దసరా సినిమాల్లో టాక్ పరంగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది ‘భగవంత్ కేసరి’నే. కానీ విడుదలకు ముందు ఈ సినిమాకు ఆశించినంత హైప్ రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నెమ్మదిగా జరిగాయి. దీంతో పోలిస్తే అనువాద చిత్రం అయిన ‘లియో’నే బాక్సాఫీస్ దగ్గర డామినేట్ చేసింది. తొలి రోజు టాక్ పరంగా ‘భగవంత్ కేసరి’ పైచేయి సాధించినా సరే.. కలెక్షన్ల విషయంలో ‘లియో’ తగ్గలేదు.
తొలి రోజు ఓ మోస్తరు వసూళ్లు సాధించిన ‘భగవంత్ కేసరి’ రెండో రోజు ఇంకా తక్కువ కలెక్షన్లతో సరిపెట్టుకోవడంతో ఈ సినిమా అంతిమంగా ఎలాంటి ఫలితం అందుకుంటుందో అన్న సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే రూ.60 కోట్లకు పైగా షేర్ సాధిస్తేనే ‘భగవంత్ కేసరి’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి ఉంది. దీంతో హిట్ టాక్ వచ్చినప్పటికీ.. వసూళ్ల పరంగా ఈ సినిమా ‘హిట్’ అనిపించుకుంటుందా లేదా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కానీ క్రమ క్రమంగా వసూళ్లు పెంచుకుంటూ వెళ్లిన ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది. దసరా పండుగ సెలవులను బాగా వాడుకున్నది ఈ చిత్రమే. సోమవారం పండుగ రోజు, ఆ తర్వాత కూడా వసూళ్లు నిలకడగా వచ్చాయి. వీక్ డేస్లోనూ మంచి ఆక్యుపెన్సీలు రావడం సినిమాకు కలిసొచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.80 కోట్లకు పైగా గ్రాస్, రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.
ఈ వారం ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే చిన్న సినిమా మినహాయిస్తే చెప్పుకోదగ్గ రిలీజ్లు లేవు. కాబట్టి ఈ వీకెండ్ కూడా ‘భగవంత్ కేసరి’ డామినేషన్ కొనసాగడం ఖాయం. ఇంకో వారం పాటు అదే బాక్సాఫీస్ విన్నర్గా నిలవబోతోంది. కాబట్టి ఇంకో పది కోట్ల షేర్ సాధించడం, బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేమీ కాదు. బయ్యర్లకు ఓ మోస్తరుగా లాభాలు కూడా అందించబోతోందీ చిత్రం. కాబట్టి బాలయ్యకు హ్యాట్రిక్ హిట్ దక్కినట్లే.
This post was last modified on October 26, 2023 6:41 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…