ఒకప్పుడు ఏదైనా పెద్ద హీరో సినిమా యాభై రోజులు దాటాక కలెక్షన్లు తగ్గాయనిపిస్తే ఎడిటింగ్ లో పక్కనపెట్టిన పాటలు లేదా సీన్లు జోడించి మళ్ళీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్లాన్ వేసేవాళ్ళు. కానీ తర్వాత కాలం మారిపోయింది. రెండు వారాలు గట్టిగా ఆడితే చాలు దేవుడా అని మొక్కుకునే పరిస్థితులు వచ్చాయి. ముందులా ఇప్పుడు హోమ్ వీడియోలు, డివిడిలు లేవు. వాటిలో ఆ ఎక్స్ ట్రా ఫుటేజ్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కొంతమంది డిలీటెడ్ కంటెంట్ పేరుతో యూట్యూబ్ లో వదులుతున్నారు కానీ వాటిలో అధిక శాతం సన్నివేశాలు ఉంటున్నాయి. సరే ఇక విషయానికి వద్దాం.
వచ్చే వారం నవంబర్ 4న రీ రిలీజ్ కాబోతున్న శంకర్ దాదా ఎంబిబిఎస్ కోసం మెగా ఫాన్స్ బాగానే ఎదురు చూస్తున్నట్టు బుకింగ్స్ ని బట్టి అర్థమవుతోంది. 2004లో ఇది విడుదలైనప్పుడు అర్ధ శతదినోత్సవం తర్వాత సందెపొద్దుల తాండే నీ జిమ్మదియ్య పాటను జత చేస్తే మళ్ళీ కలెక్షన్లు కాసింత ఎక్కువొచ్చాయి. చిరంజీవి, సోనాలి బెంద్రేతో పాటు దేవిశ్రీ ప్రసాద్ కూడా అలా తళుక్కున మెరుస్తాడు. కానీ తర్వాత విసిడి, శాటిలైట్ ఛానల్స్ ఇది లేదు. జెమినిలో ప్రసారం చేసినా, ఫుల్ మూవీ యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నా ఎక్కడా దీని వీడియో జాడ లేదు. ఇన్నేళ్ల తర్వాత చూసే ఛాన్స్ దొరికింది.
ఈ సాంగ్ ని ఇప్పుడు థియేటర్లలో4Kతో చూడమని నిర్మాతలు ఊరిస్తున్నారు. మున్నాభాయ్ ఏంబిబిఎస్ కు రీమేక్ గా రూపొందిన శంకర్ దాదా కామెడీ మరోసారి ఎంజాయ్ చేసేందుకు మూవీ లవర్స్ కూడా ఆసక్తిగానే ఉన్నారు. హుషారైన పాటలు, చిరు టైమింగ్, దేవి సాంగ్స్ తో కంప్లీట్ ఎంటర్ టైనర్ గా దీనికి అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎలాగూ వచ్చే వారం కీడా కోలా, మా ఊరి పొలిమేర 2 తప్ప పెద్దగా చెప్పుకునే సినిమాలు లేవు కాబట్టి వసూళ్లు బాగుంటాయని ఆశిస్తున్నారు. రీ రిలీజ్ ట్రెండ్ బాగా నెమ్మదించిన టైంలో వస్తున్న మెగాదాదాకొచ్చే స్పందనను బట్టి దగ్గర్లో మరిన్ని వచ్చే అవకాశాలున్నాయి.
This post was last modified on October 30, 2023 6:45 pm
ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…
ప్రస్తుతం ఐటీ రాజధానిగా భాసిల్లుతున్న విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. తాజాగా విశాఖపట్నానికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులకు చంద్రబాబు నేతృత్వంలోని…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది.…
ఐపీఎల్లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని…
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…