కెరీర్ చరమాంకంలోకి వచ్చిన హీరోయిన్లందరూ పెళ్లి వైపు అడుగులు వేసే వాళ్లే. ఐతే అమలా పాల్ మాత్రం కొంచెం భిన్నం. ఆమె తన కెరీర్ పీక్స్లో ఉండగానే పెళ్లి చేసుకుంది. కానీ ఆ వివాహం ఎంతో కాలం నిలవలేదు. తనకు కేవలం పాతికేళ్ల వయసుండగా.. కెరీర్ మంచి ఊపు మీదుండగా ఆమె తమిళ దర్శకుడు విజయ్ను పెళ్లాడటం.. రెండేళ్లకే వీళ్లిద్దరూ విడిపోవడం తెలిసిందే.
ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు మరో రిలేషన్షిప్లోకి వెళ్లలేదు అమలా. మధ్యలో ఒక సింగర్తో ఆమెకు పెళ్లయినట్లు జోరుగా ప్రచారం జరిగింది. అదంతా ఉత్తుత్తిదే అని తర్వాత తేలింది. ఐతే ఎట్టకేలకు అమలా పాల్ మళ్లీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న జగత్ దేశాయ్తో ఆమె వివాహ బంధంలోకి వెళ్లనుంది. అతడి మ్యారేజ్ ప్రపోజల్కు తాజాగా అమలా ఆమోద ముద్ర వేసింది.
తాజాగా అమలా తన 32వ పుట్టిన రోజును జరుపుకుంది. ఆ సందర్భంగా జగత్తో కలిసి ఆమె డేట్కు వెళ్లింది. ఇద్దరూ డిన్నర్ చేసిన అనంతరం అమలాకు జగత్ ప్రపోజ్ చేశాడు. ఆమె ఓకే చెప్పింది. ఈ వీడియోను జగతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ బంధం అధికారికం అయింది. కొంత కాలంగా జగత్తో కలిసి అమలా తరచుగా మీడియా కళ్లలో పడుతోంది.
అప్పుడే వీళ్లిద్దరి మధ్య రిలేషన్షిప్ నడుస్తోందని అర్థమైంది. ఇప్పుడు అఫీషియల్గా తమ రిలేషన్ గురించి ఈ జంట మీడియాతో పాటు అందరికీ చెప్పేసింది. తమిళంలో ఒక బి గ్రేడ్ మూవీతో అమలా కథానాయికగా పరిచయం అయింది. ఆ సినిమా విషయంలో అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా అమలా మాత్రం పాపులర్ అయింది. ఆ తర్వాత ‘మైనా’ సినిమా మెయిన్ స్ట్రీమ్ మూవీస్లో ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో సహా పలు చిత్రాల్లో నటించింది అమలా.
This post was last modified on October 26, 2023 4:43 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…