యూత్ హీరోల సినిమాలకు విడుదల తేదీ సెట్ చేసుకోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఒకపక్క సలార్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ మాట మీద ఉండలేక డేట్లు మారుస్తూ ఇతరులను ప్రభావితం చేస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఫలానా తేదీకి అందరూ కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ, సుహాస్ ఇద్దరికీ ఇదే పెద్ద ఇబ్బందిగా మారిపోయింది. బేబీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ నుంచి వస్తున్న చిత్రం గంగం గణేశా. టీజర్ వచ్చి వారాలు దాటేసింది. ముందు సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు కానీ పోటీ వల్ల వాయిదా వేస్తూ వచ్చారు.
సుహాస్ అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ కి క్రమంగా బజ్ పెరుగుతోంది. ఒక ప్లానింగ్ ప్రకారం టీమ్ చేస్తున్న ప్రమోషన్లు హెల్ప్ అవుతున్నాయి. పాత్ర కోసం ఏ మాత్రం మొహమాటపడకుండా సుహాస్ గుండు కొట్టించుకోవడం ఆల్రెడీ హాట్ టాపిక్ అయిపోయింది. మ్యూజిక్, విలేజ్ బ్యాక్ డ్రాప్ విజువల్స్, డిఫరెంట్ లవ్ స్టోరీ అనే ఫీలింగ్ మొత్తానికి అంచనాలైతే సృష్టించాయి. ఈ రెండు సినిమాలకు ఈ ఏడాది మొత్తం ఎక్కడా స్లాట్ కనిపించడం లేదు. పోటీలో దిగితే ఓపెనింగ్స్ తో పాటు థియేటర్ల సమస్య వస్తుంది. అందుకే వీలైనంత సోలోగా రావడం మంచి ఫలితం ఇస్తుంది.
ప్రస్తుతం వీటి నిర్మాతలు సరైన డేట్ కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. గంగం గణేశా టీమ్ సైలెంట్ అయిపోయింది కానీ అంబాజీపేట బృందం మాత్రం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తమ టాపిక్ వచ్చేలా ఏదో ఒక ఈవెంట్ చేస్తూనే ఉన్నారు. విడుదల తేదీ కనీసం రెండు మూడు వారాలు ముందుగా ఫిక్స్ అయితే తప్ప పబ్లిసిటీకి సరైన సమయం దొరకడం లేదు. పోనీ వేచి చూద్దామా అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి దాకా ఛాన్స్ దొరకదు. సో ఏదో ఒకటి వీలైనంత త్వరగా డిసైడ్ చేసుకుంటే తప్ప ప్రమోషన్ ఎలా చేయాలనే దాని మీద క్లారిటీ రాదు. నవంబర్ చివరి వారంలో ఒకటి రావొచ్చు.
This post was last modified on November 1, 2023 11:07 am
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…