స్టార్ యాంకర్ సుమ ఇవాళ జరిగిన ఆదికేశవ ప్రెస్ మీట్ లో ఈవెంట్ ప్రారంభానికి ముందు కొందరు కెమెరామెన్లను ఉద్దేశించి అన్న మాటలు మీడియా వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీశాయి. బయట స్నాక్స్ తింటున్న వాళ్ళు వాటిని భోజనంలా కాకుండా త్వరగా తిని రావాలని ఈ విషయాన్ని మరో ముగ్గురికి చెప్పాలని వ్యంగ్యంగా చెప్పడంతో కొందరు ఆ మాటల పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగిపోయాయి,. వేదిక మీద అప్పటికప్పుడు సుమ ఏదో సరిచెప్పే ప్రయత్నం చేసింది కానీ అదంత కన్విసింగ్ గా లేకపోయినా మిగిలిన ప్రోగ్రాం జరిగింది.
దీని మీద ట్విట్టర్ లో పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరికి సుమ ఒక వీడియో మెసేజ్ ద్వారా తన మాటలు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించాలని, ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కలిసి పని చేశాం కాబట్టి అర్థం చేసుకోవాలని కోరుతూ సారీ చెప్పింది. ఇక్కడితో ఈ ఇష్యూకి చెక్ పడినట్టే అనుకోవాలి. నిజానికి సుమ స్లిప్ అయ్యిందనే చెప్పాలి. ప్రోగ్రాం దగ్గర స్నాక్స్ ఏర్పాటు చేసినప్పుడు సహజంగా ఎవరైనా వాటిని తీసుకుని వస్తారు. ఇక్కడ చిన్నా పెద్ద తేడా ఏమి ఉండదు. వచ్చిందే అటెండ్ కావడానికి అయినప్పుడు అదే పనిగా తిండి మీద ధ్యాస పెట్టడం లాంటివి ఉండవు.
ఏదైతేనేం సుమ ఫైనల్ గా క్షమాపణ చెప్పడం మంచిదే అయ్యింది. ఇంటర్ నెట్ ప్రపంచంలో ప్రతిదీ వీడియో రూపంలో చక్కర్లు కొట్టడం సహజమైపోయింది. అలాంటప్పుడు తమాషాకి అన్నా, ఏ ఉద్దేశంతో ఏదైనా మాట్లాడినా దాని ప్రభావం ఒక్కోసారి చాలా దూరం వెళ్ళిపోతుంది. మాములుగా సుమ వివాదాలకు దూరంగా ఉంటుంది. కానీ ఇలా అత్యుత్సాహంతో మీడియా మీద జోకులు వేయడాన్ని మాత్రం ఎవరూ సమర్ధించరు. ఇప్పుడీ టాపిక్ వల్లే అంతగా ఫోకస్ లో లేని ఆదికేశవ పాట గురించి జనాలకు తెలిసిపోయింది. అనుకోకుండా జరిగినా కొన్నింటి పుణ్యాలు పురుషార్ధాలు ఈ రకంగా నెరవేరతాయి.
This post was last modified on October 26, 2023 12:03 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…