ఈ ఏడాది టాలీవుడ్ టాప్ బ్లాక్ బస్టర్స్ లో చోటు సంపాదించుకున్న బేబీ హిందీ రీమేక్ కాబోతోందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు సాయి రాజేషే బాలీవుడ్ వెర్షన్ ని హ్యాండిల్ చేయబోతున్నట్టు తెలిసింది. సీనియర్ హీరో బాబీ డియోల్ కొడుకు ఆర్యమాన్ ని పరిచయం చేసేందుకు ఈ ప్రాజెక్టుని ఎంచుకున్నట్టు ముంబై అప్డేట్. సరే వినడానికి బాగానే ఉంది కానీ బేబీ లాంటి బోల్డ్ కంటెంట్ లు నార్త్ జనాలకు కొత్త కాదు. వాళ్ళకివి షాకింగ్ గానూ అనిపించవు. ఇలాంటివి కరణ్ జోహార్ జమానా నుంచి వెబ్ సిరీస్ ల దాకా ఎన్ని చూశారో లెక్క బెట్టడం కష్టం. ఇక్కడ ఇంకో కోణం ఉంది.
మన రీమేకులు ఈ మధ్య అక్కడ వర్కౌట్ కావడం లేదు. ఆరెక్స్ 100 ఇక్కడ చేసిన సెన్సేషన్ కనీసం పావు వంతు కూడా ఉత్తరాదిలో రిపీట్ కానివ్వలేదు. జెర్సీని గౌతమ్ తిన్ననూరే షాహిద్ కపూర్ లాంటి స్టార్ హీరోతో తీస్తే కనీసం బ్రేక్ ఈవెన్ లో సగం రాలేదు. రాక్షసుడుని అక్షయ్ కుమార్ చేసినా లాభం లేకపోయింది. అల వైకుంఠపురములో, గద్దలకొండ గణేష్, ఎంసిఏ , హిట్ ది ఫస్ట్ కేస్ ఇవన్నీ ఫెయిల్యూర్స్ కి కొన్ని ఉదాహరణలు మాత్రమే. స్టార్ క్యాస్టింగ్ తో తీసినవే. ఓటిటి వల్ల ఒక భాషలో హిట్ అయినది చాలా త్వరగా జనాలకు చేరిపోతోంది. అందుకే మళ్ళీ చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు.
ఇప్పుడు సాయిరాజేష్ పెద్ద సవాల్ నే ఎదురు కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బేబీలో కంటెంట్ మన జనాలకు కనెక్ట్ అవ్వడానికి బోలెడు కారణాలున్నాయి. మన అభిరుచులు, వాతావరణానికి తగ్గట్టు నిబ్బా నిబ్బి లవ్ స్టోరీని బోల్డ్ గా తెరకెక్కించిన విధానం కాసుల వర్షం కురిపించింది. ఎప్పుడో ఆషిక్ బనాయా ఆప్నే నుంచి ఇలాంటి కథలకు అలవాటు పడిన హిందీ ఆడియన్స్ ని మెప్పించడం అంత సులభంగా ఉండదు. చూస్తుంటే బేబీ దర్శకుడు సందీప్ వంగాని స్ఫూర్తిగా తీసుకున్నట్టు ఉంది. అర్జున్ రెడ్డి అక్కడ కబీర్ సింగ్ గా తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన వైనం ఇన్స్ పిరేషన్ అయిందేమో.
This post was last modified on October 31, 2023 11:21 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…