Movie News

తెలుగు తెరపై కొత్త ‘చంద్రబాబు’

తెలుగు రాష్ట్రాల రాజకీయాల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. పలు చిత్రాల్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి పాత్రలను చూశాం. ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’లో చంద్రబాబు ాపత్రలో ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా కనిపించగా.. రామ్ గోపాల్ వర్మ తాను తీసే పొలిటికల్ సెటైర్ సినిమాల్లో చంద్రబాబు పాత్రలో అచ్చం అలాంటి పోలికలే ఉన్న ఒక నటుడితో ఆ పాత్ర చేయిస్తున్నారు.

‘యాత్ర’ సినిమాలో చంద్రబాబు పాత్రలో ఒక నటుడిని కనిపించీ కనిపించకుండా చూపించారు దర్శకుడు మహి.వి.రాఘవ్. ఇప్పుడు అతనే ‘యాత్ర-2’ తీస్తున్నాడు. ‘యాత్ర’ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందించిన మహి.. ‘యాత్ర-2’ను జగన్ పాదయాత్ర నేపథ్యంలో నడిపించబోతున్నాడు. ఈ చిత్రంలో జగన్ పాత్రను తమిళ నటుడు జీవా చేస్తుంటే.. ‘యాత్ర’లో లీడ్ రోల్ చేసిన మమ్ముట్టినే ఇందులోనూ వైఎస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు.

కాగా ‘యాత్ర’లో మాదిరి కాకుండా ఇందులో చంద్రబాబు పాత్రకు ప్రాధాన్యం ఉంటుందట. ఆ పాత్రను పలు సన్నివేశాల్లో చూపించాల్సిన అవసరం ఉందట. అందుకే ఆ పాత్ర కోసం ఒక ప్రముఖ వ్యక్తినే తీసుకున్నాడట మహి. నటుడిగా మారి బోలెడన్ని పాత్రలు చేసిన బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్.. ‘యాత్ర-2’లో చంద్రబాబు పాత్ర చేస్తున్నట్లు సమాచారం.

తెలుగులో ‘అదుర్స్’ సహా ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలు చేసిన మహేష్‌ను దాదాపుగా ఇందులోనూ విలన్ తరహా పాత్రే చేస్తున్నట్లు భావించాలి. మామూలుగా చూస్తే మహేష్‌లో చంద్రబాబు పోలికలేమీ కనిపించవు. మరి మేకప్‌తో ఎలా మేనేజ్ చేశారో చూడాలి. దివంగత వైఎస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ను జనాలకు ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు మహి. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మీద సినిమా తీసి మెప్పించడం అంటే అంత తేలిక కాదు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

This post was last modified on October 28, 2023 3:14 pm

Share

Recent Posts

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

46 minutes ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

1 hour ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

2 hours ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

2 hours ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

3 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

6 hours ago