Movie News

బ్రహ్మానందంని వాడుకునే తీరు ఇదేనా

లెజెండరీ కమెడియన్ అనే మాట బ్రహ్మానందం గారికి చాలా చిన్నది. వర్తమానంలోనే కాదు భవిష్యత్తులోనూ ఎవరికీ సాధ్యం కాదనిపించే వెయ్యికి పైగా సినిమాల మైలురాయిని అందుకున్నారు. ఇప్పటికీ షూటింగులకు, సభలకు మంచి ఉత్సాహంతో ఉన్న తొణికిసలాడే ఆయన్ని చూస్తే ఎవరికైనా హుషారు వచ్చేస్తుంది. వయసు దృష్ట్యా అన్ని పాత్రలు ఒప్పుకోకపోయినా నచ్చినవి మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు. రంగ మార్తాండలో ఏడిపించే వేషమే అయినా ప్రకాష్ రాజ్ తో పోటీ పడి మరీ కన్నీళ్లు తెప్పించారు. జాతిరత్నాలులో కనిపించేది అయిదు నిమిషాలే. కానీ జడ్జ్ గా ఆ కాసేపు చక్కిలిగింతలు పెట్టేశారు.

కీడా కోలాలో బ్రహ్మానందం ఉన్నారని తెలియగానే అభిమానులు తెగ సంబరపడ్డారు. కొత్త ఆర్టిస్టులతోనే అద్భుతమైన అవుట్ ఫుట్ రాబట్టుకునే దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈసారి ఏ రేంజ్ లో తమ అభిమాన హాస్య నటుడిని చూపిస్తారోనని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూశారు. తీరా చూస్తే వీల్ చైర్ కి పరిమితమై, అతి కొద్ది డైలాగులు పెట్టి, తక్కువ ఎక్స్ ప్రెషన్లతో పెద్దగా వాడుకోలేపోవడం నిరాశ పరిచింది. దానికి చోటు చక్రాల కుర్చీకి ఆయన జబ్బుని ముడిపెట్టి ఏదో కామెడీ చేయించబోయారు కానీ అది కూడా ఏమంత పండలేదు. తరుణ్ భాస్కర్ సరైన ఎపిసోడ్స్ రాసుకోవడంలో తడబడ్డాడు.

ఏదైతేనేం టాక్ అయితే డివైడ్ గా వచ్చేసింది. వీకెండ్ అయ్యాక ఫైనల్ గా కీడా కోలా ఫ్లాపు హిట్టుకి మధ్య ఎక్కడ నిలబడుతుందో క్లారిటీ వస్తుంది. ఆరోగ్యం అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతున్నా బ్రహ్మానందంలో మునుపటి ఎనర్జీ అలాగే ఉంది. కాకపోతే దాన్ని పిండుకునే కళ తెలియాలి. అను దీప్ కేవలం మూడు డైలాగులతో నవ్వులు పండించాడుగా. అయినా స్క్రీన్ మొత్తం కుర్ర ఆర్టిస్టులతో నిండిపోయిన కీడా కోలాలో మోస్ట్ సీనియర్ కి ప్రాధాన్యం తగ్గడం నిరాశ పరిచినా ఆయన మీద ఇంకా ఎలాంటి పాత్రలు రాసుకోవచ్చో ఇతర దర్శకులకు క్లారిటీ వచ్చింది. ఆ దిశగా ఎవరైనా చొరవ తీసుకుంటారేమో చూడాలి. 

This post was last modified on November 4, 2023 12:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

5 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago