రీ రిలీజుల ట్రెండ్ మీద జనానికి వెగటు వచ్చేసిందని చెప్పడానికి ఈ మధ్య ప్రత్యక్ష ఉదాహరణలు కనిపిస్తున్నాయి. శంకర్ దాకా ఎంబిబిఎస్ రేపు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే గ్రౌండ్ లెవెల్ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవని బయ్యర్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో రెండు మూడు మెయిన్ స్క్రీన్లు తప్ప తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం రెస్పాన్స్ జనాల నాడిని తెలియజేస్తోందని అంటున్నారు. ఏడాది కాలంగా ఇబ్బడిముబ్బడిగా పాత సినిమాలను థియేటర్లలో వదులుతూనే ఉన్నారు. ఒకదశలో కొన్ని కొత్తవాటిని సైతం దెబ్బ తీశాయి కూడా.
క్రమంగా ఇవి ఓవర్ డోస్ కావడంతో ఆ ప్రభావం ఇప్పుడొచ్చే వాటి మీద పడుతోంది. ఆ మధ్య 7జి బృందావన్ కాలనీ ఈ కారణంగా వృథా అయ్యింది. అంత గొప్ప కల్ట్ క్లాసిక్ ని జనం లైట్ తీసుకున్నారు. ఇప్పుడు శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి మెగా మూవీకి ఈ పరిస్థితి రావడం విచారకరం. అయినా ఎంత పబ్లిక్ చూస్తున్నారని కొత్త రేట్లతో ఇంటర్ నెట్ లో ఫ్రీగా దొరికే సినిమాలను మళ్ళీ మళ్ళీ చూపిస్తామంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. ఎగ్జిబిటర్లు కనీసం తగ్గించే దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు సరికదా వదలడానికి ఇంకేం బ్యాలన్స్ ఉన్నాయో ఇరవై ఏళ్ళ హిట్ సినిమాల లిస్టు వెతుకుతున్నారు.
ఇదిక్కడితో అయిపోవడం లేదు. పదిహేడో తారీఖు అదుర్స్ వస్తోంది. సింహాద్రి, బాద్షా, ఆంధ్రావాలా అయిపోయాయి. తారక్ ఫ్యాన్స్ దీనికి ఏ మాత్రం ఆసక్తి చూపిస్తారో వెయిట్ చేయాలి. రజనీకాంత్ ముత్తు, శివాజీలను సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ చివర్లో రవితేజ వెంకీ వస్తోంది. ఆఖరికి ధనుష్ డబ్బింగ్ మూవీ సింహ పుత్రుడుని సైతం రిలీజ్ చేసేందుకు తెగబడుతున్నారంటే ఈ ట్రెండ్ ని ఎంత అతిగా అంచనా వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయినా కొంచెం గ్యాప్ ఇచ్చి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కానీ ఏదో వరద వచ్చినట్టు ఇన్నేసి వదులుతుంటే మొహం మొత్తక అంతకన్నా ఏమవుతుంది.
This post was last modified on November 3, 2023 11:12 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…