సంక్రాంతి, దసరా పండగల రేంజ్ లో దీపావళికి తెలుగు నాట బాక్సాఫీస్ మైలేజ్ పెద్దగా ఉండదు. కారణం సెలవులు ఒకటి రెండు రోజులకు మాత్రమే పరిమితం కావడం. అందుకే మన నిర్మాతలు ఈ సీజన్ ని లైట్ తీసుకునే సందర్భాలే ఎక్కువ. అయితే ఈసారి చెప్పుకోదగ్గ సినిమాలు బాగానే వస్తున్నాయి కానీ అధిక శాతం డబ్బింగ్ బాపతే కావడం ఆసక్తి రేపుతోంది. ముందుగా నవంబర్ 12న రిలీజవుతున్న సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ మీద ఎంత హైప్ ఉందో మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. పఠాన్, జవాన్ తెలుగు వెర్షన్లు మంచి వసూళ్లు తెచ్చిన నేపథ్యంలో యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
కార్తీ ‘జపాన్’ 10నే రావొచ్చని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ట్రైలర్ తో పాటు డేట్ ని ఇవాళ ప్రకటించబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ హక్కులు సొంతం చేసుకోవడంతో రిలీజ్ గ్రాండ్ గా ఉండబోతోంది. గత ఏడాది సర్దార్ పంపిణి జరిగింది ఈ సంస్థ ద్వారానే. నాగార్జునతో ఉన్న అనుబంధం కార్తీకి ఈ రకంగా ఉపయోగపడుతోంది. లారెన్స్ – ఎస్జె సూర్య కాంబోలో రూపొందిన ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ జపాన్ తో క్లాష్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం గ్యాప్ తో ఆపై వారం ‘సప్తసాగరాలు దాటి సైడ్ బి’ థియేటర్లో అడుగు పెట్టనుంది. ఇవన్నీ అనువాదం బ్యాచే.
తెలుగు స్ట్రెయిట్ సినిమాల వరకు చూసుకుంటే 10న వైష్ణవ తేజ్ ‘ఆదికేశవ’ ఇంకా అంచనాలు పెంచే పని మొదలుపెట్టలేదు. పాట రిలీజ్ తో ఇటీవలే పబ్లిసిటీ మొదలయ్యింది. వర్మ ‘వ్యూహం’ని అధికార పార్టీ మద్దతు దారులు తప్ప సామాన్య ప్రేక్షకులు పట్టించుకోవడం అనుమానమే. పండగ అయ్యాక అజయ్ భూపతి ‘మంగళవారం’తో భయపెట్టేందుకు సిద్ధపడుతున్నారు. సో టపాసుల పండగ రోజు థియేటర్ కు ఎంజాయ్ చేయాలంటే ఆదికేశవ ఒకవైపు ఉంటే డబ్బింగులు మాత్రం బోలెడు ఆప్షన్లు ఇస్తున్నాయి. జైలర్, లియోకు వచ్చిన కలెక్షన్లు చూసి వీటికీమధ్య డిమాండ్ పెరిగిపోయింది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…