దీపావళి లాంటి మంచి పండుగ సీజన్ను మన వాళ్లు ఎప్పుడూ పెద్దగా ఉపయోగించుకున్నది లేదు. ఈసారి కూడా అందుకు భిన్నమేమీ కాదు. ప్రతిసారీ ఏదో ఒక మిడ్ రేంజ్ సినిమా అయినా ఉండేది కానీ.. ఈ ఏడాది మరీ దారుణంగా తెలుగు నుంచి అసలు రిలీజే లేకుండా పోయింది. డబ్బింగ్ సినిమాలే ఈ పండక్కి హవా సాగించబోతున్నాయి. తమిళ అనువాదాలు జపాన్, జిగర్తండా డబులెక్స్.. హిందీ డబ్బింగ్ మూవీ టైగర్-3 దీపావళికి తెలుగు రాష్ట్రాల థియేటర్లను ముంచెత్తబోతున్నాయి.
ఈ మూడు చిత్రాలకూ భారీగానే థియేటర్లు ఇవ్వబోతున్నారు. అవి మంచి వసూళ్లు కూడా సాధించే అవకాశాలున్నాయి. తెలుగు సినిమాలు లేవన్న మాటే కానీ.. తెలుగు నిర్మాతలకు దీపావళి సినిమాల్లో స్టేక్స్ లేకుండా ఏమీ లేదు. కార్తి సినిమా జపాన్ను అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ మీద రిలీజ్ చేయబోతున్నారు. కార్తితో ఊపిరి సినిమా చేసినప్పటి నుంచి అతడితో నాగ్ అనుబంధం కొనసాగుతోంది. కార్తి చివరి సినిమా సర్దార్ను కూడా అన్నపూర్ణ బేనర్ మీదే రిలీజ్ చేశారు. జపాన్ మీద మంచి అంచనాలుండటంతో ఓపెనింగ్స్ బాగానే వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇక కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో లారెన్స్, ఎస్.జె.సూర్య నటించిన జిగర్ తండా డబులెక్స్కు కూడా తెలుగులో కొంత క్రేజ్ ఉంది. ఈ చిత్రాన్ని సురేష్ బాబు, ఏషియన్ సునీల్ కలిసి రిలీజ్ చేస్తుండటం విశేషం. ప్రోమోలు బాగున్నాయి కాబట్టి దీనికి కూడా మంచి ఓపెనింగ్స్ రావచ్చు. ఇక టైగర్-3 విషయానికి వస్తే యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు సినిమాను ఇక్కడి వాళ్లకేమీ అమ్మలేదు. కానీ దిల్ రాజు లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ల భాగస్వామ్యంతో తెలుగులో పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి అనువాద సినిమాల మీద పెద్ద పెద్దోళ్లే చేతులు వేశారన్నమాట.
This post was last modified on November 5, 2023 1:59 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…