దసరా సినిమాల్లో హైప్ వల్ల మొదటి రోజు లియో కొంత ఎక్కువ ఎడ్జ్ తీసుకున్నట్టు అనిపించినా ఓ రెండు షోలు పూర్తవ్వడం ఆలస్యం భగవంత్ కేసరి డామినేషన్ అంతకంతా పెరుగుతూ పోతోంది. నిన్నసెలవుల్లో చివరి రోజుని పూర్తిగా వాడుకుంటూ బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయించడంతో రవితేజ,. విజయ్ లు తర్వాతి స్థానాలతో సర్దుకోవాల్సి వచ్చింది. ప్రధాన కేంద్రాలన్నీ బాలయ్యకు హౌస్ ఫుల్స్ పడ్డాయి. మొదటి రోజు తర్వాత ఆ స్థాయిలో ఫిగర్లు నమోదయ్యింది నిన్ననే. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు ఏవీ లేకపోవడంతో ఇంకో వీకెండ్ కేసరి కంట్రోల్ లోకి రాబోతోంది.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు భగవంత్ కేసరి ఆరు రోజులకు గాను వసూలు చేసిన షేర్ 51 కోట్ల 80 లక్షల దాకా ఉంది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఇంకో 19 కోట్లు వచ్చేస్తే లాభాల్లోకి అడుగు పెట్టేస్తుంది. వీకెండ్ డ్రాప్ సహజమే అయినా అది మరీ తీవ్రంగా లేకపోవడం ఈ సినిమాకు కలిసి వచ్చేలా ఉంది. మరో వైపు లియో ఆక్యుపెన్సీలు చాలా మటుకు తగ్గిపోయాయి. మెయిన్ సెంటర్స్ మినహాయించి బిసి కేంద్రాల్లో దీనికి ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు లేదు. యూత్ మొదటి రెండు మూడు రోజుల్లోనే చూసేయడంతో థియేటర్లు అదే పనిగా నిండటం లేదు.
ఇక వీరసింహారెడ్డిని కేసరి దాటడం గురించి ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. సంక్రాంతికున్నంత ఫుల్ సహజంగా దసరాకు ఉండదు కాబట్టి ఆ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేయడం అంత సులభం కాదు. శ్రీలీల పాత్ర సెంటిమెంట్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశాలు కుటుంబ ప్రేక్షకుల్లో బాగా దూసుకుపోవడం టీమ్ ప్రమోషన్ కు ఉపయోగపడుతోంది. ఈ నెల బుక్ మై షో యాప్ లో ఇప్పటిదాకా 1 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయిన ఒకే టాలీవుడ్ మూవీగా భగవంత్ కేసరి నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి అప్రతిహత జైత్రయాత్ర ఏడో సినిమాను నుంచి కొనసాగుతోంది. బాలయ్యకు హ్యాట్రిక్ దక్కింది.
This post was last modified on October 25, 2023 1:07 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…