యూత్ హీరోల సినిమాలకు విడుదల తేదీ సెట్ చేసుకోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఒకపక్క సలార్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ మాట మీద ఉండలేక డేట్లు మారుస్తూ ఇతరులను ప్రభావితం చేస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఫలానా తేదీకి అందరూ కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ, సుహాస్ ఇద్దరికీ ఇదే పెద్ద ఇబ్బందిగా మారిపోయింది. బేబీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ నుంచి వస్తున్న చిత్రం గంగం గణేశా. టీజర్ వచ్చి వారాలు దాటేసింది. ముందు సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు కానీ పోటీ వల్ల వాయిదా వేస్తూ వచ్చారు.
సుహాస్ అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ కి క్రమంగా బజ్ పెరుగుతోంది. ఒక ప్లానింగ్ ప్రకారం టీమ్ చేస్తున్న ప్రమోషన్లు హెల్ప్ అవుతున్నాయి. పాత్ర కోసం ఏ మాత్రం మొహమాటపడకుండా సుహాస్ గుండు కొట్టించుకోవడం ఆల్రెడీ హాట్ టాపిక్ అయిపోయింది. మ్యూజిక్, విలేజ్ బ్యాక్ డ్రాప్ విజువల్స్, డిఫరెంట్ లవ్ స్టోరీ అనే ఫీలింగ్ మొత్తానికి అంచనాలైతే సృష్టించాయి. ఈ రెండు సినిమాలకు ఈ ఏడాది మొత్తం ఎక్కడా స్లాట్ కనిపించడం లేదు. పోటీలో దిగితే ఓపెనింగ్స్ తో పాటు థియేటర్ల సమస్య వస్తుంది. అందుకే వీలైనంత సోలోగా రావడం మంచి ఫలితం ఇస్తుంది.
ప్రస్తుతం వీటి నిర్మాతలు సరైన డేట్ కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. గంగం గణేశా టీమ్ సైలెంట్ అయిపోయింది కానీ అంబాజీపేట బృందం మాత్రం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తమ టాపిక్ వచ్చేలా ఏదో ఒక ఈవెంట్ చేస్తూనే ఉన్నారు. విడుదల తేదీ కనీసం రెండు మూడు వారాలు ముందుగా ఫిక్స్ అయితే తప్ప పబ్లిసిటీకి సరైన సమయం దొరకడం లేదు. పోనీ వేచి చూద్దామా అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి దాకా ఛాన్స్ దొరకదు. సో ఏదో ఒకటి వీలైనంత త్వరగా డిసైడ్ చేసుకుంటే తప్ప ప్రమోషన్ ఎలా చేయాలనే దాని మీద క్లారిటీ రాదు. నవంబర్ చివరి వారంలో ఒకటి రావొచ్చు.
This post was last modified on November 1, 2023 11:07 am
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…