తరుణ్ భాస్కర్ అంటే ప్రధానంగా దర్శకుడిగానే గుర్తింపు ఉండేది ఇన్నాళ్లూ. తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో అతను ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. ఆ చిత్రం తెలుగుల్లోకి ఒక తాజాదనం తీసుకొచ్చింది. ఆ సినిమా ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ దక్కిచుకోవడంతో పాటు అవార్డులు కూడా గెలుచుకుంది. తరుణ్ రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ సైతం యూత్ను బాగా ఆకట్టుకుంది. దీంతో దర్శకుడిగా తరుణ్ ఒక స్థాయిలో నిలబడ్డాడు.
ఆ తర్వాత తరుణ్ భాస్కర్ నటుడిగా ‘మీకు మాత్రమే చెప్తా’లో లీడ్ రోల్ చేయడమే కాక సహా పలు చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేశాడు. నటుడిగా కూడా అతను మెప్పించినప్పటికీ.. దర్శకుడిగానే తరుణ్కు ఫ్యాన్స్ ఎక్కువ. కానీ ‘కీడా కోలా’తో మాత్రం సీన్ మారిపోయింది. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించడమే కాక ఇందులో నాయుడు అనే కీలక పాత్ర కూడా పోషించాడు తరుణ్.
ఐతే ‘కీడా కోలా’లో దర్శకుడు తరుణ్ భాస్కర్ను నటుడు తరుణ్ భాస్కర్ పూర్తిగా డామినేట్ చేశాడు. ‘కీడా కోలా’లో పేరుకు చైతన్యరావు హీరో కానీ.. సినిమాను భుజాల మీద నడిపించింది మాత్రం తరుణే. సినిమాలో నాయుడి పాత్ర రంగ ప్రవేశం తర్వాతే ఎంటర్టైన్మెంట్ డోస్ మొదలవుతుంది. కథనం ఊపందుకుంటుంది. తెరపై తరుణ్ కనిపించిన ప్రతిసారీ నవ్వులకు ఢోకా లేదు. మంచి ఎలివేషన్ సీన్లు కూడా పడటంతో ఈ పాత్రకు థియేటర్లలో అదిరిపోయే స్పందన వస్తోంది.
ఎలాంటి హడావుడి లేకుండా సటిల్ యాక్టింగ్తో, సింపుల్ ఎక్స్ప్రెషన్లతోనే తరుణ్ మంచి కామెడీ పండించాడు. నటుడిగా సినిమాలో అతను షో స్టీలర్ అనడంలో సందేహం లేదు. ఐతే యాక్టర్గా ఇంత మెప్పించిన తరుణ్.. రైటర్ కమ్ డైరెక్టర్గా మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. సినిమాలో కొన్ని కామెడీ సీన్లు భలేగా పేలాయి కానీ.. ఇంకా బలమైన కథ.. బిగి ఉన్న కథనం తోడై ఉంటే సినిమా వేరే స్థాయిలో నిలబడేది. అవి లేక ‘యావరేజ్’ అనిపించుకుంటోంది.
This post was last modified on November 4, 2023 9:21 am
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…