టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ప్యాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె గురించి దర్శకుడు నాగ అశ్విన్ తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేశాడు. హైదరాబాద్ లో జరుగుతున్న సినిమాటికా ఎక్స్ పోకి విచ్చేసి తన మనోభావాలను పంచుకున్నాడు. ప్రాజెక్ట్ కె గ్రాఫిక్స్ మేడ్ ఇన్ ఇండియా నినాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడే మొత్తం చేయించాలనుకున్నామని, అయితే కొన్ని పరిమితుల వల్ల సాధ్యపడక కొంత భాగం విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందట. కానీ తర్వాత చేయబోయే దానికి మాత్రం పూర్తిగా ఇక్కడి వనరులనే వాడుకుంటానని చెప్పాడు.
నాగ అశ్విన్ ఈ సందర్భంగా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయాలే చెప్పుకొచ్చాడు. సాంకేతికంగా మన చదువులు ఎంతో ఉన్నంతగా ఉన్నప్పటికీ వాటి వాడకంలో మాత్రం మనం వెనుకబడే ఉన్నాం. ఈ సమస్య ఇప్పటిది కాదు. రెండు మూడు దశాబ్దాల క్రితమే నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అమ్మోరు, అంజి, అరుంధతి విజువల్ ఎఫెక్ట్స్ కోసం కోట్లు ఖర్చు పెట్టి ఫారిన్ బృందాలతో పని చేయించుకోవాల్సి వచ్చింది. శంకర్ కు సైతం రోబో విషయంలో ఈ ఇబ్బందులు తప్పలేదు. క్వాలిటీ స్టూడియోలతో పాటు సరైన నిపుణులు అందుబాటులో లేకపోవడం సమస్య తీవ్రతని సూచిస్తోంది.
రాబోయే రోజుల్లో ఈ విభాగంలో మనం బలపడాల్సింది చాలా ఉంది. రాజమౌళి లాంటి మేకర్స్ ని ఎక్కడికి వెళ్లే అవసరం రానివ్వకుండా చేయాలి. సాఫ్ట్ వేర్ తెలివితేటలు సినిమా రంగానికి ఉపయోగపడాలి. ప్రాజెక్ట్ కె టీజర్ వచ్చినప్పుడు గ్రాఫిక్స్ పరంగా కొంత నెగటివ్ ఫీడ్ బ్యాక్ వినిపించిన మాట వాస్తవం. నాగ అశ్విన్ ఆ అభిప్రాయాలను సీరియస్ గా తీసుకుని కావాల్సిన మార్పులు చేర్పులు చేస్తానని ఆ టైంలోనే ప్రకటించాడు. ఇంతకీ ప్రాజెక్ట్ కె విడుదల తేదీ ఎప్పుడనేది మాత్రం ఇంకా తేలలేదు. 2024 వేసవి లేదా దీపావళి దసరా ఈ మూడింటిలో ఒక ఆప్షన్ ని ఎంచుకోవచ్చని వైజయంతి వర్గాల టాక్.
This post was last modified on October 31, 2023 5:12 pm
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…