సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేసుకోవడం పెద్ద చిక్కుగా మారిపోయింది. మాస్ మహారాజా రవితేజ దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో ఇవాళ కొత్త సినిమా మొదలైంది. ప్రత్యేకంగా నిన్నంతా దీనికి పని చేస్తున్న టీమ్ సభ్యుల ఫోటోలతో మైత్రి సంస్థ సోషల్ మీడియాలో స్పెషల్ ప్రమోషన్లు చేసింది. రైటర్లను సైతం ఫోటోలు తీయించి పబ్లిసిటీలో వాడుకోవడం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో ఈవివి జమానాలో టైటిల్ కార్డులో ఇలా చేసేవారు కానీ తర్వాత ఎవరూ ఫాలో కాలేదు. డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత ఈ కలయికలో వస్తున్న నాలుగో మూవీ ఇది.
అంతా బాగానే ఉంది కానీ హీరోయిన్ మాత్రం ఇంకా ఎంపికవ్వలేదు. రష్మిక మందన్న కోసం గట్టిగానే ట్రై చేశారు కానీ సాధ్యం కాలేదని వినికిడి. ఇదే బ్యానర్ లో పుష్ప చేస్తున్న ఈమెకు కాల్ షీట్ల సమస్య ఉండటంతో ఆఖరి నిమిషం వరకు ట్రై చేసి చివరికి నో చెప్పిందని సమాచారం. ఉప్పెన భామ కృతి శెట్టిని కూడా అడిగారు కానీ ఇంకా సిగ్నల్ రాలేదని అంటున్నారు. మాస్ రాజా పక్కన జోడిగా సెట్ అవుతుందా లేదానే అనుమానాలు లేకపోలేదు. ప్రస్తుతానికి థర్డ్ ఆప్షన్ చూస్తున్నారు కానీ ఇంకో వారం పది రోజులు ఆగితే కానీ క్లారిటీ రాకపోవచ్చని అంతర్గత వర్గాల సమాచారం.
వీరసింహారెడ్డి తర్వాత గోపిచంద్ మలినేని చేస్తున్న సినిమా ఇదే. స్క్రిప్ట్ మీద ఆరేడు నెలలు పని చేశారు. ఇది క్రాక్ తరహాలోనే నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతోందట. విలన్ గా సెల్వ రాఘవన్, మరో ముఖ్యమైన పాత్రలో ఇందుజా రవిచంద్రన్ నటించబోతున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, తమన్ సంగీతం మరోసారి ఈ బృందానికి బలం కాబోతున్నాయి. రావణుసుర డిజాస్టర్ ఫలితం, టైగర్ నాగేశ్వరరావు ఫ్లాప్ తర్వాత ఈగల్ కోసం ఎదురు చూస్తున్న రవితేజకు తన పర్ఫెక్ట్ గా డీల్ చేస్తానని పేరున్న గోపిచంద్ తో మళ్ళీ జత కట్టడం పట్ల ఫుల్లు హ్యాపీగా ఉన్నాడు
This post was last modified on October 26, 2023 4:37 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…