పఠాన్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో పావు గంట సేపు అది కూడా ఒక అదిరిపోయే ట్రైన్ ఫైట్ లో కనిపిస్తేనే థియేటర్లు మోతెక్కిపోయాయి. ఆ సినిమా సక్సెస్ లో ఈ ఎపిసోడ్ షేర్ ని తక్కువ చేసి చెప్పలేం. అంత గొప్పగా తెరమీద పండింది. దానికి బాద్షా ఋణం తీర్చుకుంటూ టైగర్ 3లో స్పెషల్ క్యామియో చేస్తున్న సంగతి అల్రెడీ లీకైపోయింది. టెర్రిఫిక్ అనిపించే ఒక యాక్షన్ ఛేజ్ లో ఇద్దరూ కలిసి షోలే బైకు మీద రోడ్ల మీద పరుగులు పెడుతూ ఆ తర్వాత రకరకాల విన్యాసాలతో విలన్ ఇమ్రాన్ ఆష్మి గ్యాంగ్ కి ముచ్చెమటలు పట్టిస్తారట. ఓ రేంజ్ లో పేలుతుందని టాక్.
దీనికే ఇలా అనిపిస్తే ఇప్పుడు వీళ్లకు హృతిక్ రోషన్ తోడైతే ఎలా ఉంటుంది. సీక్రెట్ గా దాచడానికి విశ్వప్రయత్నం చేశారు కానీ టైగర్ 3లో అతను ఉండటం కన్ఫర్మ్ అని ముంబై మీడియా టాక్. ఎక్కువసేపు కాకపోయినా కనిపించే కనిపించే కాసేపు ఎవరూ కుర్చీలలో కూర్చోలేరని యూనిట్ సభ్యులు ఊరిస్తున్నారు. టైగర్ జిందా హై, వార్, పఠాన్ లను కలుపుతూ స్పై యూనివర్స్ సృష్టిస్తున్న యష్ రాజ్ సంస్థ అందులో భాగంగానే ఈ అపూర్వ కలయికను సెట్ చేసిందట. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 రిలీజయ్యాక ఈ బ్యాచ్ లో తోడవుతాడు. నెక్స్ట్ వచ్చే సిరీస్ లో తననీ చూడొచ్చు.
రోజులు దగ్గరపడే కొద్దీ టైగర్ 3 మీద అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధిస్తుందని ఇప్పటికే లెక్కలు కడుతున్నారు. దానికి తోడు ఇలాంటి లీకులు అంతకంతా హైప్ ని పెంచుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 25 విడుదల కాబోతున్న ఫైటర్ ఒకటే ఈ స్పై యూనివర్స్ కి దూరంగా డిఫరెంట్ సబ్జెక్టుతో వస్తుంది. ఆ తర్వాత టైగర్ వర్సెస్ పఠాన్ లో షారుఖ్, సల్మాన్ ఇద్దరూ ఫుల్ లెన్త్ రోల్స్ చేయనుండగా దాంట్లో స్పై హీరోలందరూ చేతులు కలిపే అవకాశముంది. నవంబర్ 12 టైగర్ 3 తెలుగు వెర్షన్ ని సైతం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…
రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…