తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్కు తెలుగులో బంపర్ క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ‘ఖైదీ’ మూవీనే. కార్తి హీరోగా అతను రూపొందించిన ఈ చిత్రం తమిళంలోనే కాక తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. విక్రమ్లో ఖెదీ సినిమాకు కనెక్షన్ పెట్టడంతో ఈ సినిమా క్రేజ్ ఇంకా పెరిగింది. ఖైదీని లోకేష్ కెరీర్లో బెస్ట్ మూవీగా చూస్తారు అభిమానులు.
దానికి సీక్వెల్ తీస్తానని లోకేష్ ఎప్పట్నుంచో చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విశేషాలే పంచుకున్నాడు. లియో తర్వాత రజినీకాంత్తో సినిమా చేయబోతున్న లోకేష్.. దాని తర్వాత వెంటనే ఖైదీ-2 తీస్తానని వెల్లడించాడు. ఢిల్లీ గతంతో పాటు, వర్తమానానికి ముడి పెడుతూ ఈ కథ ఉంటుందని చెప్పాడు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్తో ఖైదీకి కచ్చితంగా కనెక్షన్ ఉంటుందని చెప్పిన లోకేష్.. విక్రమ్లో విలన్గా కనిపించిన సంతానం చనిపోయాడు కాబట్టి డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంకొకరి చేతుల్లోకి వెళ్తుందని.. ఆ విలన్ ఎవరు అనేది సర్ప్రైజ్ అని లోకేష్ తెలిపాడు. ఖైదీ-2లో అనేక ఆశ్చర్యకర, కొత్త పాత్రలు ఉంటాయని.. ఆ సినిమా చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని లోకేష్ తెలిపాడు.
లియో పాత్ర ఎల్సీయూలో హీరోనా విలనా అన్నది కూడా ఇప్పుడు చెప్పనని.. తర్వాత ప్రేక్షకులు తెలుసుకుంటారని చెప్పాడు. ఖైదీ-2 తర్వాత విక్రమ్-2, లియో-2 సినిమాలు కూడా చేస్తానని.. వీటితో పాటు రోలెక్స్ మీద ప్రత్యేకంగా ఓ సినిమా ఉంటుందని అతనన్నాడు. లియో సినిమాకు నెగెటివ్ టాక్ రావడంపై లోకేష్ స్పందిస్తూ.. దీనిపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారన్నాడు.
This post was last modified on November 1, 2023 1:01 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…