అదేంటో తమన్ పాటలతోనే కాదు ఒక్కోసారి మాటలతోనూ ట్రోలింగ్ కు గురవుతాడు. భగవంత్ కేసరి ప్రమోషన్ల భాగంగా దర్శకుడు బాబీ బాలయ్య టీమ్ తో చేసిన ఇంటర్వ్యూలో భాగంగా తమన్ చెప్పిన కొన్ని విషయాలు రాంగ్ ట్రిగ్గర్ అయ్యాయి. జీవం లేని సన్నివేశాలు చనిపోయిన శవం లాంటివని, వాటిని మంచి మ్యూజిక్ ఇచ్చి లేపమంటే ఎవరి వల్లా కాదని అన్నాడు. అనిల్ రావిపూడి మంచి అవుట్ ఫుట్ తెచ్చాడు కాబట్టి తాను బెస్ట్ ఇవ్వగలిగానని, అఖండకు అలాగే జరిగిందని ఇంకో ఉదాహరణ ఇచ్చాడు. నిజానికి తమన్ తేడా వచ్చిన ఫలితాల గురించి ఏ సినిమా పేరు చెప్పలేదు.
సరిగ్గా ఇక్కడే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చారు. వాళ్లకు ముందు నుంచి సర్కారు వారి పాటకు తమన్ పనితనం మీద వీలు దొరికినప్పుడల్లా ట్రోల్ చేస్తూనే ఉంటారు. అల వైకుంఠపురముని మించి ఇస్తాడనుకుంటే యావరేజ్ ఆల్బమ్ తో నిరాశ పరిచాడని నిలదీస్తుంటారు. ముఖ్యంగా బీచ్ ఫైట్ కు చప్పగా బిజిఎం ఇవ్వడాన్ని చాలాసార్లు ప్రస్తావించారు. గుంటూరు కారంకి తన పేరే ప్రకటించినప్పుడు సోషల్ మీడియా పెద్ద ఎత్తున నో అనే క్యాంపైన్ రన్ చేశారు. ఇప్పుడు తమన్ అన్నది తమనేనని భావించి కారాలు మిరియాలు నూరడం మొదలుపెట్టారు.
హిట్టో ఫ్లాపో ఏ సినిమాకైనా సంగీత దర్శకుడు ఒకే పనితనం ఇవ్వాలన్నది ఫ్యాన్స్ కామెంట్. ఎన్నో డిజాస్టర్లకు మణిశర్మ, రెహమాన్ లాంటి వాళ్ళు మేజిక్ చేసిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. అంతే తప్ప చచ్చిన శవంతో ఒక దర్శకుడి పనితనాన్ని అవమానించడం ఏమిటని అభిమనుల ప్రశ్న. ఇద్దరి వైపు లాజిక్ ఉంది కానీ తమన్ కాస్త అత్యుత్సాహపడి పోలికను తప్పుగా ఎంచుకున్నాడు కానీ లేకపోతే ఇంత బ్యాక్ ఫైర్ వచ్చేది కాదు. గుంటూరు కారం, గేమ్ ఛేంజర్ లతో తమన్ చాలా బలంగా ఋజువు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా ఇంతకు రెండింతలు టార్గెట్ చేసుకుంటారు.
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…