‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఇమేజ్ ఏ స్థాయికి వెళ్లిందో తెలిసిందే. ఆ ఇమేజ్కు తగ్గట్లే ఏస్ డైరెక్టర్ శంకర్తో సినిమా సెట్ చేసుకోవడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. చిరంజీవి సహా ఎంతోమంది టాలీవుడ్ టాప్ స్టార్లు శంకర్తో జట్టు కట్టాలని ఆశపడ్డారు. కానీ వాళ్లెవ్వరికీ దక్కని అదృష్టం చరణ్కు దక్కిందని సంబరపడ్డారు. ‘రోబో’ తర్వాత శంకర్ నుంచి ఆయన స్థాయి సినిమా రాకపోయినా సరే.. చరణ్తో ఆయన ఒక బ్లాక్బస్టర్ సినిమా తీస్తాడనే ఆశించారు.
కానీ ఏ ముహూర్తాన ‘గేమ్ చేంజర్’ సినిమా మొదలైందో కానీ.. మూడేళ్లకు కూడా పూర్తి కాని పరిస్థితి. ఈ సినిమా షూటింగ్కు ఎన్నిసార్లు బ్రేకులు పడ్డాయో, ఎంత ఆలస్యం జరుగుతోందో తెలిసిందే. ఐతే ఆలస్యమైతే అయ్యింది ఈ కాంబినేషన్ క్రేజ్కు తగ్గ సినిమా వస్తే చాలు అనుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు ఆ విషయంలోనూ సందేహాలు నెలకొంటున్నాయి.
‘గేమ్ చేంజర్’ను హోల్డ్ చేసి.. శంకర్ పూర్తి చేసిన ‘ఇండియన్-2’ రిలీజ్కు రెడీ అవుతోంది. దీని టీజర్ను నిన్నే లాంచ్ చేశారు. అది చూస్తే శంకర్ తన టచ్ కోల్పోయాడా అన్న సందేహాలు కలిగాయి. ఇందులో విజువల్స్ రిచ్గా అనిపించాయే తప్ప కంటెంట్ ఎగ్జైటింగ్గా మాత్రం లేదు. బోలెడంతమంది నటీనటులు.. రిచ్ లొకేషన్లు.. ప్రతి ఫ్రేమ్లోనూ భారీతనం కనిపించిందే తప్ప.. వావ్ అనిపించే మూమెంట్ ఏదీ అందులో లేదు.
భారతీయుడి పునరాగమనం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని తీసుకురాలేకపోయింది. ఇంట్రో టీజర్ను బట్టి ఒక అంచనాకు వచ్చేయలేం కానీ.. రెండు నిమిషాల నిడివిలో శంకర్ మార్కు మెరుపులు లేకపోవడం మాత్రం ఆయన పనితనం మీద సందేహాలు రేకెత్తించింది. దీంతో చరణ్ అభిమానుల్లో ఒక రకమైన కలవరం మొదలైంది. ‘గేమ్ చేంజర్’ పరిస్థితి ఏమవుతుందో.. శంకర్ ఇదే స్టయిల్లో ఆ సినిమాను కూడా లాగించేస్తుంటే ఏంటి పరిస్థితి అని వాళ్లు కంగారు పడుతున్నారు.
This post was last modified on November 4, 2023 10:29 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…