తెలుగు రాష్ట్రాల రాజకీయాల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. పలు చిత్రాల్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి పాత్రలను చూశాం. ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’లో చంద్రబాబు ాపత్రలో ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా కనిపించగా.. రామ్ గోపాల్ వర్మ తాను తీసే పొలిటికల్ సెటైర్ సినిమాల్లో చంద్రబాబు పాత్రలో అచ్చం అలాంటి పోలికలే ఉన్న ఒక నటుడితో ఆ పాత్ర చేయిస్తున్నారు.
‘యాత్ర’ సినిమాలో చంద్రబాబు పాత్రలో ఒక నటుడిని కనిపించీ కనిపించకుండా చూపించారు దర్శకుడు మహి.వి.రాఘవ్. ఇప్పుడు అతనే ‘యాత్ర-2’ తీస్తున్నాడు. ‘యాత్ర’ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందించిన మహి.. ‘యాత్ర-2’ను జగన్ పాదయాత్ర నేపథ్యంలో నడిపించబోతున్నాడు. ఈ చిత్రంలో జగన్ పాత్రను తమిళ నటుడు జీవా చేస్తుంటే.. ‘యాత్ర’లో లీడ్ రోల్ చేసిన మమ్ముట్టినే ఇందులోనూ వైఎస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు.
కాగా ‘యాత్ర’లో మాదిరి కాకుండా ఇందులో చంద్రబాబు పాత్రకు ప్రాధాన్యం ఉంటుందట. ఆ పాత్రను పలు సన్నివేశాల్లో చూపించాల్సిన అవసరం ఉందట. అందుకే ఆ పాత్ర కోసం ఒక ప్రముఖ వ్యక్తినే తీసుకున్నాడట మహి. నటుడిగా మారి బోలెడన్ని పాత్రలు చేసిన బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్.. ‘యాత్ర-2’లో చంద్రబాబు పాత్ర చేస్తున్నట్లు సమాచారం.
తెలుగులో ‘అదుర్స్’ సహా ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలు చేసిన మహేష్ను దాదాపుగా ఇందులోనూ విలన్ తరహా పాత్రే చేస్తున్నట్లు భావించాలి. మామూలుగా చూస్తే మహేష్లో చంద్రబాబు పోలికలేమీ కనిపించవు. మరి మేకప్తో ఎలా మేనేజ్ చేశారో చూడాలి. దివంగత వైఎస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ను జనాలకు ఎమోషనల్గా కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు మహి. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మీద సినిమా తీసి మెప్పించడం అంటే అంత తేలిక కాదు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on October 28, 2023 3:14 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…