థియేటర్ సినిమాలు చేస్తున్నంత హడావిడి ఈ మధ్య ఓటిటి రిలీజుల్లో కనిపించడం లేదు. అందుకే డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ కాస్తంత చప్పగానే ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ మాత్రం వారానికి ఖచ్చితంగా ఒక సౌత్ మూవీ అందులోనూ తెలుగుది ఉండేలా ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టే మంచి స్పందన దక్కించుకుంటోంది. అయితే ఈ వారం మాత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఎంజాయ్ చేయాలనుకునే అభిమానులకు చాలా కానుకలు రాబోతున్నాయి. నవంబర్ 2 షారుఖ్ ఖాన్ పుట్టినరోజుని పురస్కరించుకుని ‘జవాన్’ని అన్ని భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇవాళ లేదా రేపు ప్రకటన రావొచ్చు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ దర్శకుడు బోయపాటి శీను కాంబోలో రూపొందిన ‘స్కంద’ కూడా ఇదే రోజు హాట్ స్టార్ లో కనువిందు చేయనుంది. ఫ్లాప్ టాక్ రావడంతో బిగ్ స్క్రీన్ మీద మిస్ చేసుకున్న వాళ్ళు బోలెడు ఉండటంతో భారీ వ్యూస్ దక్కే అవకాశాలున్నాయి. పెద్దగా అంచనాలు లేకుండా సైలెంట్ కిల్లర్ గా హిట్టు కొట్టిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘మ్యాడ్’ మరుసటి రోజు మూడో తేదీ నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షం కానుంది. సోషల్ మీడియా ప్రశంసలు దక్కించుకున్న ‘మంత్ అఫ్ మధు’ని ఆహా సొంతం చేసుకుని ఇదే రోజు రిలీజ్ చేయబోతున్నట్టు ఇందాక అధికారికంగా ప్రకటించింది.
ఇవి కాకుండా ఇతరత్రా వెబ్ సిరీస్ లు వేరే ఉన్నాయి. ఒకపక్క థియేటర్ సినిమాలు పోటీ పడుతున్న టైంలో ఇలా డిజిటల్ లోనూ ఇంత తాకిడి ఉండటం ఎన్నో వారాల తర్వాత జరుగుతోంది. కరోనా టైంలో దక్కిన విపరీత ఆధారణ వల్ల ఇబ్బడిముబ్బడిగా సినిమాలను కోట్లు పెట్టి కొన్న ఓటిటి కంపెనీలు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. పెద్ద హీరోల వాటికి ఇబ్బంది లేదు కానీ మీడియం బడ్జెట్ నిర్మాతలకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ మధ్య స్మార్ట్ స్క్రీన్ మీద కొత్త సినిమాల దూకుడు తగ్గిందని టాక్. ఏదైతేనేం మొత్తానికి ఈ వారం ఎంటర్ టైన్మెంట్ లవర్స్ కి పండగే.
This post was last modified on October 31, 2023 12:29 pm
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే.…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో…