ఇప్పుడంతా ఓటీటీలదే హవా. కరోనా టైం నుంచి ఈ ఫ్లాట్ ఫామ్స్ ఎలా ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయో తెలిసిందే. థియేటర్లకు సవాలు విసిరే స్థాయిలో బోలెడన్ని ఓటీటీలు వచ్చాయి. భారీగా పెట్టుబడి పెట్టి ఒరిజినల్ కంటెంట్ అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కోవలో కొంచెం లేటుగా రేసులోకి వచ్చిన ఓటీటీ.. ఈటీవీ విన్.
ఉషా కిరణ్ మూవీస్ దగ్గరున్న సినిమాలు, ఇతర కంటెంట్తో కొన్నేళ్లు ఉచితంగానే అన్నీ చూసే అవకాశం కల్పించిన ఈటీవీ విన్.. ఈ మధ్యే పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మారింది. ఒరిజినల్స్ రూపొందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తోంది. ఐతే ఈటీవీ విన్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు, సిరీస్లు ఏవీ అంత ట్రెండీగా అనిపించలేదు. ఆడియన్స్ను పెద్దగా అట్రాక్ట్ చేయలేదు. కృష్ణారామా, దిల్ సే సహా ఇందులో వచ్చిన ఒరిజినల్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
ఐతే ఈటీవీ విన్ వాళ్లు ఎట్టకేలకు మంచి కంటెంట్ ఉన్న సిరీస్తో వస్తున్నట్లు కనిపిస్తోంది. 90s-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ పేరుతో కొత్త సిరీస్ రూపొందించింది ఈటీవీ విన్. ప్రస్తుతం బిగ్ బాస్ షోలో మంచి పాలోయింగ్తో సాగిపోతున్న శివాజీ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. తొలిప్రేమలో పవన్ కళ్యాణ్ చెల్లెలిగా నటించిన వాసుకి ఇందులో శివాజీకి జోడీగా నటించింది. సోషల్ మీడియాలో మీమ్ వీడియోలతో పాపులర్ అయిన మౌళి ఇందులో శివాజీ కొడుకుగా నటించాడు.
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా రిలీజైన ఈ సిరీస్ టీజర్ ఆకట్టుకుంది. 90ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూనే ఆహ్లాదకరమైన వినోదంతో ఈ టీజర్ ఆకట్టుకుంది. ఈటీవీ విన్లో ఇప్పటిదాకా వచ్చిన సిరీస్లన్నింటితో పోలిస్తే ఇది ఎంగేజింగ్గా అనిపిస్తోంది. ఓ మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘటనల చుట్టూ నడిచే ఈ సిరీస్ను ఆదిత్య హాసన్ రూపొందించాడు. వచ్చే జనవరి 5 నుంచి ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది.
This post was last modified on November 2, 2023 10:15 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…