజర్ ఒకటి వదిలి హైప్ ని పెంచే దిశగా ఏర్పాట్లు చేసుకోవాలి.
డిసెంబర్ 22కి అనుగుణంగా బిజినెస్ వ్యవహారాలు, థియేటర్ అగ్రిమెంట్లు చేసుకుంటున్నారనే వార్తలు తిరుగుతున్నాయి. ఇంకో వైపు ఏమో వాయిదా పడొచ్చేమో, ఆ డేట్ కి రవితేజ ఈగల్ రావొచ్చేమోననే కొత్త గాసిప్పులు పుట్టుకొచ్చాయి. ఏది ఏమైనా హోంబాలే ఫిలిమ్స్ తరఫున వీలైనంత త్వరగా అఫీషియల్ నోట్స్ రావడం చాలా అవసరం. దీపావళి ఇంకో నాలుగు రోజుల్లో ఉంది. కనీసం ఒక కొత్త పోస్టర్ అయినా వదులుతారో లేదో చూడాలి. దసరాకి ఇలాగే ఊరించి నిరాశపరిచారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండి అసలు బయట కనిపించడమే బొత్తిగా మానేశారు. ఒత్తిడి అలా ఉంది మరి.
This post was last modified on November 8, 2023 11:27 am
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…