దీపావళి లాంటి మంచి పండుగ సీజన్ను మన వాళ్లు ఎప్పుడూ పెద్దగా ఉపయోగించుకున్నది లేదు. ఈసారి కూడా అందుకు భిన్నమేమీ కాదు. ప్రతిసారీ ఏదో ఒక మిడ్ రేంజ్ సినిమా అయినా ఉండేది కానీ.. ఈ ఏడాది మరీ దారుణంగా తెలుగు నుంచి అసలు రిలీజే లేకుండా పోయింది. డబ్బింగ్ సినిమాలే ఈ పండక్కి హవా సాగించబోతున్నాయి. తమిళ అనువాదాలు జపాన్, జిగర్తండా డబులెక్స్.. హిందీ డబ్బింగ్ మూవీ టైగర్-3 దీపావళికి తెలుగు రాష్ట్రాల థియేటర్లను ముంచెత్తబోతున్నాయి.
ఈ మూడు చిత్రాలకూ భారీగానే థియేటర్లు ఇవ్వబోతున్నారు. అవి మంచి వసూళ్లు కూడా సాధించే అవకాశాలున్నాయి. తెలుగు సినిమాలు లేవన్న మాటే కానీ.. తెలుగు నిర్మాతలకు దీపావళి సినిమాల్లో స్టేక్స్ లేకుండా ఏమీ లేదు. కార్తి సినిమా జపాన్ను అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ మీద రిలీజ్ చేయబోతున్నారు. కార్తితో ఊపిరి సినిమా చేసినప్పటి నుంచి అతడితో నాగ్ అనుబంధం కొనసాగుతోంది. కార్తి చివరి సినిమా సర్దార్ను కూడా అన్నపూర్ణ బేనర్ మీదే రిలీజ్ చేశారు. జపాన్ మీద మంచి అంచనాలుండటంతో ఓపెనింగ్స్ బాగానే వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇక కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో లారెన్స్, ఎస్.జె.సూర్య నటించిన జిగర్ తండా డబులెక్స్కు కూడా తెలుగులో కొంత క్రేజ్ ఉంది. ఈ చిత్రాన్ని సురేష్ బాబు, ఏషియన్ సునీల్ కలిసి రిలీజ్ చేస్తుండటం విశేషం. ప్రోమోలు బాగున్నాయి కాబట్టి దీనికి కూడా మంచి ఓపెనింగ్స్ రావచ్చు. ఇక టైగర్-3 విషయానికి వస్తే యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు సినిమాను ఇక్కడి వాళ్లకేమీ అమ్మలేదు. కానీ దిల్ రాజు లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ల భాగస్వామ్యంతో తెలుగులో పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి అనువాద సినిమాల మీద పెద్ద పెద్దోళ్లే చేతులు వేశారన్నమాట.
This post was last modified on November 5, 2023 1:59 am
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…