తరుణ్ భాస్కర్ అంటే ప్రధానంగా దర్శకుడిగానే గుర్తింపు ఉండేది ఇన్నాళ్లూ. తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో అతను ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. ఆ చిత్రం తెలుగుల్లోకి ఒక తాజాదనం తీసుకొచ్చింది. ఆ సినిమా ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ దక్కిచుకోవడంతో పాటు అవార్డులు కూడా గెలుచుకుంది. తరుణ్ రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ సైతం యూత్ను బాగా ఆకట్టుకుంది. దీంతో దర్శకుడిగా తరుణ్ ఒక స్థాయిలో నిలబడ్డాడు.
ఆ తర్వాత తరుణ్ భాస్కర్ నటుడిగా ‘మీకు మాత్రమే చెప్తా’లో లీడ్ రోల్ చేయడమే కాక సహా పలు చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేశాడు. నటుడిగా కూడా అతను మెప్పించినప్పటికీ.. దర్శకుడిగానే తరుణ్కు ఫ్యాన్స్ ఎక్కువ. కానీ ‘కీడా కోలా’తో మాత్రం సీన్ మారిపోయింది. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించడమే కాక ఇందులో నాయుడు అనే కీలక పాత్ర కూడా పోషించాడు తరుణ్.
ఐతే ‘కీడా కోలా’లో దర్శకుడు తరుణ్ భాస్కర్ను నటుడు తరుణ్ భాస్కర్ పూర్తిగా డామినేట్ చేశాడు. ‘కీడా కోలా’లో పేరుకు చైతన్యరావు హీరో కానీ.. సినిమాను భుజాల మీద నడిపించింది మాత్రం తరుణే. సినిమాలో నాయుడి పాత్ర రంగ ప్రవేశం తర్వాతే ఎంటర్టైన్మెంట్ డోస్ మొదలవుతుంది. కథనం ఊపందుకుంటుంది. తెరపై తరుణ్ కనిపించిన ప్రతిసారీ నవ్వులకు ఢోకా లేదు. మంచి ఎలివేషన్ సీన్లు కూడా పడటంతో ఈ పాత్రకు థియేటర్లలో అదిరిపోయే స్పందన వస్తోంది.
ఎలాంటి హడావుడి లేకుండా సటిల్ యాక్టింగ్తో, సింపుల్ ఎక్స్ప్రెషన్లతోనే తరుణ్ మంచి కామెడీ పండించాడు. నటుడిగా సినిమాలో అతను షో స్టీలర్ అనడంలో సందేహం లేదు. ఐతే యాక్టర్గా ఇంత మెప్పించిన తరుణ్.. రైటర్ కమ్ డైరెక్టర్గా మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. సినిమాలో కొన్ని కామెడీ సీన్లు భలేగా పేలాయి కానీ.. ఇంకా బలమైన కథ.. బిగి ఉన్న కథనం తోడై ఉంటే సినిమా వేరే స్థాయిలో నిలబడేది. అవి లేక ‘యావరేజ్’ అనిపించుకుంటోంది.
This post was last modified on November 4, 2023 9:21 am
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…