ఎప్పుడూ లేనిది ఈసారి దసరా పండక్కు సంక్రాంతి రేంజ్ లో మూడు పెద్ద సినిమాలు వచ్చేసరికి రాబోయే సంవత్సరాల్లో ఇది కూడా చాలా కీలక సీజన్ కాబోతోందని నిర్మాతలు అంచనా వేశారు. అయితే అఖండలో బాలయ్య స్టైల్ లో చెప్పాలంటే బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఋజువైపోయింది. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఇదే మూవీ ఒకవేళ జనవరిలో వచ్చి ఉంటే వసూళ్లలో ఎంతలేదన్నా ఇంకో పది ఇరవై కోట్లు పెరుగుదల ఉండేదని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. ఫ్యామిలీ ప్లస్ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కాబట్టి ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చేవన్న మాట వాస్తవమే.
అదే విధంగా లియో కనక ఇంకొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకుని స్టడీగా ఉంటే మరో పది కోట్లు సులభంగా వచ్చి పడేవి. టైగర్ నాగేశ్వరరావు సైతం పోటీ వల్ల నలిగిపోయిందే. రెండు పండగల స్టామినా ఒకటే కాదని చెప్పేందుకు ప్రధాన కారణం చూసుకుంటే సంక్రాంతి లాగా దసరాకు అందరూ స్వంత ఊళ్లకు వెళ్ళిపోరు. పైగా స్కూళ్లకు కాలేజీలకు తప్ప సంస్థలకు సుదీర్ఘ సెలవులు ఉండవు. హైదరాబాద్ లో జనవరి మధ్యలో రోడ్లు నిర్మానుషంగా ఉంటాయి. అలాంటి సీన్ విజయదశమికి భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. కాబట్టి పోటీ పరంగా దసరాకు రిస్క్ చేయకపోవడం సేఫ్.
ఇకపై ఇలా కాంపిటీషన్ కు వెళ్తున్నప్పుడు నిర్మాతలు ప్రాక్టికల్ గా ఆలోచించుకోవడం అవసరం. అందుకే 2024 సంక్రాంతికి హీరోలు నిర్మాతలు అంతగా పోటీ పడుతున్నారు. ఓపెనింగ్స్ మీద ప్రభావం ఉంటుందని తెలిసినా సరే మాములు రోజుల్లో కంటే ఈ టైంలో వచ్చే కలెక్షన్లు తమను హిట్ అయినా ఫ్లాప్ అయినా గట్టెక్కిస్తాయన్న నమ్మకంతో రిస్క్ చేస్తున్నారు. మనకు బోనస్ ఏంటంటే తమిళనాడులో పొంగల్ ని టార్గెట్ చేసుకున్న అయలన్, లాల్ సలామ్ లకు సైతం థియేటర్లు పంచాల్సిందే. రాబోయే రోజుల్లో తిరుమల గుడిలో ప్రత్యేక సేవలకు రెండేళ్ల ముందే టికెట్లు బుక్ చేసుకున్నట్టు సంక్రాంతి కోసం నిర్మాతలు అలా ఎగబడాల్సి రావొచ్చు
This post was last modified on November 6, 2023 4:08 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…