లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. మూడు దశాబ్దాలుగా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్న తీరు అభిమానులకు ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే ఒకప్పటి ప్రేమదేశం, భారతీయుడు, బొంబాయి రేంజ్ లో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం లేదనే కామెంట్స్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. పొన్నియిన్ సెల్వన్ లోనూ ఠక్కున గుర్తొచ్చే పాటలు కానీ, సిగ్నేచర్ బిజిఎం కానీ పెద్దగా ఉండవు. అందుకే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16ని ఆయన్ని ఎంచుకున్నప్పుడు ఫ్యాన్స్ లో సందేహాలు తలెత్తాయి.
ఇప్పుడవి తీరినట్టే అనిపిస్తోంది. నిన్న రిలీజైన కమల్ హాసన్ 234వ సినిమా తగ్స్ లైఫ్ వీడియో ప్రోమోలో ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా గొప్పగా అనిపించింది. ఎన్నో ఏళ్ళ తర్వాత తన స్థాయి అవుట్ ఫుట్ వినిపించిందని అభిమానులు సంబరపడ్డారు. దీనికి దర్శకుడు మణిరత్నం కాబట్టి రెహమాన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉండొచ్చు కానీ ఏదైనా రాబట్టుకునే డైరెక్టర్ల టాలెంట్ మీద ట్యూన్లు ఆధారపడి ఉంటాయి. గేమ్ చేంజర్ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో ఆర్సి 16 మీద మాములు అంచనాలు నెలకొనలేదు. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకపోయినా గ్రౌండ్ లెవెల్ లో హైప్ భారీగా ఉంది.
ప్రస్తుతానికి మ్యూజిక్ సిట్టింగ్స్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలుకాలేదు. అసలు షూట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలో క్లారిటీ వస్తే ఆలోగా ట్యూన్స్ సిద్ధం చేయించే ప్లాన్ లో బుచ్చిబాబు ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులైతే చకచకా జరుగుతున్నాయి. ఎదురు చూసే కొద్దీ చరణ్ ని శంకర్ వదలడం లేదు. అదిగో ఇదిగో అంటూ షెడ్యూల్స్ వరసగా ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ 2 వల్ల ఈ జాప్యం జరుగుతున్నా నిర్మాత దిల్ రాజుతో సహా ఎవరూ ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. చిరంజీవి సైరాని మిస్ చేసిన రెహమాన్ ఇప్పుడు కొడుకు చరణ్ కి ఎలాంటి ఆల్బమ్ ఇస్తాడోననే ఎగ్జైట్ మెంట్ ఫ్యాన్స్ లో చాలా ఉంది.
This post was last modified on November 7, 2023 1:39 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…