స్కంద ఓటిటిలో వచ్చాక ఒకపక్క జవాన్ పోటీని తట్టుకుని మరీ భారీ వ్యూస్ తో హాట్ స్టార్ లో దూసుకుపోతూ ఉండగా ఇంకోపక్క కంటెంట్ మీద కామెంట్ల వర్షం కురుస్తూనే ఉంది. ట్రోలింగ్ సంగతి పక్కనపెడితే ఒక ఫైట్ సీక్వెన్స్ లో రామ్ రౌడీలను ఎదురుకునే క్రమంలో దీపపు సమ్మెలను పట్టుకుని వాళ్ళను గాల్లో లేపుతాడు. కేవలం సెకనులో సెకను భాగం మాత్రమే అనిపించే ఒక షాట్ లో రామ్ కి బాడీ డబుల్ గా బోయపాటి శీను కనిపిస్తాడు. దీన్ని నెటిజెన్లు పసిగట్టేసి స్క్రీన్ షాట్స్ తో సహా దాన్ని ట్వీట్ చేశారు. దీని మీద లెక్కలేనన్ని మీమ్స్ ట్విట్టర్ లో హల్చల్ చేశాయి.
ఈ విషయం పట్ల రామ్ స్పందిన ఇలా ఉంది. ఏప్రిల్ 22న విపరీతమైన ఎండల మధ్య పాతిక రోజుల పాటు నిరంతర యాక్షన్ షెడ్యూల్ లో భాగమయ్యాను. అదింకా మూడో రోజే. సరిగా నడవలేని పరిస్థితి వచ్చింది. విపరీతంగా రక్త స్రావం కావడంతో కాస్త విశ్రాంతి కోసం పక్కకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో నా దర్శకుడు ఆ షాట్ లోకి వెళ్ళిపోయి నా కోసం దాంట్లో స్వయంగా పాల్గొని చిత్రీకరించారు. నచ్చడం నచ్చకపోవడం ఆడియన్స్ ఛాయస్. మీ అభిప్రాయాలకు ఎప్పుడూ విలువ ఉంటుంది. ఇదంతా మీ కోసమే. నా దర్శకుడి పట్ల గౌరవం తగ్గదు. ఇలాగే చెమటని రక్తాన్ని చిందించడం ఆపను అంచనాలు సున్నా ఉన్నా సరే.
మొత్తానికి రామ్ రెస్పాండ్ అయిన తీరు అభిమానులను కదిలిస్తోంది. స్కందకే కాదు వినయ విధేయ రామ టైంలోనూ బోయపాటి ఇలాంటి విమర్శలను సోషల్ మీడియా వేదికగా చవి చూడాల్సి వచ్చింది. స్కంద ఓటిటిలో వచ్చాక అదే సీన్ రిపీట్ అయ్యింది. ఒకవేళ అఖండ రేంజ్ లో కంటెంట్ కనక కనెక్ట్ అయ్యుంటే ఇప్పుడీ లాజిక్స్ అన్నీ మేజిక్స్ గా మారిపోయేవి. కానీ రాతలో వైఫల్యం కాస్తా తీతని తేడాగా మార్చేసింది. అయినా జరిగిపోయిన దాన్ని వదిలేయకుండా రామ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం మంచిదే. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చేస్తున్న రామ్ దీనికి కూడా అంతే కష్టపడాల్సి వస్తోంది.
This post was last modified on November 4, 2023 7:33 pm
హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్లో…
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం…
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం.. అంతా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది…