స్టార్ హీరోలు లేని తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో ఆడటం అరుదు. అయితే కంటెంట్ ఉన్నవి హిట్టు కొట్టిన దాఖలాలు లేకపోలేదు. ప్రేమిస్తే లాంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కానీ అవి యూత్ ని టార్గెట్ చేసుకున్నవి కాబట్టి రీచ్ ఎక్కువ. క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించిన ఒక విలేజ్ డ్రామాని తీసుకురావడం మాత్రం సాహసమే. స్రవంతి రవి కిషోర్ ఆ రిస్క్ తీసుకున్నారు. నవంబర్ 11న రాబోతున్న దీపావళి సరిగ్గా టైటిల్ కు తగ్గట్టు పండగను టార్గెట్ చేసుకుంది. ఇందాక ట్రైలర్ రిలీజ్ చేశారు. మూడు నిమిషాల వీడియోలో కథ మొత్తం అరటిపండు ఒలిచినట్టు చెప్పేశారు.
అనగనగా ఒక పల్లెటూరు. ప్రాణంగా చూసుకునే మనవడు అడిగిన కోరిక తీర్చడానికి తాతయ్య(పూరాము)దగ్గర డబ్బులు ఉండవు. దీపావళి పండక్కు ఖరీదైన దుస్తులు కోరతాడు. ఎంత చూసినా అప్పు పుట్టదు. దీంతో బలి కోసం పెంచుకున్న మేకను అమ్మడానికి సిద్ధ పడతాడు. అయితే ఇది దేవుడి వ్యవహారం కాబట్టి ఎవరూ కొనరు. మటన్ కొట్టులో పని చేసే వీరయ్య(కాళీ వెంకట్) స్వంత దుకాణం పెట్టుకోవడం కోసం మేకను కొనేందుకు తాత దగ్గరకు వస్తాడు. ఈలోగా మేకను ఒక దొంగల ముఠా ఎత్తుకుపోతుంది. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాల మధ్య వీళ్ళ ప్రయాణం ఏ గమ్యం చేరుకుందో చూడాలి.
మేకకు కమెడియన్ సప్తగిరి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆద్యంతం అచ్చమైన పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో నడిపించాడు దర్శకుడు రా వెంకట్. విజువల్స్ కూల్ గా ఉన్నాయి. తీసన్ సంగీతం సమకూర్చగా జయప్రకాశ్ ఛాయాగ్రహణం అందించారు. అసలు ట్విస్టు ఏంటంటే నవంబర్ 12 సల్మాన్ ఖాన్ టైగర్ 3 లాంటి ప్యాన్ ఇండియా మూవీని పెట్టుకుని ఒక రోజు ముందు దీపావళిని విడుదల చేసేందుకు సిద్ధపడటం. బలగం లాంటి గ్రామీణ నేపధ్య చిత్రాలకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఇది కూడా ఆ జానర్ లోనే వస్తోంది. మరి మేక బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందో లేదో చూడాలి
This post was last modified on October 26, 2023 7:31 pm
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…