అదేం నిర్లక్ష్యమో కానీ హీరో హీరోయిన్లకు ఎంతో కొంత పాపులారిటీ ఉందనే కారణంతో కొందరు ప్రొడ్యూసర్లు పూర్తి చేయని సినిమాలను విడుదల చేసేందుకు తెగబడుతున్నారు. మొన్న శుక్రవారం బాలీవుడ్ మూవీ ది లేడీ కిల్లర్ రిలీజయ్యింది. ఎవరో అనామకులు నటించిందంటే ఏమో అనుకోవచ్చు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్, ఈ మధ్య మంచి ఛాన్సులు హిట్లు కొట్టేస్తున్న భూమి పెడ్నేకర్ జంటగా అజయ్ బహ్ల్ దర్శకత్వంలో చాలా చీప్ బడ్జెట్ లో రూపొందించారు. ట్విస్ట్ ఏంటంటే షూటింగ్ కాకుండానే థియేటర్లకు వదిలేంత సాహసం చేశారు.
నిర్మాత చేతుల్లో డబ్బులు లేకపోవడంతో ఏదైతే అదయ్యిందని దొరికిన కాసిన్ని స్క్రీన్లలో విడుదల చేస్తే మొదటి రోజు కేవలం 293 టికెట్లు అమ్ముడుపోయి అక్షరాలా 38 వేల రూపాయిల కలెక్షన్ వచ్చింది. ఇది దేశం మొత్తం మీద వచ్చిన సొమ్ము. అంటే ఎక్కడో మారుమూల పల్లెటూరిలో యాభై రోజులు దాటిన జవాన్ థియేటర్ లో ఒక్క షోకు వచ్చే లెక్క కన్నా తక్కువన్న మాట. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. స్వర్గీయ శ్రీదేవి, బాబాయ్ అనిల్ కపూర్, సోదరి సోనమ్ కపూర్, తండ్రి బోనీ కపూర్ ఇంత పెద్ద స్టార్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోకి ఇది దుస్థితి.
ఇంత కక్కుర్తిపడి ఎందుకు రిలీజ్ చేశారయ్యా అంటే టీమ్ చెప్పే కారణాలు పరమ విచిత్రంగా ఉన్నాయి. బాలన్స్ ఉన్న పది శాతం ఉత్తరాఖండ్ లో తీయాల్సి ఉందట. అయితే అక్కడ భారీ వర్షాలు కురవడంతో వేరే గతి లేక అప్పటిదాకా తీసిన ఫుటేజ్ ని అతుకుల బొంత లాగా జుట్టేసి ఇక మీ ఖర్మ అంటూ జనాల మీదకు వదిలేశారు. టైటిల్ లో ఉన్న లేడీ కిల్లర్ కాస్తా నమ్ముకుని వచ్చిన ప్రేక్షకులను చంపేసింది. కనీసం సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసేందుకు కూడా వెనుకాడారంటే సదరు మేకర్స్ కి దీని మీద ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. మలైకా అరోరా ప్రేమలో పడ్డాక అర్జున్ కపూర్ కెరీర్ నాశనం చేసుకున్నాడని ఫ్యాన్స్ ఆవేదన.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…