తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్కు తెలుగులో బంపర్ క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ‘ఖైదీ’ మూవీనే. కార్తి హీరోగా అతను రూపొందించిన ఈ చిత్రం తమిళంలోనే కాక తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. విక్రమ్లో ఖెదీ సినిమాకు కనెక్షన్ పెట్టడంతో ఈ సినిమా క్రేజ్ ఇంకా పెరిగింది. ఖైదీని లోకేష్ కెరీర్లో బెస్ట్ మూవీగా చూస్తారు అభిమానులు.
దానికి సీక్వెల్ తీస్తానని లోకేష్ ఎప్పట్నుంచో చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విశేషాలే పంచుకున్నాడు. లియో తర్వాత రజినీకాంత్తో సినిమా చేయబోతున్న లోకేష్.. దాని తర్వాత వెంటనే ఖైదీ-2 తీస్తానని వెల్లడించాడు. ఢిల్లీ గతంతో పాటు, వర్తమానానికి ముడి పెడుతూ ఈ కథ ఉంటుందని చెప్పాడు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్తో ఖైదీకి కచ్చితంగా కనెక్షన్ ఉంటుందని చెప్పిన లోకేష్.. విక్రమ్లో విలన్గా కనిపించిన సంతానం చనిపోయాడు కాబట్టి డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంకొకరి చేతుల్లోకి వెళ్తుందని.. ఆ విలన్ ఎవరు అనేది సర్ప్రైజ్ అని లోకేష్ తెలిపాడు. ఖైదీ-2లో అనేక ఆశ్చర్యకర, కొత్త పాత్రలు ఉంటాయని.. ఆ సినిమా చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని లోకేష్ తెలిపాడు.
లియో పాత్ర ఎల్సీయూలో హీరోనా విలనా అన్నది కూడా ఇప్పుడు చెప్పనని.. తర్వాత ప్రేక్షకులు తెలుసుకుంటారని చెప్పాడు. ఖైదీ-2 తర్వాత విక్రమ్-2, లియో-2 సినిమాలు కూడా చేస్తానని.. వీటితో పాటు రోలెక్స్ మీద ప్రత్యేకంగా ఓ సినిమా ఉంటుందని అతనన్నాడు. లియో సినిమాకు నెగెటివ్ టాక్ రావడంపై లోకేష్ స్పందిస్తూ.. దీనిపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారన్నాడు.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…