దసరా సినిమాల్లో హైప్ వల్ల మొదటి రోజు లియో కొంత ఎక్కువ ఎడ్జ్ తీసుకున్నట్టు అనిపించినా ఓ రెండు షోలు పూర్తవ్వడం ఆలస్యం భగవంత్ కేసరి డామినేషన్ అంతకంతా పెరుగుతూ పోతోంది. నిన్నసెలవుల్లో చివరి రోజుని పూర్తిగా వాడుకుంటూ బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయించడంతో రవితేజ,. విజయ్ లు తర్వాతి స్థానాలతో సర్దుకోవాల్సి వచ్చింది. ప్రధాన కేంద్రాలన్నీ బాలయ్యకు హౌస్ ఫుల్స్ పడ్డాయి. మొదటి రోజు తర్వాత ఆ స్థాయిలో ఫిగర్లు నమోదయ్యింది నిన్ననే. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు ఏవీ లేకపోవడంతో ఇంకో వీకెండ్ కేసరి కంట్రోల్ లోకి రాబోతోంది.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు భగవంత్ కేసరి ఆరు రోజులకు గాను వసూలు చేసిన షేర్ 51 కోట్ల 80 లక్షల దాకా ఉంది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఇంకో 19 కోట్లు వచ్చేస్తే లాభాల్లోకి అడుగు పెట్టేస్తుంది. వీకెండ్ డ్రాప్ సహజమే అయినా అది మరీ తీవ్రంగా లేకపోవడం ఈ సినిమాకు కలిసి వచ్చేలా ఉంది. మరో వైపు లియో ఆక్యుపెన్సీలు చాలా మటుకు తగ్గిపోయాయి. మెయిన్ సెంటర్స్ మినహాయించి బిసి కేంద్రాల్లో దీనికి ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు లేదు. యూత్ మొదటి రెండు మూడు రోజుల్లోనే చూసేయడంతో థియేటర్లు అదే పనిగా నిండటం లేదు.
ఇక వీరసింహారెడ్డిని కేసరి దాటడం గురించి ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. సంక్రాంతికున్నంత ఫుల్ సహజంగా దసరాకు ఉండదు కాబట్టి ఆ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేయడం అంత సులభం కాదు. శ్రీలీల పాత్ర సెంటిమెంట్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశాలు కుటుంబ ప్రేక్షకుల్లో బాగా దూసుకుపోవడం టీమ్ ప్రమోషన్ కు ఉపయోగపడుతోంది. ఈ నెల బుక్ మై షో యాప్ లో ఇప్పటిదాకా 1 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయిన ఒకే టాలీవుడ్ మూవీగా భగవంత్ కేసరి నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి అప్రతిహత జైత్రయాత్ర ఏడో సినిమాను నుంచి కొనసాగుతోంది. బాలయ్యకు హ్యాట్రిక్ దక్కింది.
This post was last modified on October 25, 2023 1:07 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…