సినీ రంగంలో నటీనటులకు అందం.. అభినయం రెండూ ఉన్నంత మాత్రాన విజయవంతం అవుతారని గ్యారెంటీ ఏమీ లేదు. దానికి కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలి. అవకాశాలు అందుకుంటే సరిపోదు. వచ్చిన అవకాశాలు మంచివై ఉండాలి. చేసే సినిమాలు విజయవంతం కావాలి. తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి విషయంలో ఇవే జరగలేదు. ఆమెలో అందం ఉంది. నటన విషయంలోనూ ఢోకా లేదు.
‘మధురం’ సహా ఆమె నటించిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చూస్తే తన టాలెంట్ ఏంటో అర్థమవుతుంది. ఐతే సినిమాల్లో అవకాశాలైతే అందుకుంది కానీ.. అవేవీ ఆమెకు కలిసి రాలేదు. ‘కుందనపు బొమ్మ’.. ‘బ్రహ్మోత్సవం’.. ‘హౌరా బ్రిడ్జ్’.. ‘మను’ లాంటి సినిమాల్లో నటించిన చాందినికి ఆ సినిమాలు చేదు అనుభవాలే మిగిల్చాయి. చివరగా చేసిన ‘మను’ మీద చాందిని చాలా ఆశలే పెట్టుకుంది. ‘మధురం’ షార్ట్ ఫిలింతో ఆకట్టుకున్న ఫణీంద్రనే తీసిన ఈ సినిమా కచ్చితంగా తనకు బ్రేక్ ఇస్తుందనుకుంది. కానీ అలా జరగలేదు.
ఈ మధ్య వెబ్ సిరీస్ అరంగేట్రం చేసినప్పటికీ చాందిని రాత మారలేదు. ఐతే ఇప్పుడు తాను చేస్తున్న ఓ సినిమా.. తాను ఇన్నేళ్లుగా ఆశిస్తున్న బ్రేక్ కచ్చితంగా ఇస్తుందనే ఆశతో ఉంది చాందిని. ఆ సినిమానే.. కలర్ ఫోటో. కమెడియన్గా సత్తా చాటిన సుహాస్ పక్కన చాందిని కథానాయికగా నటిస్తుండటం విశేషం. ఇదొక ‘బ్లాక్ అండ్ వైట్’ లవ్ స్టోరీ. హీరో సుహాస్ అని చూడకుండా కథకున్న ప్రత్యేకత చూసి ఈ సినిమా చేసింది చాందిని. దీని టీజర్, కొత్తగా రిలీజైన పాట చూస్తే సినిమా ప్రామిసింగ్గా అనిపిస్తోంది. సుహాస్ మిత్రుడే అయిన సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
‘హృదయ కాలేయం’ దర్శక నిర్మాత సాయిరాజేష్ నీలం ఈ సినిమాకు కథ అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించాడు. ప్రోమోలు చూస్తుంటే చాందిని టాలెంటుకు తగ్గ పాత్ర దక్కిందని.. ఈసారి కచ్చితంగా తన ఆశ, తన అభిమానుల ఆశ తీరుతుందని అనిపిస్తోంది. చూద్దాం మరి ఏమవుతుందో?
This post was last modified on August 28, 2020 1:49 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…