ఇంకా సరైన టీజరే రాలేదు. ట్రైలర్ సంగతి దేవుడెరుగు. మొన్న ప్రభాస్ పుట్టినరోజుకి కనీసం కొత్త పోస్టర్ వదల్లేదు. అయినా సరే సలార్ నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతూనే వస్తోంది. ఏపీ తెలంగాణ కలిపి సుమారు 175 కోట్లకు బిజినెస్ జరిగిందనే వార్త అభిమానుల్లో పెద్ద చర్చకే దారి తీస్తోంది. ఇంత మొత్తం షేర్ రావాలంటే గ్రాస్ ఖచ్చితంగా 300 కోట్లు దాటేయాలి. ఆర్ఆర్ఆర్ కన్నా కొంచెం తక్కువే అయినా ఆ స్థాయి టాక్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అందుకోవచ్చు. అయితే సలార్ కున్న బజ్ దృష్ట్యా ఇది సాధ్యమేనని, టికెట్ రేట్ల పెంపుకి రెండు ప్రభుత్వాలు సహకరిస్తే చేరుకోవచ్చని అంటున్నారు.
ఇది అఫీషియల్ గా నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన వార్త కాకపోయినా బయ్యర్ల వర్గాల్లో ఎడతెగని మంతనాలకు దారి తీస్తోంది. ఎందుకంటే ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు హక్కులు కొనుగోలు చేయాలంటే ముందుగా డబ్బు సిద్ధం చేసుకోవాలి. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ మొదటి వారం వరకు కరెన్సీ లావాదేవీలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎంతో కొంత అడ్వాన్స్ ముట్టజెప్పేసి రిలీజ్ టైంకి మిగిలిన సొమ్ములు ముట్టజెప్పాలి. దీని కోసం అదనంగా వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ సలార్ మీద పోసేందుకు ఎందరో ఎగబడుతున్న మాట వాస్తవం.
ఒక రోజు ముందు షారుఖ్ ఖాన్ డుంకీ పోటీ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో దాని ప్రభావం మరీ తీవ్ర స్థాయిలో ఉండదనే నమ్మకమే ఇంత రిస్క్ కి సిద్ధపడేలా చేస్తోంది. డిసెంబర్ 22తో మొదలుపెట్టి జనవరి 12 మధ్యలో చెప్పుకోదగ్గ రిలీజులు ఏవీ పెద్దగా లేవు కాబట్టి సలార్ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఈజీగా ఇరవై రోజుల రన్ దక్కుతుంది. అంటే యావరేజ్ గా రోజుకు 15 కోట్లు గ్రాస్ వసూలు కావాలి. ప్రభాస్ ఇమేజ్, ప్రశాంత్ నీల్ బ్రాండ్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ సానుకూలంగానే కనిపిస్తున్నాయి. విడుదలకు ఇంకో యాభై అయిదు రోజులు మాత్రం టైం ఉండటంతో ఫ్యాన్స్ ఉద్వేగం క్రమంగా పెరుగుతోంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…