పెళ్ళిచూపులు సినిమాతో తరుణ్ భాస్కర్ ఏడేళ్ల కిందట ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. సరికొత్త కథాకథనాలతో ప్రేక్షకులకు ఒక భిన్నమైన అనుభూతిని పంచాడు తరుణ్ ఆ చిత్రంతో. ఈ సినిమాతో తరుణ్ మీద భారీగా అంచనాలు నెలకొనగా.. సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ తనతో పని చేయడానికి ఆసక్తి చూపించాడు. వీళ్లిద్దరి కలయికలో గుర్రపు రేసుల నేపథ్యంలో ఓ సినిమా రాబోతోందని, సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని ప్రచారం జరిగింది.
కానీ ఏళ్లు గడిచాయి. ఎంతకీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. మధ్యలో తరుణ్.. ఈ నగరానికి ఏమైంది సినిమా చేశాడు. ఇప్పుడు కీడాకోలాతో రాబోతున్నాడు. దీని తర్వాత అతను విజయ్ దేవరకొండతో జట్టు కట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి వెంకీతో సినిమా సంగతి ఏమైందో తెలియదు. కీడాకోలా సినిమా ప్రమోషన్లలో భాగంగా వెంకీ సినిమా గురించి అడిగితే.. తరుణ్ భాస్కర్ తెర వెనుక సంగతులు చెప్పాడు.
ఒక కొత్త ఐడియాతో ఆ కథ రాశానని.. కాకపోతే దాని ముగింపు, మరికొన్ని విషయాల్లో తనకు సంతృప్తి కలగలేదని చెప్పాడు. కానీ నిర్మాత సురేష్ బాబుకు ఆ స్క్రిప్టు నచ్చి సినిమా తీయడానికి రెడీ అయ్యారని తరుణ్ తెలిపాడు. కానీ తనకే సంతృప్తి లేక ఆ సినిమాను ఆపేశానన్నాడు. ఐతే తర్వాత దాని మీద పని చేసి కథను ఒక కొలిక్కి తెచ్చానని.. ఇప్పుడు ఆ సినిమా చేయడానికి రెడీగానే ఉన్నానని చెప్పాడు.
కీడాకోలా రిజల్ట్ను బట్టి త్వరలో వెంకీతో ఆ కథను తీస్తానని చెప్పాడు తరుణ్. ఇక కీడాకోలా సినిమా గురించి చెబుతూ.. ఇప్పటిదాకా తీసిన మూడు చిత్రాల్లో తాను ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నది కీడాకోలా విషయంలోనే అని తరుణ్ తెలిపాడు. ఈ సినిమాను 2 గంటల 20 నిమిషాల నిడివితో తీశానని.. కానీ క్రైమ కామెడీలు క్రిస్ప్గా ఉంటే బాగుంటుందని.. తనే ఓ పావుగంట ఎడిట్ చేశానని తరుణ్ చెప్పాడు.
This post was last modified on November 1, 2023 1:08 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…