తరుణ్ భాస్కర్ అంటే ప్రధానంగా దర్శకుడిగానే గుర్తింపు ఉండేది ఇన్నాళ్లూ. తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో అతను ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. ఆ చిత్రం తెలుగుల్లోకి ఒక తాజాదనం తీసుకొచ్చింది. ఆ సినిమా ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ దక్కిచుకోవడంతో పాటు అవార్డులు కూడా గెలుచుకుంది. తరుణ్ రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ సైతం యూత్ను బాగా ఆకట్టుకుంది. దీంతో దర్శకుడిగా తరుణ్ ఒక స్థాయిలో నిలబడ్డాడు.
ఆ తర్వాత తరుణ్ భాస్కర్ నటుడిగా ‘మీకు మాత్రమే చెప్తా’లో లీడ్ రోల్ చేయడమే కాక సహా పలు చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేశాడు. నటుడిగా కూడా అతను మెప్పించినప్పటికీ.. దర్శకుడిగానే తరుణ్కు ఫ్యాన్స్ ఎక్కువ. కానీ ‘కీడా కోలా’తో మాత్రం సీన్ మారిపోయింది. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించడమే కాక ఇందులో నాయుడు అనే కీలక పాత్ర కూడా పోషించాడు తరుణ్.
ఐతే ‘కీడా కోలా’లో దర్శకుడు తరుణ్ భాస్కర్ను నటుడు తరుణ్ భాస్కర్ పూర్తిగా డామినేట్ చేశాడు. ‘కీడా కోలా’లో పేరుకు చైతన్యరావు హీరో కానీ.. సినిమాను భుజాల మీద నడిపించింది మాత్రం తరుణే. సినిమాలో నాయుడి పాత్ర రంగ ప్రవేశం తర్వాతే ఎంటర్టైన్మెంట్ డోస్ మొదలవుతుంది. కథనం ఊపందుకుంటుంది. తెరపై తరుణ్ కనిపించిన ప్రతిసారీ నవ్వులకు ఢోకా లేదు. మంచి ఎలివేషన్ సీన్లు కూడా పడటంతో ఈ పాత్రకు థియేటర్లలో అదిరిపోయే స్పందన వస్తోంది.
ఎలాంటి హడావుడి లేకుండా సటిల్ యాక్టింగ్తో, సింపుల్ ఎక్స్ప్రెషన్లతోనే తరుణ్ మంచి కామెడీ పండించాడు. నటుడిగా సినిమాలో అతను షో స్టీలర్ అనడంలో సందేహం లేదు. ఐతే యాక్టర్గా ఇంత మెప్పించిన తరుణ్.. రైటర్ కమ్ డైరెక్టర్గా మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. సినిమాలో కొన్ని కామెడీ సీన్లు భలేగా పేలాయి కానీ.. ఇంకా బలమైన కథ.. బిగి ఉన్న కథనం తోడై ఉంటే సినిమా వేరే స్థాయిలో నిలబడేది. అవి లేక ‘యావరేజ్’ అనిపించుకుంటోంది.
This post was last modified on November 4, 2023 9:21 am
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…