చిరంజీవి కెరీర్లోనే మొదటిసారి ఒక సినిమా రెండు భాగాలుగా రాబోతోందా అంటే ఏమో కావొచ్చంటున్నాయి మెగా కాంపౌండ్ వర్గాలు. వశిష్ఠ దర్శకత్వంలో పాట రికార్డింగ్ తో ఇటీవలే మొదలుపెట్టిన మెగా 156కి ఈ ప్రతిపాదన సీరియస్ గా ఉందట. యువి క్రియేషన్స్ దీని మీద సుమారు 200 కోట్ల బడ్జెట్ సిద్ధం చేసిందనే వార్త ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతమున్న మార్కెట్ పరిస్థితుల్లో అంత మొత్తం చిరు మీద అంటే రిస్కే. సైరా నరసింహారెడ్డికి అంత ఖర్చు కాకపోయినా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. అందుకే బిజినెస్ పరంగా టూ పార్ట్స్ అయితేనే సేఫ్ అంటున్నారట.
ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ ప్రస్తుతమిది చర్చల దశలో ఉంది. మెగాస్టార్ తో సహా ఫ్యామిలీ మొత్తం వరుణ్ తేజ్ పెళ్లి సందడిలో ఉంది. ఒకటో తేదీ ఇటలీలో జరిగే వేడుకతో మొదలుపెట్టి హైదరాబాద్ లో నిర్వహించబోయే రిసెప్షన్ పూర్తయ్యేదాకా వాళ్ళెవరూ సినిమా పనులు చూసుకోరు. అందుకే వశిష్ట చిరు ఫ్రీ అయ్యేలోపు ప్రతిపాదన సిద్ధం చేసి హీరో ముందు ఉంచుతారని తెలిసింది. కథలో అంత స్కోప్ ఉంది కాబట్టే ఈ ఆలోచన జరుగుతోందని, బలవంతంగా సబ్జెక్టుని పొడిగించే ఉద్దేశం ఎంత మాత్రం లేదని సన్నిహితులతో వశిష్ట అన్నట్టు ఇన్ సైడ్ టాక్.
నిజమైతే మంచిదే కానీ షూటింగ్ కి బోలెడు సమయం కేటాయించాల్సి ఉంటుంది. భోళా శంకర్ దెబ్బకు కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన సినిమాని పక్కనపెట్టేసిన చిరంజీవి కొత్త కమిట్ మెంట్లు ఎవరికీ ఇవ్వలేదు. విశ్వప్రయత్నాలు చేస్తున్న వాళ్లలో వివి వినాయక్ ఉన్నాడు కానీ ఓకే అయ్యేదాకా నమ్మకంగా చెప్పలేం. తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ ప్రాజెక్టుని ఇంకో నెలలో ప్రకటించే అవకాశం లేకపోలేదు. అది కూడా ఫైనల్ వెర్షన్ సంతృప్తికరంగా వస్తేనే. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న మెగా 156 జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత వస్తున్న చిరు ఫాంటసీ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
This post was last modified on October 28, 2023 4:31 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…