శాండల్ వుడ్ సీనియర్ మోస్ట్ హీరో శివరాజ్ కుమార్ కు తెలుగులో ముందు నుంచి మార్కెట్ లేదు. ఆయన నటించిన ఓం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇక్కడ రీమేక్ కావడంతో ఎక్కువ డబ్బింగ్ చూసే ఛాన్స్ దక్కలేదు. కన్నడనాట మాత్రం తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ లెజెండరీ స్టార్ మన ఆడియన్స్ కి దగ్గరయింది మాత్రం జైలర్ లో చేసిన చిన్న పాత్ర వల్లే. నరసింహా క్యారెక్టర్ లో రజినీకాంత్ కుటుంబాన్ని కాపాడే బాధ్యత తీసుకునే స్నేహితుడిగా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. క్లైమాక్స్ లో కనిపించేది కొన్ని నిమిషాలే అయినా ఆ ఇంపాక్ట్ చాలా బలంగా ఉండిపోయింది.
అందుకే ఈయన కొత్త ప్యాన్ ఇండియా మూవీ ఘోస్ట్ ని ఇవాళ థియేటర్లలో విడుదల చేశారు. నిజానికిది అక్టోబర్ 20న దసరా పండగ సందర్భంగా కన్నడలో రిలీజయ్యింది. కానీ మనదగ్గర భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావుల పోటీ ఉండటంతో డ్రాప్ చేశారు. తీరా చూస్తే అక్కడేమి అదిరిపోయే బ్లాక్ బస్టర్ కాలేదు. భారీగా తీశారు కానీ ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. అయినా సరే శివన్న ఇమేజ్ సహాయంతో నిర్మాతలు బాగానే రికవర్ చేసుకున్నారు. అలాంటి యావరేజ్ కంటెంట్ ఎంత రిచ్ గా ఉన్నా సరే తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం కష్టమే.
ఘోస్ట్ కి కనీస స్థాయిలో బజ్ లేదు. హక్కులు కొన్న నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ లాంటి కార్యక్రమాలు చేయలేదు. దీనికన్నా ముందు వేదాకు బాలకృష్ణని గెస్టుగా తీసుకొచ్చి మరీ శివరాజ్ కుమార్ ప్రమోషన్ లో భాగమయ్యాడు. కానీ ఘోస్ట్ విషయంలో అంత ఆసక్తి చూపించలేదు. కారణం రెండు వారాలు దాటడమేనని ఇన్ సైడ్ టాక్. ఒకపక్క మా ఊరి పొలిమేర 2 ఊపందుకుంటోంది. కీడా కోలా టాక్ ఎలా ఉన్నా క్రేజ్ తో వీకెండ్ వరకు బాగానే వెళ్లేలా ఉంది. ఎటొచ్చి ఘోస్ట్ ని పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. మరి ఏమైనా సర్ప్రైజ్ టాక్ వచ్చి అమాంతం జనాన్ని రప్పిస్తుందేమో చూడాలి. ఇది జరిగే పనేనా.
This post was last modified on November 4, 2023 3:10 pm
జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…