Movie News

అమలాపాల్‌కు మళ్లీ పెళ్లి

కెరీర్ చరమాంకంలోకి వచ్చిన హీరోయిన్లందరూ పెళ్లి వైపు అడుగులు వేసే వాళ్లే. ఐతే అమలా పాల్ మాత్రం కొంచెం భిన్నం. ఆమె తన కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది. కానీ ఆ వివాహం ఎంతో కాలం నిలవలేదు. తనకు కేవలం పాతికేళ్ల వయసుండగా.. కెరీర్ మంచి ఊపు మీదుండగా ఆమె తమిళ దర్శకుడు విజయ్‌ను పెళ్లాడటం.. రెండేళ్లకే వీళ్లిద్దరూ విడిపోవడం తెలిసిందే.

ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు మరో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లలేదు అమలా. మధ్యలో ఒక సింగర్‌తో ఆమెకు పెళ్లయినట్లు జోరుగా ప్రచారం జరిగింది. అదంతా ఉత్తుత్తిదే అని తర్వాత తేలింది. ఐతే ఎట్టకేలకు అమలా పాల్ మళ్లీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న జగత్ దేశాయ్‌తో ఆమె వివాహ బంధంలోకి వెళ్లనుంది. అతడి మ్యారేజ్ ప్రపోజల్‌కు తాజాగా అమలా ఆమోద ముద్ర వేసింది.

తాజాగా అమలా తన 32వ పుట్టిన రోజును జరుపుకుంది. ఆ సందర్భంగా జగత్‌తో కలిసి ఆమె డేట్‌కు వెళ్లింది. ఇద్దరూ డిన్నర్ చేసిన అనంతరం అమలాకు జగత్ ప్రపోజ్ చేశాడు. ఆమె ఓకే చెప్పింది. ఈ వీడియోను జగతే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ బంధం అధికారికం అయింది. కొంత కాలంగా జగత్‌తో కలిసి అమలా తరచుగా మీడియా కళ్లలో పడుతోంది.

అప్పుడే వీళ్లిద్దరి మధ్య రిలేషన్‌షిప్‌ నడుస్తోందని అర్థమైంది. ఇప్పుడు అఫీషియల్‌గా తమ రిలేషన్ గురించి ఈ జంట మీడియాతో పాటు అందరికీ చెప్పేసింది. తమిళంలో ఒక బి గ్రేడ్ మూవీతో అమలా కథానాయికగా పరిచయం అయింది. ఆ సినిమా విషయంలో అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా అమలా మాత్రం పాపులర్ అయింది. ఆ తర్వాత ‘మైనా’ సినిమా మెయిన్ స్ట్రీమ్ మూవీస్‌లో ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో సహా పలు చిత్రాల్లో నటించింది అమలా.

This post was last modified on October 26, 2023 4:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

12 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

6 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

6 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago