అదేంటో తమన్ పాటలతోనే కాదు ఒక్కోసారి మాటలతోనూ ట్రోలింగ్ కు గురవుతాడు. భగవంత్ కేసరి ప్రమోషన్ల భాగంగా దర్శకుడు బాబీ బాలయ్య టీమ్ తో చేసిన ఇంటర్వ్యూలో భాగంగా తమన్ చెప్పిన కొన్ని విషయాలు రాంగ్ ట్రిగ్గర్ అయ్యాయి. జీవం లేని సన్నివేశాలు చనిపోయిన శవం లాంటివని, వాటిని మంచి మ్యూజిక్ ఇచ్చి లేపమంటే ఎవరి వల్లా కాదని అన్నాడు. అనిల్ రావిపూడి మంచి అవుట్ ఫుట్ తెచ్చాడు కాబట్టి తాను బెస్ట్ ఇవ్వగలిగానని, అఖండకు అలాగే జరిగిందని ఇంకో ఉదాహరణ ఇచ్చాడు. నిజానికి తమన్ తేడా వచ్చిన ఫలితాల గురించి ఏ సినిమా పేరు చెప్పలేదు.
సరిగ్గా ఇక్కడే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చారు. వాళ్లకు ముందు నుంచి సర్కారు వారి పాటకు తమన్ పనితనం మీద వీలు దొరికినప్పుడల్లా ట్రోల్ చేస్తూనే ఉంటారు. అల వైకుంఠపురముని మించి ఇస్తాడనుకుంటే యావరేజ్ ఆల్బమ్ తో నిరాశ పరిచాడని నిలదీస్తుంటారు. ముఖ్యంగా బీచ్ ఫైట్ కు చప్పగా బిజిఎం ఇవ్వడాన్ని చాలాసార్లు ప్రస్తావించారు. గుంటూరు కారంకి తన పేరే ప్రకటించినప్పుడు సోషల్ మీడియా పెద్ద ఎత్తున నో అనే క్యాంపైన్ రన్ చేశారు. ఇప్పుడు తమన్ అన్నది తమనేనని భావించి కారాలు మిరియాలు నూరడం మొదలుపెట్టారు.
హిట్టో ఫ్లాపో ఏ సినిమాకైనా సంగీత దర్శకుడు ఒకే పనితనం ఇవ్వాలన్నది ఫ్యాన్స్ కామెంట్. ఎన్నో డిజాస్టర్లకు మణిశర్మ, రెహమాన్ లాంటి వాళ్ళు మేజిక్ చేసిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. అంతే తప్ప చచ్చిన శవంతో ఒక దర్శకుడి పనితనాన్ని అవమానించడం ఏమిటని అభిమనుల ప్రశ్న. ఇద్దరి వైపు లాజిక్ ఉంది కానీ తమన్ కాస్త అత్యుత్సాహపడి పోలికను తప్పుగా ఎంచుకున్నాడు కానీ లేకపోతే ఇంత బ్యాక్ ఫైర్ వచ్చేది కాదు. గుంటూరు కారం, గేమ్ ఛేంజర్ లతో తమన్ చాలా బలంగా ఋజువు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా ఇంతకు రెండింతలు టార్గెట్ చేసుకుంటారు.
This post was last modified on October 25, 2023 6:03 pm
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది.…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోరులో అందరినీ ఆకర్షించిన ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో పవన్ కల్యాణ్ పోటీ చేసిన…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. ప్రధాని మోడీ బిగ్ ఆఫర్ ఇచ్చారు. మోడీ వరుసగా మూడోసారి కూడా.. పరమ పవిత్ర కాశీ…
తెలంగాణ వ్యాప్తంగా పది రోజుల పాటు సింగల్ స్క్రీన్లను మూసేయాలనే నిర్ణయం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేసింది.…
పుష్ప 2 ది రైజ్ విడుదలకు సరిగ్గా మూడు నెలలు మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఆగస్ట్ 15 నుంచి ఎలాంటి…
ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎవరూ ఊహించని విధంగా జరిగింది. సోమవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ అన్ని…