ఈ మధ్య డైరెక్ట్ ఓటిటి రిలీజవుతున్న సినిమాలకు మరీ గొప్పగా ఉందనే టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు అటుకేసి చూడటం లేదు. పైగా ఓటిటి ఫ్లాట్ ఫార్మ్స్ ఎక్కువైపోయి అన్నింటికీ చందాలు కట్టలేక రెండు మూడింటితో సర్దుకుంటున్న జనాలకు విపరీతమైన ఆప్షన్లు వచ్చి పడుతున్నాయి. ఆ కోవలో వచ్చిందే #కృష్ణారామా. ఆకాష్ పూరిని ఆంధ్రాపోరితో లాంచ్ చేసిన దర్శకుడు రాజ్ మాదిరాజు దీన్ని తెరకెక్కించారు. ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడో 1988లో అంటే ముప్పై అయిదు సంవత్సరాల క్రితం బామ్మమాట బంగారుబాటలో జంటగా కనిపించిన రాజేంద్రప్రసాద్, గౌతమి మళ్ళీ ఇప్పుడు భార్యా భర్తలుగా నటించడం.
ఇంతకీ కథేంటో చూద్దాం. పిల్లలు విదేశాల్లో స్థిరపడటంతో రిటైర్డ్ జీవితాన్ని ఒంటరిగా గడుపుతూ ఉంటారు రామతీర్థ(రాజేంద్ర ప్రసాద్), కృష్ణవేణి(గౌతమి). ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రీతీ(అనన్య శర్మ) ఉంటుంది. నెలకోసారి వీడియో కాల్స్ తో మాత్రమే సంతానంతో టచ్ లో ఉండటం భరించలేక ప్రీతీ సలహాతో జాయింట్ గా ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కృష్ణరామలు. ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టాక తక్కువ టైంలో సెలబ్రిటీలుగా మారిపోతారు. ఒక సోషల్ ఇష్యూకి సంబంధించి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకుల దాకా వెళ్దామనుకుంటారు. ఆ తర్వాత జరిగేది స్మార్ట్ స్క్రీన్ మీద చూడాలి.
వృధాప్యంలో తల్లితండ్రులకు అండగా ఉండాల్సిన అవసరాన్ని, సోషల్ మీడియా తాలూకు విపరీత పరిణామాలను ఒకే కథతో చెప్పాలనుకున్న రాజ్ మాదిరాజు దాన్ని వినోదాత్మక ధోరణికి బదులు సందేశాత్మక టైపులో చెప్పాలని ప్రయత్నించారు. దీంతో మెసేజ్ కోటింగ్ ఎక్కువైపోయి సగటు ఆడియన్స్ కి కృష్ణరామ అధిక శాతం బోర్ కొట్టేలా సాగుతుంది. కాసింత కామెడీ, వృద్ధ జంట నటనని ఎంజాయ్ చేయగలిగితే ఓకే కానీ సహజత్వానికి దూరంగా నాటకీయత ఎక్కువైపోయిన ఇలాంటి కంటెంట్ డిజిటల్ ఫార్మట్ కే కరెక్ట్. ఫార్వార్డ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి అలా ఓ లుక్ వేయడం తప్పించి మరీ ప్రత్యేకంగా అయితే లేదు.
This post was last modified on October 28, 2023 2:47 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…