ఈ ఏడాది టాలీవుడ్ టాప్ బ్లాక్ బస్టర్స్ లో చోటు సంపాదించుకున్న బేబీ హిందీ రీమేక్ కాబోతోందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు సాయి రాజేషే బాలీవుడ్ వెర్షన్ ని హ్యాండిల్ చేయబోతున్నట్టు తెలిసింది. సీనియర్ హీరో బాబీ డియోల్ కొడుకు ఆర్యమాన్ ని పరిచయం చేసేందుకు ఈ ప్రాజెక్టుని ఎంచుకున్నట్టు ముంబై అప్డేట్. సరే వినడానికి బాగానే ఉంది కానీ బేబీ లాంటి బోల్డ్ కంటెంట్ లు నార్త్ జనాలకు కొత్త కాదు. వాళ్ళకివి షాకింగ్ గానూ అనిపించవు. ఇలాంటివి కరణ్ జోహార్ జమానా నుంచి వెబ్ సిరీస్ ల దాకా ఎన్ని చూశారో లెక్క బెట్టడం కష్టం. ఇక్కడ ఇంకో కోణం ఉంది.
మన రీమేకులు ఈ మధ్య అక్కడ వర్కౌట్ కావడం లేదు. ఆరెక్స్ 100 ఇక్కడ చేసిన సెన్సేషన్ కనీసం పావు వంతు కూడా ఉత్తరాదిలో రిపీట్ కానివ్వలేదు. జెర్సీని గౌతమ్ తిన్ననూరే షాహిద్ కపూర్ లాంటి స్టార్ హీరోతో తీస్తే కనీసం బ్రేక్ ఈవెన్ లో సగం రాలేదు. రాక్షసుడుని అక్షయ్ కుమార్ చేసినా లాభం లేకపోయింది. అల వైకుంఠపురములో, గద్దలకొండ గణేష్, ఎంసిఏ , హిట్ ది ఫస్ట్ కేస్ ఇవన్నీ ఫెయిల్యూర్స్ కి కొన్ని ఉదాహరణలు మాత్రమే. స్టార్ క్యాస్టింగ్ తో తీసినవే. ఓటిటి వల్ల ఒక భాషలో హిట్ అయినది చాలా త్వరగా జనాలకు చేరిపోతోంది. అందుకే మళ్ళీ చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు.
ఇప్పుడు సాయిరాజేష్ పెద్ద సవాల్ నే ఎదురు కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బేబీలో కంటెంట్ మన జనాలకు కనెక్ట్ అవ్వడానికి బోలెడు కారణాలున్నాయి. మన అభిరుచులు, వాతావరణానికి తగ్గట్టు నిబ్బా నిబ్బి లవ్ స్టోరీని బోల్డ్ గా తెరకెక్కించిన విధానం కాసుల వర్షం కురిపించింది. ఎప్పుడో ఆషిక్ బనాయా ఆప్నే నుంచి ఇలాంటి కథలకు అలవాటు పడిన హిందీ ఆడియన్స్ ని మెప్పించడం అంత సులభంగా ఉండదు. చూస్తుంటే బేబీ దర్శకుడు సందీప్ వంగాని స్ఫూర్తిగా తీసుకున్నట్టు ఉంది. అర్జున్ రెడ్డి అక్కడ కబీర్ సింగ్ గా తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన వైనం ఇన్స్ పిరేషన్ అయిందేమో.
This post was last modified on October 31, 2023 11:21 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…