ఇటీవలే ప్రారంభమైన నాని సరిపోదా శనివారం అభిమానుల్లోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేపింది. కాన్సెప్ట్ ఏంటో చెప్పకుండా వెరైటీగా కట్ చేయించిన టీజర్ మూవీ లవర్స్ ని ఆకట్టుకుంది. తన సాధారణ శైలికి భిన్నంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈసారి కమర్షియల్ జానర్ తో పాటు యాక్షన్ ని టచ్ చేయబోతున్నట్టు క్లారిటీ వచ్చింది. ఎస్జె సూర్యలాంటి ఖరీదైన నటుడిని విలన్ గా ఎంచుకోవడం, సాంకేతిక వర్గాన్ని క్వాలిటీగా సెట్ చేసుకోవడం ఇత్యాది అంశాలు హైప్ పెంచుతున్నాయి. అయితే టైటిల్ వెనుక గుట్టు ఏంటో అర్థం కాక అందరికీ పెద్ద సస్పెన్స్ లా మిగిలిపోయింది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో నానిని డిఫరెంట్ గా చూపించబోతున్నట్టు సమాచారం. వారంలో ఆరు రోజులు మాములు మనిషిగా ఉంటూ ఒక్క శనివారం మాత్రమే సూపర్ పవర్స్ వచ్చి అతీత శక్తిగా మారిపోయే పవర్ ఫుల్ పాత్రలో నానిలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట. తానుండే ఊరికి ప్రమాదం తలపడితే వాళ్ళను రక్షించడం కోసం పోరాడే వీరుడిగా ఎప్పుడూ చూడని కమర్షియల్ టచ్ ఇందులో జోడిస్తారని తెలిసింది. నాని మాస్ సినిమాలంటే వెంటనే నేను లోకల్, ఎంసిఏలు గుర్తొస్తాయి. కానీ వాటిలో లేని ఎలివేషన్ యాంగిల్స్ ఇందులో ఉంటాయని అంటున్నారు.
సరిపోదా శనివారం పేరు వెనుక ఉన్న అర్థం ఇదేనని వినికిడి. విలన్ ని ఛాలెంజ్ చేసే క్రమంలో నిన్ను ఎదిరించి మట్టికరిపించడానికి ఒక్క రోజు చాలని హీరో పాత్ర చేసే సవాల్ లో భాగంగా ఉంటుందని అంటున్నారు. ఇది నిజమో కాదో నిర్ధారణగా చెప్పలేం కానీ కాన్సెప్ట్ అయితే బాగుంది. గ్యాంగ్ లీడర్ తర్వాత ప్రియాంకా మోహన్ ఇందులో నానితో జత కడుతోంది. ఇదే డివివి బ్యానర్ లో నిర్మిస్తున్న ఓజిలో పవన్ కళ్యాణ్ కూ తనే జోడి అన్న సంగతి తెలిసిందే. ఇంకా చాలా పెద్ద క్యాస్టింగ్ ఉందట. డేట్లు తీసుకోవడం ఆలస్యం ఒక్కొక్కటిగా అధికారిక ప్రకటనలు వచ్చేస్తాయి.
This post was last modified on October 25, 2023 1:53 pm
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…