పఠాన్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో పావు గంట సేపు అది కూడా ఒక అదిరిపోయే ట్రైన్ ఫైట్ లో కనిపిస్తేనే థియేటర్లు మోతెక్కిపోయాయి. ఆ సినిమా సక్సెస్ లో ఈ ఎపిసోడ్ షేర్ ని తక్కువ చేసి చెప్పలేం. అంత గొప్పగా తెరమీద పండింది. దానికి బాద్షా ఋణం తీర్చుకుంటూ టైగర్ 3లో స్పెషల్ క్యామియో చేస్తున్న సంగతి అల్రెడీ లీకైపోయింది. టెర్రిఫిక్ అనిపించే ఒక యాక్షన్ ఛేజ్ లో ఇద్దరూ కలిసి షోలే బైకు మీద రోడ్ల మీద పరుగులు పెడుతూ ఆ తర్వాత రకరకాల విన్యాసాలతో విలన్ ఇమ్రాన్ ఆష్మి గ్యాంగ్ కి ముచ్చెమటలు పట్టిస్తారట. ఓ రేంజ్ లో పేలుతుందని టాక్.
దీనికే ఇలా అనిపిస్తే ఇప్పుడు వీళ్లకు హృతిక్ రోషన్ తోడైతే ఎలా ఉంటుంది. సీక్రెట్ గా దాచడానికి విశ్వప్రయత్నం చేశారు కానీ టైగర్ 3లో అతను ఉండటం కన్ఫర్మ్ అని ముంబై మీడియా టాక్. ఎక్కువసేపు కాకపోయినా కనిపించే కనిపించే కాసేపు ఎవరూ కుర్చీలలో కూర్చోలేరని యూనిట్ సభ్యులు ఊరిస్తున్నారు. టైగర్ జిందా హై, వార్, పఠాన్ లను కలుపుతూ స్పై యూనివర్స్ సృష్టిస్తున్న యష్ రాజ్ సంస్థ అందులో భాగంగానే ఈ అపూర్వ కలయికను సెట్ చేసిందట. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 రిలీజయ్యాక ఈ బ్యాచ్ లో తోడవుతాడు. నెక్స్ట్ వచ్చే సిరీస్ లో తననీ చూడొచ్చు.
రోజులు దగ్గరపడే కొద్దీ టైగర్ 3 మీద అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధిస్తుందని ఇప్పటికే లెక్కలు కడుతున్నారు. దానికి తోడు ఇలాంటి లీకులు అంతకంతా హైప్ ని పెంచుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 25 విడుదల కాబోతున్న ఫైటర్ ఒకటే ఈ స్పై యూనివర్స్ కి దూరంగా డిఫరెంట్ సబ్జెక్టుతో వస్తుంది. ఆ తర్వాత టైగర్ వర్సెస్ పఠాన్ లో షారుఖ్, సల్మాన్ ఇద్దరూ ఫుల్ లెన్త్ రోల్స్ చేయనుండగా దాంట్లో స్పై హీరోలందరూ చేతులు కలిపే అవకాశముంది. నవంబర్ 12 టైగర్ 3 తెలుగు వెర్షన్ ని సైతం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.
This post was last modified on November 4, 2023 6:32 pm
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…