ఎప్పుడూ లేనిది ఈసారి దసరా పండక్కు సంక్రాంతి రేంజ్ లో మూడు పెద్ద సినిమాలు వచ్చేసరికి రాబోయే సంవత్సరాల్లో ఇది కూడా చాలా కీలక సీజన్ కాబోతోందని నిర్మాతలు అంచనా వేశారు. అయితే అఖండలో బాలయ్య స్టైల్ లో చెప్పాలంటే బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఋజువైపోయింది. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఇదే మూవీ ఒకవేళ జనవరిలో వచ్చి ఉంటే వసూళ్లలో ఎంతలేదన్నా ఇంకో పది ఇరవై కోట్లు పెరుగుదల ఉండేదని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. ఫ్యామిలీ ప్లస్ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కాబట్టి ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చేవన్న మాట వాస్తవమే.
అదే విధంగా లియో కనక ఇంకొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకుని స్టడీగా ఉంటే మరో పది కోట్లు సులభంగా వచ్చి పడేవి. టైగర్ నాగేశ్వరరావు సైతం పోటీ వల్ల నలిగిపోయిందే. రెండు పండగల స్టామినా ఒకటే కాదని చెప్పేందుకు ప్రధాన కారణం చూసుకుంటే సంక్రాంతి లాగా దసరాకు అందరూ స్వంత ఊళ్లకు వెళ్ళిపోరు. పైగా స్కూళ్లకు కాలేజీలకు తప్ప సంస్థలకు సుదీర్ఘ సెలవులు ఉండవు. హైదరాబాద్ లో జనవరి మధ్యలో రోడ్లు నిర్మానుషంగా ఉంటాయి. అలాంటి సీన్ విజయదశమికి భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. కాబట్టి పోటీ పరంగా దసరాకు రిస్క్ చేయకపోవడం సేఫ్.
ఇకపై ఇలా కాంపిటీషన్ కు వెళ్తున్నప్పుడు నిర్మాతలు ప్రాక్టికల్ గా ఆలోచించుకోవడం అవసరం. అందుకే 2024 సంక్రాంతికి హీరోలు నిర్మాతలు అంతగా పోటీ పడుతున్నారు. ఓపెనింగ్స్ మీద ప్రభావం ఉంటుందని తెలిసినా సరే మాములు రోజుల్లో కంటే ఈ టైంలో వచ్చే కలెక్షన్లు తమను హిట్ అయినా ఫ్లాప్ అయినా గట్టెక్కిస్తాయన్న నమ్మకంతో రిస్క్ చేస్తున్నారు. మనకు బోనస్ ఏంటంటే తమిళనాడులో పొంగల్ ని టార్గెట్ చేసుకున్న అయలన్, లాల్ సలామ్ లకు సైతం థియేటర్లు పంచాల్సిందే. రాబోయే రోజుల్లో తిరుమల గుడిలో ప్రత్యేక సేవలకు రెండేళ్ల ముందే టికెట్లు బుక్ చేసుకున్నట్టు సంక్రాంతి కోసం నిర్మాతలు అలా ఎగబడాల్సి రావొచ్చు
This post was last modified on November 6, 2023 4:08 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…