ఎప్పుడూ లేనిది ఈసారి దసరా పండక్కు సంక్రాంతి రేంజ్ లో మూడు పెద్ద సినిమాలు వచ్చేసరికి రాబోయే సంవత్సరాల్లో ఇది కూడా చాలా కీలక సీజన్ కాబోతోందని నిర్మాతలు అంచనా వేశారు. అయితే అఖండలో బాలయ్య స్టైల్ లో చెప్పాలంటే బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఋజువైపోయింది. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఇదే మూవీ ఒకవేళ జనవరిలో వచ్చి ఉంటే వసూళ్లలో ఎంతలేదన్నా ఇంకో పది ఇరవై కోట్లు పెరుగుదల ఉండేదని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. ఫ్యామిలీ ప్లస్ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కాబట్టి ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చేవన్న మాట వాస్తవమే.
అదే విధంగా లియో కనక ఇంకొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకుని స్టడీగా ఉంటే మరో పది కోట్లు సులభంగా వచ్చి పడేవి. టైగర్ నాగేశ్వరరావు సైతం పోటీ వల్ల నలిగిపోయిందే. రెండు పండగల స్టామినా ఒకటే కాదని చెప్పేందుకు ప్రధాన కారణం చూసుకుంటే సంక్రాంతి లాగా దసరాకు అందరూ స్వంత ఊళ్లకు వెళ్ళిపోరు. పైగా స్కూళ్లకు కాలేజీలకు తప్ప సంస్థలకు సుదీర్ఘ సెలవులు ఉండవు. హైదరాబాద్ లో జనవరి మధ్యలో రోడ్లు నిర్మానుషంగా ఉంటాయి. అలాంటి సీన్ విజయదశమికి భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. కాబట్టి పోటీ పరంగా దసరాకు రిస్క్ చేయకపోవడం సేఫ్.
ఇకపై ఇలా కాంపిటీషన్ కు వెళ్తున్నప్పుడు నిర్మాతలు ప్రాక్టికల్ గా ఆలోచించుకోవడం అవసరం. అందుకే 2024 సంక్రాంతికి హీరోలు నిర్మాతలు అంతగా పోటీ పడుతున్నారు. ఓపెనింగ్స్ మీద ప్రభావం ఉంటుందని తెలిసినా సరే మాములు రోజుల్లో కంటే ఈ టైంలో వచ్చే కలెక్షన్లు తమను హిట్ అయినా ఫ్లాప్ అయినా గట్టెక్కిస్తాయన్న నమ్మకంతో రిస్క్ చేస్తున్నారు. మనకు బోనస్ ఏంటంటే తమిళనాడులో పొంగల్ ని టార్గెట్ చేసుకున్న అయలన్, లాల్ సలామ్ లకు సైతం థియేటర్లు పంచాల్సిందే. రాబోయే రోజుల్లో తిరుమల గుడిలో ప్రత్యేక సేవలకు రెండేళ్ల ముందే టికెట్లు బుక్ చేసుకున్నట్టు సంక్రాంతి కోసం నిర్మాతలు అలా ఎగబడాల్సి రావొచ్చు
This post was last modified on November 6, 2023 4:08 pm
https://www.youtube.com/watch?v=ddmpaI3WTvc
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల…