పఠాన్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో పావు గంట సేపు అది కూడా ఒక అదిరిపోయే ట్రైన్ ఫైట్ లో కనిపిస్తేనే థియేటర్లు మోతెక్కిపోయాయి. ఆ సినిమా సక్సెస్ లో ఈ ఎపిసోడ్ షేర్ ని తక్కువ చేసి చెప్పలేం. అంత గొప్పగా తెరమీద పండింది. దానికి బాద్షా ఋణం తీర్చుకుంటూ టైగర్ 3లో స్పెషల్ క్యామియో చేస్తున్న సంగతి అల్రెడీ లీకైపోయింది. టెర్రిఫిక్ అనిపించే ఒక యాక్షన్ ఛేజ్ లో ఇద్దరూ కలిసి షోలే బైకు మీద రోడ్ల మీద పరుగులు పెడుతూ ఆ తర్వాత రకరకాల విన్యాసాలతో విలన్ ఇమ్రాన్ ఆష్మి గ్యాంగ్ కి ముచ్చెమటలు పట్టిస్తారట. ఓ రేంజ్ లో పేలుతుందని టాక్.
దీనికే ఇలా అనిపిస్తే ఇప్పుడు వీళ్లకు హృతిక్ రోషన్ తోడైతే ఎలా ఉంటుంది. సీక్రెట్ గా దాచడానికి విశ్వప్రయత్నం చేశారు కానీ టైగర్ 3లో అతను ఉండటం కన్ఫర్మ్ అని ముంబై మీడియా టాక్. ఎక్కువసేపు కాకపోయినా కనిపించే కనిపించే కాసేపు ఎవరూ కుర్చీలలో కూర్చోలేరని యూనిట్ సభ్యులు ఊరిస్తున్నారు. టైగర్ జిందా హై, వార్, పఠాన్ లను కలుపుతూ స్పై యూనివర్స్ సృష్టిస్తున్న యష్ రాజ్ సంస్థ అందులో భాగంగానే ఈ అపూర్వ కలయికను సెట్ చేసిందట. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 రిలీజయ్యాక ఈ బ్యాచ్ లో తోడవుతాడు. నెక్స్ట్ వచ్చే సిరీస్ లో తననీ చూడొచ్చు.
రోజులు దగ్గరపడే కొద్దీ టైగర్ 3 మీద అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధిస్తుందని ఇప్పటికే లెక్కలు కడుతున్నారు. దానికి తోడు ఇలాంటి లీకులు అంతకంతా హైప్ ని పెంచుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 25 విడుదల కాబోతున్న ఫైటర్ ఒకటే ఈ స్పై యూనివర్స్ కి దూరంగా డిఫరెంట్ సబ్జెక్టుతో వస్తుంది. ఆ తర్వాత టైగర్ వర్సెస్ పఠాన్ లో షారుఖ్, సల్మాన్ ఇద్దరూ ఫుల్ లెన్త్ రోల్స్ చేయనుండగా దాంట్లో స్పై హీరోలందరూ చేతులు కలిపే అవకాశముంది. నవంబర్ 12 టైగర్ 3 తెలుగు వెర్షన్ ని సైతం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.
This post was last modified on November 4, 2023 6:32 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…