తెలుగు రాష్ట్రాల రాజకీయాల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. పలు చిత్రాల్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి పాత్రలను చూశాం. ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’లో చంద్రబాబు ాపత్రలో ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా కనిపించగా.. రామ్ గోపాల్ వర్మ తాను తీసే పొలిటికల్ సెటైర్ సినిమాల్లో చంద్రబాబు పాత్రలో అచ్చం అలాంటి పోలికలే ఉన్న ఒక నటుడితో ఆ పాత్ర చేయిస్తున్నారు.
‘యాత్ర’ సినిమాలో చంద్రబాబు పాత్రలో ఒక నటుడిని కనిపించీ కనిపించకుండా చూపించారు దర్శకుడు మహి.వి.రాఘవ్. ఇప్పుడు అతనే ‘యాత్ర-2’ తీస్తున్నాడు. ‘యాత్ర’ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందించిన మహి.. ‘యాత్ర-2’ను జగన్ పాదయాత్ర నేపథ్యంలో నడిపించబోతున్నాడు. ఈ చిత్రంలో జగన్ పాత్రను తమిళ నటుడు జీవా చేస్తుంటే.. ‘యాత్ర’లో లీడ్ రోల్ చేసిన మమ్ముట్టినే ఇందులోనూ వైఎస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు.
కాగా ‘యాత్ర’లో మాదిరి కాకుండా ఇందులో చంద్రబాబు పాత్రకు ప్రాధాన్యం ఉంటుందట. ఆ పాత్రను పలు సన్నివేశాల్లో చూపించాల్సిన అవసరం ఉందట. అందుకే ఆ పాత్ర కోసం ఒక ప్రముఖ వ్యక్తినే తీసుకున్నాడట మహి. నటుడిగా మారి బోలెడన్ని పాత్రలు చేసిన బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్.. ‘యాత్ర-2’లో చంద్రబాబు పాత్ర చేస్తున్నట్లు సమాచారం.
తెలుగులో ‘అదుర్స్’ సహా ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలు చేసిన మహేష్ను దాదాపుగా ఇందులోనూ విలన్ తరహా పాత్రే చేస్తున్నట్లు భావించాలి. మామూలుగా చూస్తే మహేష్లో చంద్రబాబు పోలికలేమీ కనిపించవు. మరి మేకప్తో ఎలా మేనేజ్ చేశారో చూడాలి. దివంగత వైఎస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ను జనాలకు ఎమోషనల్గా కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు మహి. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మీద సినిమా తీసి మెప్పించడం అంటే అంత తేలిక కాదు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on October 28, 2023 3:14 pm
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…
మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…
ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…
2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్కు…