రానా దగ్గుబాటి కెరీర్ను ‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’కి తర్వాత అని చెప్పొచ్చు. అంతకుముందు వరకు అతను హీరోగా ట్రై చేసి అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. ప్రేక్షకుల్లో యాక్సిప్టెన్స్ తెచ్చుకోలేక తన కెరీరో డోలాయమాన స్థితిలో ఉండేది. కానీ ‘బాహుబలి’లో భల్లాలదేవుడిగా విలన్ పాత్రను అద్భుతంగా పోషించడంతో తనకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఆ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అతడికి తిరుగులేని డిమాండ్ ఏర్పడింది.
బహు భాషల్లో రకరకాల పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు రానా. ఇటీవలే అతను సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో ఒక కీలక పాత్రకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రానా.. మెగాస్టార్ చిరంజీవికి విలన్గా నటించబోతున్నాడన్న వార్త టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా దసరా రోజు కొత్త సినిమా మొదలైన సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు పని చేసే సాంకేతిక నిపుణుల వివరాలు బయటికి వచ్చాయి కానీ.. కాస్టింగ్ సంగతే ఇంకా తేలలేదు. హీరోయిన్లుగా రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. విలన్ పాత్రకు రానా ఓకే అయినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఐతే చిరుకు విలన్గా రానా అంటే ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్నదే డౌట్. ఎందుకంటే చిరుకు బేసిగ్గా రానా బాగా క్లోజ్. రామ్ చరణ్కు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ రానానే. అతణ్ని కూడా తన కొడుకులా చూస్తాడు చిరు. వ్యక్తిగతంగా ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్లు సినిమాలో హీరో-విలన్ పాత్రలు చేస్తే సెట్ అవుతుందా అన్న డౌట్ ఉంది. బేసిగ్గా రానా విలన్ పాత్రలో అదరగొట్టేయగలడు కానీ.. చిరుతో ఉన్న వ్యక్తిగత బంధం ఒక్కటే ఈ పాత్రను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న సందేహం కలుగుతోంది.
This post was last modified on October 26, 2023 12:06 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…