ఒకప్పుడు ఏదైనా పెద్ద హీరో సినిమా యాభై రోజులు దాటాక కలెక్షన్లు తగ్గాయనిపిస్తే ఎడిటింగ్ లో పక్కనపెట్టిన పాటలు లేదా సీన్లు జోడించి మళ్ళీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్లాన్ వేసేవాళ్ళు. కానీ తర్వాత కాలం మారిపోయింది. రెండు వారాలు గట్టిగా ఆడితే చాలు దేవుడా అని మొక్కుకునే పరిస్థితులు వచ్చాయి. ముందులా ఇప్పుడు హోమ్ వీడియోలు, డివిడిలు లేవు. వాటిలో ఆ ఎక్స్ ట్రా ఫుటేజ్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కొంతమంది డిలీటెడ్ కంటెంట్ పేరుతో యూట్యూబ్ లో వదులుతున్నారు కానీ వాటిలో అధిక శాతం సన్నివేశాలు ఉంటున్నాయి. సరే ఇక విషయానికి వద్దాం.
వచ్చే వారం నవంబర్ 4న రీ రిలీజ్ కాబోతున్న శంకర్ దాదా ఎంబిబిఎస్ కోసం మెగా ఫాన్స్ బాగానే ఎదురు చూస్తున్నట్టు బుకింగ్స్ ని బట్టి అర్థమవుతోంది. 2004లో ఇది విడుదలైనప్పుడు అర్ధ శతదినోత్సవం తర్వాత సందెపొద్దుల తాండే నీ జిమ్మదియ్య పాటను జత చేస్తే మళ్ళీ కలెక్షన్లు కాసింత ఎక్కువొచ్చాయి. చిరంజీవి, సోనాలి బెంద్రేతో పాటు దేవిశ్రీ ప్రసాద్ కూడా అలా తళుక్కున మెరుస్తాడు. కానీ తర్వాత విసిడి, శాటిలైట్ ఛానల్స్ ఇది లేదు. జెమినిలో ప్రసారం చేసినా, ఫుల్ మూవీ యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నా ఎక్కడా దీని వీడియో జాడ లేదు. ఇన్నేళ్ల తర్వాత చూసే ఛాన్స్ దొరికింది.
ఈ సాంగ్ ని ఇప్పుడు థియేటర్లలో4Kతో చూడమని నిర్మాతలు ఊరిస్తున్నారు. మున్నాభాయ్ ఏంబిబిఎస్ కు రీమేక్ గా రూపొందిన శంకర్ దాదా కామెడీ మరోసారి ఎంజాయ్ చేసేందుకు మూవీ లవర్స్ కూడా ఆసక్తిగానే ఉన్నారు. హుషారైన పాటలు, చిరు టైమింగ్, దేవి సాంగ్స్ తో కంప్లీట్ ఎంటర్ టైనర్ గా దీనికి అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎలాగూ వచ్చే వారం కీడా కోలా, మా ఊరి పొలిమేర 2 తప్ప పెద్దగా చెప్పుకునే సినిమాలు లేవు కాబట్టి వసూళ్లు బాగుంటాయని ఆశిస్తున్నారు. రీ రిలీజ్ ట్రెండ్ బాగా నెమ్మదించిన టైంలో వస్తున్న మెగాదాదాకొచ్చే స్పందనను బట్టి దగ్గర్లో మరిన్ని వచ్చే అవకాశాలున్నాయి.
This post was last modified on October 30, 2023 6:45 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…