ఓవర్ ద టాప్ ఫ్లాట్ ఫామ్ అంటే చాలా భారీ స్థాయి వ్యవహారం అనే అభిప్రాయం ఉంది. దాని కోసం సినిమాలు కొనడం.. ఒరిజినల్స్ ప్రొడ్యూస్ చేయడం.. డీల్స్ చేయడం ఇదంతా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంలాగే కనిపిస్తుంది. దీన్ని మేనేజ్ చేయడం నిర్మాతల స్థాయిలో ఉన్న వారికి శక్తికి మించిన భారం అన్నది వాస్తవం. ఐతే టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్.. ‘ఆహా’ పేరుతో ఓటీటీ పెట్టి దాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు.
ముందు దీని సక్సెస్ మీద సందేహాలు కలిగాయి కానీ.. నెమ్మదిగా ప్రయాణం మొదలుపెట్టి ఆ ఓటీటీని ఒక స్థాయిలో నిలబెట్టగలిగారు. ఇప్పటికీ ఆదాయం కంటే పెట్టుబడే ఎక్కువ అయినప్పటికీ.. భవిష్యత్తులో మంచి లాభం వస్తుందని అంచనా వేస్తున్నారు. ‘ఆహా’ జర్నీ చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమో కానీ.. మరో అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం ఓటీటీ వ్యాపారంలోకి దిగుతున్నట్లు సమాచారం.
రాజు నుంచి త్వరలోనే ఒక ఓటీటీ రాబోతోందట. దాని కోసం కంటెంట్ క్రియేషన్ మీద ఇప్పుడు ఆయన దృష్టిసారించినట్లు సమాచారం. ఒక బడ్జెట్ పెట్టి దాదాపు 25 చిన్న సినిమాలను నిర్మించే ప్రయత్నంలో రాజు ఉన్నారట. ఇందుకోసం ఆయనతో మరికొందరు నిర్మాతలు కూడా చేతులు కలుపుతున్నారట. ఒక్కరే భారీ పెట్టుబడి అంటే కష్టమవుతుంది. అందుకే తలో చేయి వస్తున్నట్లు సమాచారం.
దిల్ రాజు ముందుండి తన ప్లానింగ్తో దీన్ని నడిపిస్తారు. రాజు స్వయంగా 60 దాకా సినిమాలు నిర్మించాడు. మున్ముందు ఆయన్నుంచి మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. వీటికి తోడు వేరే సినిమాలు కూడా కొన్ని కొంటే కంటెంట్ ఓ మోస్తరుగా రెడీ అవుతుంది. ఐతే ఓటీటీ అంటే నిరంతరం కొత్త కంటెంట్ ఇస్తూనే ఉండాలి. భారీగా పెట్టుబడి పెట్టి నడిపించాలి. ఇది సవాలుతో కూడుకున్న విషయమే.. రాజు తన ప్లానింగ్తో దీన్ని సక్సెస్ చేయగలడని చెప్పొచ్చు.
This post was last modified on November 4, 2023 7:38 pm
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఎంత అవసరమో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ఆయనను…
మనసుంటే మార్గాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్త ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ కు నిముషాల్లో స్పందించారు.…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…