డార్లింగ్ ప్రభాస్ సుదీర్ఘ యూరోప్ ట్రిప్ తర్వాత తిరిగి వచ్చేశాడు. మోకాలి గాయంతో రెండు నెలలు అక్కడే చికిత్సతో పాటు విశ్రాంతి తీసుకున్న బాహుబలి ఇండియాలో అడుగు పెట్టేశాడు. అక్టోబర్ లో తన పుట్టినరోజు నాడు అందుబాటులో లేకపోవడం, రిలీజ్ దగ్గరలో పెట్టుకుని కూడా సలార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో కొన్ని ఉపశమన చర్యలు ఇప్పటికిప్పుడు అవసరం. ముఖ్యంగా డిసెంబర్ 22 ఎంతో దూరంలో లేదు. సరిగ్గా ఓ నలభై రెండు రోజులు గడిచిపోతే వచ్చేస్తుంది. ఇంకా పబ్లిసిటీనే మొదలు కాలేదు కానీ చాలా పుకార్లు వ్యాపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సలార్ టీమ్ వెంటనే మేల్కోవాలి. ఎంత హైప్ ఉన్నా సరే తమ ప్రోడక్ట్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకూడదు. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి ఇద్దరు హీరోలకు వెంటేసుకుని దేశమంతా తిరిగాడు. అడిగినవాళ్లకు కాదనకుండా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇతర రాష్ట్రాల్లో ఈవెంట్లు చేశాడు. అంత పెద్ద మల్టీస్టారర్ కే ఆ రేంజ్ లో కష్టపడాల్సి వచ్చింది. అలాంటిది సలార్ విషయంలో ఏ చిన్న నిర్లక్ష్యమైనా కరెక్ట్ కాదు. ముంబై నుంచి హైదరాబాద్ దాకా ఎన్నో కార్యక్రమాలు ప్లాన్ చేయాలి. అసలు ముందైతే సరైన టీజర్ ఒకటి వదిలి హైప్ ని పెంచే దిశగా ఏర్పాట్లు చేసుకోవాలి.
డిసెంబర్ 22కి అనుగుణంగా బిజినెస్ వ్యవహారాలు, థియేటర్ అగ్రిమెంట్లు చేసుకుంటున్నారనే వార్తలు తిరుగుతున్నాయి. ఇంకో వైపు ఏమో వాయిదా పడొచ్చేమో, ఆ డేట్ కి రవితేజ ఈగల్ రావొచ్చేమోననే కొత్త గాసిప్పులు పుట్టుకొచ్చాయి. ఏది ఏమైనా హోంబాలే ఫిలిమ్స్ తరఫున వీలైనంత త్వరగా అఫీషియల్ నోట్స్ రావడం చాలా అవసరం. దీపావళి ఇంకో నాలుగు రోజుల్లో ఉంది. కనీసం ఒక కొత్త పోస్టర్ అయినా వదులుతారో లేదో చూడాలి. దసరాకి ఇలాగే ఊరించి నిరాశపరిచారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండి అసలు బయట కనిపించడమే బొత్తిగా మానేశారు. ఒత్తిడి అలా ఉంది మరి.
This post was last modified on November 8, 2023 11:27 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…