దీపావళి లాంటి మంచి పండుగ సీజన్ను మన వాళ్లు ఎప్పుడూ పెద్దగా ఉపయోగించుకున్నది లేదు. ఈసారి కూడా అందుకు భిన్నమేమీ కాదు. ప్రతిసారీ ఏదో ఒక మిడ్ రేంజ్ సినిమా అయినా ఉండేది కానీ.. ఈ ఏడాది మరీ దారుణంగా తెలుగు నుంచి అసలు రిలీజే లేకుండా పోయింది. డబ్బింగ్ సినిమాలే ఈ పండక్కి హవా సాగించబోతున్నాయి. తమిళ అనువాదాలు జపాన్, జిగర్తండా డబులెక్స్.. హిందీ డబ్బింగ్ మూవీ టైగర్-3 దీపావళికి తెలుగు రాష్ట్రాల థియేటర్లను ముంచెత్తబోతున్నాయి.
ఈ మూడు చిత్రాలకూ భారీగానే థియేటర్లు ఇవ్వబోతున్నారు. అవి మంచి వసూళ్లు కూడా సాధించే అవకాశాలున్నాయి. తెలుగు సినిమాలు లేవన్న మాటే కానీ.. తెలుగు నిర్మాతలకు దీపావళి సినిమాల్లో స్టేక్స్ లేకుండా ఏమీ లేదు. కార్తి సినిమా జపాన్ను అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ మీద రిలీజ్ చేయబోతున్నారు. కార్తితో ఊపిరి సినిమా చేసినప్పటి నుంచి అతడితో నాగ్ అనుబంధం కొనసాగుతోంది. కార్తి చివరి సినిమా సర్దార్ను కూడా అన్నపూర్ణ బేనర్ మీదే రిలీజ్ చేశారు. జపాన్ మీద మంచి అంచనాలుండటంతో ఓపెనింగ్స్ బాగానే వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇక కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో లారెన్స్, ఎస్.జె.సూర్య నటించిన జిగర్ తండా డబులెక్స్కు కూడా తెలుగులో కొంత క్రేజ్ ఉంది. ఈ చిత్రాన్ని సురేష్ బాబు, ఏషియన్ సునీల్ కలిసి రిలీజ్ చేస్తుండటం విశేషం. ప్రోమోలు బాగున్నాయి కాబట్టి దీనికి కూడా మంచి ఓపెనింగ్స్ రావచ్చు. ఇక టైగర్-3 విషయానికి వస్తే యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు సినిమాను ఇక్కడి వాళ్లకేమీ అమ్మలేదు. కానీ దిల్ రాజు లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ల భాగస్వామ్యంతో తెలుగులో పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి అనువాద సినిమాల మీద పెద్ద పెద్దోళ్లే చేతులు వేశారన్నమాట.
This post was last modified on November 5, 2023 1:59 am
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…