లెజెండరీ కమెడియన్ అనే మాట బ్రహ్మానందం గారికి చాలా చిన్నది. వర్తమానంలోనే కాదు భవిష్యత్తులోనూ ఎవరికీ సాధ్యం కాదనిపించే వెయ్యికి పైగా సినిమాల మైలురాయిని అందుకున్నారు. ఇప్పటికీ షూటింగులకు, సభలకు మంచి ఉత్సాహంతో ఉన్న తొణికిసలాడే ఆయన్ని చూస్తే ఎవరికైనా హుషారు వచ్చేస్తుంది. వయసు దృష్ట్యా అన్ని పాత్రలు ఒప్పుకోకపోయినా నచ్చినవి మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు. రంగ మార్తాండలో ఏడిపించే వేషమే అయినా ప్రకాష్ రాజ్ తో పోటీ పడి మరీ కన్నీళ్లు తెప్పించారు. జాతిరత్నాలులో కనిపించేది అయిదు నిమిషాలే. కానీ జడ్జ్ గా ఆ కాసేపు చక్కిలిగింతలు పెట్టేశారు.
కీడా కోలాలో బ్రహ్మానందం ఉన్నారని తెలియగానే అభిమానులు తెగ సంబరపడ్డారు. కొత్త ఆర్టిస్టులతోనే అద్భుతమైన అవుట్ ఫుట్ రాబట్టుకునే దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈసారి ఏ రేంజ్ లో తమ అభిమాన హాస్య నటుడిని చూపిస్తారోనని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూశారు. తీరా చూస్తే వీల్ చైర్ కి పరిమితమై, అతి కొద్ది డైలాగులు పెట్టి, తక్కువ ఎక్స్ ప్రెషన్లతో పెద్దగా వాడుకోలేపోవడం నిరాశ పరిచింది. దానికి చోటు చక్రాల కుర్చీకి ఆయన జబ్బుని ముడిపెట్టి ఏదో కామెడీ చేయించబోయారు కానీ అది కూడా ఏమంత పండలేదు. తరుణ్ భాస్కర్ సరైన ఎపిసోడ్స్ రాసుకోవడంలో తడబడ్డాడు.
ఏదైతేనేం టాక్ అయితే డివైడ్ గా వచ్చేసింది. వీకెండ్ అయ్యాక ఫైనల్ గా కీడా కోలా ఫ్లాపు హిట్టుకి మధ్య ఎక్కడ నిలబడుతుందో క్లారిటీ వస్తుంది. ఆరోగ్యం అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతున్నా బ్రహ్మానందంలో మునుపటి ఎనర్జీ అలాగే ఉంది. కాకపోతే దాన్ని పిండుకునే కళ తెలియాలి. అను దీప్ కేవలం మూడు డైలాగులతో నవ్వులు పండించాడుగా. అయినా స్క్రీన్ మొత్తం కుర్ర ఆర్టిస్టులతో నిండిపోయిన కీడా కోలాలో మోస్ట్ సీనియర్ కి ప్రాధాన్యం తగ్గడం నిరాశ పరిచినా ఆయన మీద ఇంకా ఎలాంటి పాత్రలు రాసుకోవచ్చో ఇతర దర్శకులకు క్లారిటీ వచ్చింది. ఆ దిశగా ఎవరైనా చొరవ తీసుకుంటారేమో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…