తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్కు తెలుగులో బంపర్ క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ‘ఖైదీ’ మూవీనే. కార్తి హీరోగా అతను రూపొందించిన ఈ చిత్రం తమిళంలోనే కాక తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. విక్రమ్లో ఖెదీ సినిమాకు కనెక్షన్ పెట్టడంతో ఈ సినిమా క్రేజ్ ఇంకా పెరిగింది. ఖైదీని లోకేష్ కెరీర్లో బెస్ట్ మూవీగా చూస్తారు అభిమానులు.
దానికి సీక్వెల్ తీస్తానని లోకేష్ ఎప్పట్నుంచో చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విశేషాలే పంచుకున్నాడు. లియో తర్వాత రజినీకాంత్తో సినిమా చేయబోతున్న లోకేష్.. దాని తర్వాత వెంటనే ఖైదీ-2 తీస్తానని వెల్లడించాడు. ఢిల్లీ గతంతో పాటు, వర్తమానానికి ముడి పెడుతూ ఈ కథ ఉంటుందని చెప్పాడు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్తో ఖైదీకి కచ్చితంగా కనెక్షన్ ఉంటుందని చెప్పిన లోకేష్.. విక్రమ్లో విలన్గా కనిపించిన సంతానం చనిపోయాడు కాబట్టి డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంకొకరి చేతుల్లోకి వెళ్తుందని.. ఆ విలన్ ఎవరు అనేది సర్ప్రైజ్ అని లోకేష్ తెలిపాడు. ఖైదీ-2లో అనేక ఆశ్చర్యకర, కొత్త పాత్రలు ఉంటాయని.. ఆ సినిమా చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని లోకేష్ తెలిపాడు.
లియో పాత్ర ఎల్సీయూలో హీరోనా విలనా అన్నది కూడా ఇప్పుడు చెప్పనని.. తర్వాత ప్రేక్షకులు తెలుసుకుంటారని చెప్పాడు. ఖైదీ-2 తర్వాత విక్రమ్-2, లియో-2 సినిమాలు కూడా చేస్తానని.. వీటితో పాటు రోలెక్స్ మీద ప్రత్యేకంగా ఓ సినిమా ఉంటుందని అతనన్నాడు. లియో సినిమాకు నెగెటివ్ టాక్ రావడంపై లోకేష్ స్పందిస్తూ.. దీనిపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారన్నాడు.
This post was last modified on November 1, 2023 1:01 am
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…