డార్లింగ్ ప్రభాస్ సుదీర్ఘ యూరోప్ ట్రిప్ తర్వాత తిరిగి వచ్చేశాడు. మోకాలి గాయంతో రెండు నెలలు అక్కడే చికిత్సతో పాటు విశ్రాంతి తీసుకున్న బాహుబలి ఇండియాలో అడుగు పెట్టేశాడు. అక్టోబర్ లో తన పుట్టినరోజు నాడు అందుబాటులో లేకపోవడం, రిలీజ్ దగ్గరలో పెట్టుకుని కూడా సలార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో కొన్ని ఉపశమన చర్యలు ఇప్పటికిప్పుడు అవసరం. ముఖ్యంగా డిసెంబర్ 22 ఎంతో దూరంలో లేదు. సరిగ్గా ఓ నలభై రెండు రోజులు గడిచిపోతే వచ్చేస్తుంది. ఇంకా పబ్లిసిటీనే మొదలు కాలేదు కానీ చాలా పుకార్లు వ్యాపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సలార్ టీమ్ వెంటనే మేల్కోవాలి. ఎంత హైప్ ఉన్నా సరే తమ ప్రోడక్ట్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకూడదు. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి ఇద్దరు హీరోలకు వెంటేసుకుని దేశమంతా తిరిగాడు. అడిగినవాళ్లకు కాదనకుండా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇతర రాష్ట్రాల్లో ఈవెంట్లు చేశాడు. అంత పెద్ద మల్టీస్టారర్ కే ఆ రేంజ్ లో కష్టపడాల్సి వచ్చింది. అలాంటిది సలార్ విషయంలో ఏ చిన్న నిర్లక్ష్యమైనా కరెక్ట్ కాదు. ముంబై నుంచి హైదరాబాద్ దాకా ఎన్నో కార్యక్రమాలు ప్లాన్ చేయాలి. అసలు ముందైతే సరైన టీజర్ ఒకటి వదిలి హైప్ ని పెంచే దిశగా ఏర్పాట్లు చేసుకోవాలి.
డిసెంబర్ 22కి అనుగుణంగా బిజినెస్ వ్యవహారాలు, థియేటర్ అగ్రిమెంట్లు చేసుకుంటున్నారనే వార్తలు తిరుగుతున్నాయి. ఇంకో వైపు ఏమో వాయిదా పడొచ్చేమో, ఆ డేట్ కి రవితేజ ఈగల్ రావొచ్చేమోననే కొత్త గాసిప్పులు పుట్టుకొచ్చాయి. ఏది ఏమైనా హోంబాలే ఫిలిమ్స్ తరఫున వీలైనంత త్వరగా అఫీషియల్ నోట్స్ రావడం చాలా అవసరం. దీపావళి ఇంకో నాలుగు రోజుల్లో ఉంది. కనీసం ఒక కొత్త పోస్టర్ అయినా వదులుతారో లేదో చూడాలి. దసరాకి ఇలాగే ఊరించి నిరాశపరిచారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండి అసలు బయట కనిపించడమే బొత్తిగా మానేశారు. ఒత్తిడి అలా ఉంది మరి.
This post was last modified on November 8, 2023 11:27 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…