చిరంజీవి కెరీర్లోనే మొదటిసారి ఒక సినిమా రెండు భాగాలుగా రాబోతోందా అంటే ఏమో కావొచ్చంటున్నాయి మెగా కాంపౌండ్ వర్గాలు. వశిష్ఠ దర్శకత్వంలో పాట రికార్డింగ్ తో ఇటీవలే మొదలుపెట్టిన మెగా 156కి ఈ ప్రతిపాదన సీరియస్ గా ఉందట. యువి క్రియేషన్స్ దీని మీద సుమారు 200 కోట్ల బడ్జెట్ సిద్ధం చేసిందనే వార్త ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతమున్న మార్కెట్ పరిస్థితుల్లో అంత మొత్తం చిరు మీద అంటే రిస్కే. సైరా నరసింహారెడ్డికి అంత ఖర్చు కాకపోయినా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. అందుకే బిజినెస్ పరంగా టూ పార్ట్స్ అయితేనే సేఫ్ అంటున్నారట.
ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ ప్రస్తుతమిది చర్చల దశలో ఉంది. మెగాస్టార్ తో సహా ఫ్యామిలీ మొత్తం వరుణ్ తేజ్ పెళ్లి సందడిలో ఉంది. ఒకటో తేదీ ఇటలీలో జరిగే వేడుకతో మొదలుపెట్టి హైదరాబాద్ లో నిర్వహించబోయే రిసెప్షన్ పూర్తయ్యేదాకా వాళ్ళెవరూ సినిమా పనులు చూసుకోరు. అందుకే వశిష్ట చిరు ఫ్రీ అయ్యేలోపు ప్రతిపాదన సిద్ధం చేసి హీరో ముందు ఉంచుతారని తెలిసింది. కథలో అంత స్కోప్ ఉంది కాబట్టే ఈ ఆలోచన జరుగుతోందని, బలవంతంగా సబ్జెక్టుని పొడిగించే ఉద్దేశం ఎంత మాత్రం లేదని సన్నిహితులతో వశిష్ట అన్నట్టు ఇన్ సైడ్ టాక్.
నిజమైతే మంచిదే కానీ షూటింగ్ కి బోలెడు సమయం కేటాయించాల్సి ఉంటుంది. భోళా శంకర్ దెబ్బకు కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన సినిమాని పక్కనపెట్టేసిన చిరంజీవి కొత్త కమిట్ మెంట్లు ఎవరికీ ఇవ్వలేదు. విశ్వప్రయత్నాలు చేస్తున్న వాళ్లలో వివి వినాయక్ ఉన్నాడు కానీ ఓకే అయ్యేదాకా నమ్మకంగా చెప్పలేం. తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ ప్రాజెక్టుని ఇంకో నెలలో ప్రకటించే అవకాశం లేకపోలేదు. అది కూడా ఫైనల్ వెర్షన్ సంతృప్తికరంగా వస్తేనే. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న మెగా 156 జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత వస్తున్న చిరు ఫాంటసీ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
This post was last modified on October 28, 2023 4:31 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…