ఒకప్పుడు కల్ట్ ఫిలిం మేకర్ గా శివ, రంగీలా, సత్య, గాయం లాంటి క్లాసిక్స్ ఇచ్చిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు దర్శకుడిగా ఏ స్థాయికి దిగిపోయి అడల్ట్ కంటెంట్ తో పాటు పొలిటికల్ అజెండా ఉన్న సినిమాలు ఎలా తీస్తున్నారో అభిమానులతో సహా అందరూ చూస్తూనే ఉన్నారు. నవ్విపోదురుగాక నాకేంటి అన్న తరహా వర్మ వ్యవహార శైలి ఆయన ఇష్టమే అయినా ఎందరో ఫిలిం మేకర్స్ కి స్ఫూర్తినిచ్చి ఇలా దిగిపోవడం బాధ కలిగించేదే. తాజాగా ఆయన తీసిన వ్యూహంకి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రివైజింగ్ కమిటికీ సిఫార్స్ చేస్తూ నిర్మాతకు అఫీషియల్ గా లెటర్ వచ్చింది.
వర్మ మాత్రం ఈ సీరియస్ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. సెన్సార్ ని గౌరవిస్తామని చెబుతూనే అరచేత్తో సూర్యుడిని ఆపలేరు అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ డైలాగులు వల్లెవేస్తున్నారు. వ్యూహం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తీసిన సినిమాగా పేర్కొంటూ టిడిపి తరఫున లోకేష్ ఫిర్యాదు చేయడం వల్ల ఈ వ్యవహారం మలుపు తిరిగింది. వర్మ ఇది ఎవరిని ఉద్దేశించి తీయలేదని చెబుతూ వితండవాదం చేస్తున్నారు కానీ ట్రైలర్ చూస్తే చిన్న పిల్లాడైనా సరే జగన్ ఎవరో బాబు ఎవరో పవన్ ఎవరో గుర్తుపట్టేంత సులభంగా మేకప్పులతో సహా చాలా స్పష్టంగా చూపించారు.
అలాంటప్పుడు నాకెలాంటి దురుద్దేశం లేదని, నిజాలు మాత్రమే చూపించానని చెప్పడం జోకే. అలా అయితే జగన్ మీదున్న కేసులు, 16 నెలలు జైలులో ఉండి బెయిలు మీద బయటికి రావడం, పాలనలోకి వచ్చాక జరిగిన అక్రమాలు ఇవి కూడా చూపిస్తారాని తెలుగుదేశం, జనసేన మద్దతుదారులు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలు అడిగితే మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళ రీతిలో సమాధానం చెబుతారు. ఒకవేళ వ్యూహంకు థియేటర్ రిలీజ్ సాధ్యం కాకపోతే చేతిలో ఉన్న ఒకే అస్త్రం ఓటిటి. ఎవరూ ఆపలేరు అనేదానికి మీనింగ్ బహుశా అదే అయ్యుండొచ్చు. వేచి చూద్దాం.
This post was last modified on November 3, 2023 12:10 pm
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే..…
"మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది.…