లెజెండరీ కమెడియన్ అనే మాట బ్రహ్మానందం గారికి చాలా చిన్నది. వర్తమానంలోనే కాదు భవిష్యత్తులోనూ ఎవరికీ సాధ్యం కాదనిపించే వెయ్యికి పైగా సినిమాల మైలురాయిని అందుకున్నారు. ఇప్పటికీ షూటింగులకు, సభలకు మంచి ఉత్సాహంతో ఉన్న తొణికిసలాడే ఆయన్ని చూస్తే ఎవరికైనా హుషారు వచ్చేస్తుంది. వయసు దృష్ట్యా అన్ని పాత్రలు ఒప్పుకోకపోయినా నచ్చినవి మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు. రంగ మార్తాండలో ఏడిపించే వేషమే అయినా ప్రకాష్ రాజ్ తో పోటీ పడి మరీ కన్నీళ్లు తెప్పించారు. జాతిరత్నాలులో కనిపించేది అయిదు నిమిషాలే. కానీ జడ్జ్ గా ఆ కాసేపు చక్కిలిగింతలు పెట్టేశారు.
కీడా కోలాలో బ్రహ్మానందం ఉన్నారని తెలియగానే అభిమానులు తెగ సంబరపడ్డారు. కొత్త ఆర్టిస్టులతోనే అద్భుతమైన అవుట్ ఫుట్ రాబట్టుకునే దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈసారి ఏ రేంజ్ లో తమ అభిమాన హాస్య నటుడిని చూపిస్తారోనని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూశారు. తీరా చూస్తే వీల్ చైర్ కి పరిమితమై, అతి కొద్ది డైలాగులు పెట్టి, తక్కువ ఎక్స్ ప్రెషన్లతో పెద్దగా వాడుకోలేపోవడం నిరాశ పరిచింది. దానికి చోటు చక్రాల కుర్చీకి ఆయన జబ్బుని ముడిపెట్టి ఏదో కామెడీ చేయించబోయారు కానీ అది కూడా ఏమంత పండలేదు. తరుణ్ భాస్కర్ సరైన ఎపిసోడ్స్ రాసుకోవడంలో తడబడ్డాడు.
ఏదైతేనేం టాక్ అయితే డివైడ్ గా వచ్చేసింది. వీకెండ్ అయ్యాక ఫైనల్ గా కీడా కోలా ఫ్లాపు హిట్టుకి మధ్య ఎక్కడ నిలబడుతుందో క్లారిటీ వస్తుంది. ఆరోగ్యం అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతున్నా బ్రహ్మానందంలో మునుపటి ఎనర్జీ అలాగే ఉంది. కాకపోతే దాన్ని పిండుకునే కళ తెలియాలి. అను దీప్ కేవలం మూడు డైలాగులతో నవ్వులు పండించాడుగా. అయినా స్క్రీన్ మొత్తం కుర్ర ఆర్టిస్టులతో నిండిపోయిన కీడా కోలాలో మోస్ట్ సీనియర్ కి ప్రాధాన్యం తగ్గడం నిరాశ పరిచినా ఆయన మీద ఇంకా ఎలాంటి పాత్రలు రాసుకోవచ్చో ఇతర దర్శకులకు క్లారిటీ వచ్చింది. ఆ దిశగా ఎవరైనా చొరవ తీసుకుంటారేమో చూడాలి.
This post was last modified on November 4, 2023 12:13 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…