బాలీవుడ్డే కాదు అన్ని బాషల మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న సినిమాగా అనిమల్ మీదున్న అంచనాలు ఏ స్థాయివో చెప్పాలంటే ఓపెనింగ్ రోజు వచ్చే కలెక్షన్లు చూశాకే క్లారిటీ వస్తుంది. చాప కింద నీరులా కేవలం లిరికల్ వీడియోస్ తోనే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హైప్ ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు. హీరో రన్బీర్ కపూర్ పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఇంత డార్క్ అండ్ డీప్ డ్రామాలో తానెప్పుడూ నటించలేదని, ఇలాంటి ఛాలెంజ్ ఉన్న పాత్ర దగ్గరి భవిష్యత్తులో దొరుకుంటుందన్న నమ్మకమూ లేదని అన్నాడు. దీన్ని బట్టే క్యారెక్టరైజేషన్ స్థాయిని ఊహించుకోవచ్చు.
ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని అనిమల్ కి పని చేసిన యూనిట్ టాక్. ఒళ్ళు గగుర్పొడిచే వయొలెన్స్ ఇందులో చాలా ఉంటుందని, విలన్ల బ్యాచ్ ని నరమాంసం తినే భక్షకులుగా చూపించడం స్టార్ హీరోల ఫిల్మోగ్రఫీలో ఇదే మొదటిసారి అవుతుందని ఊరిస్తున్నారు. హాలీవుడ్ లో క్యానిబాల్స్ సంస్కృతి మీద చాలా సినిమాలొచ్చాయి. కానీ మనవాళ్ళు ఎవరూ ఆ కాన్సెప్ట్ ని అంతగా వాడుకోలేకపోయారు. ఇక్కడి ఆడియన్స్ రిసీవ్ చేసుకోరనే భయమే దానికి కారణం. అయితే సందీప్ వంగా చాలా తెలివిగా వాటిని కథలో పొందుపరిచి చూపించిన తీరు సరికొత్తగా ఉంటుందట.
ఇంతే కాదు రన్బీర్ కపూర్ కుటుంబం చేసే హత్యలు, దారుణాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట. తనను ప్రేమించిన కారణంగా రష్మిక మందన్న వీళ్ళలో మార్పు తెచ్చేందుకు హోమాలు యాగాలు చేయిస్తుందట. దీనికి సంబంధించిన ఒక షాట్ ని నిన్న రిలీజ్ చేసిన పాటలో చూడొచ్చు. ఇంటర్వెల్ కు ముందు రన్బీర్ మీద శత్రువులు దాడి చేసి అతన్ని రక్తపు మడుగులో పడేసి ఎపిసోడ్ గురించి ఎంతైనా ఊహించుకోమని ఊరిస్తున్నారు. చూస్తుంటే పెద్దలకు మాత్రమే అని నిర్దేశించే ఏ సర్టిఫికెట్ తోనే అనిమల్ థియేటర్లలో అడుగుపెట్టేలా ఉంది. డిసెంబర్ 1 వీలైనంత త్వరగా రావడమే ఆలస్యం.
This post was last modified on October 28, 2023 12:09 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…