టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో సినిమా అనగానే కొన్నేళ్ల కిందట దక్షిణాది ప్రేక్షకులందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఓకే అయిన దగ్గర్నుంచి ఒక సెన్సేషన్గానూ ఉంటూ వచ్చింది. విడుదలకు ముందు అంచనాలు మామూలుగా లేవు. కానీ ఆ అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది స్పైడర్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చి, అతి పెద్ద డిజాస్టర్గా నిలిచింది. మంచి ఫాంలో ఉన్న మురుగదాస్..మహేష్తో ఇలాంటి సినిమా తీస్తాడని ఎవరూ ఊహించలేదు. అక్కడి నుంచే మరుగదాస్ పతనం మొదలైంది. ఆ తర్వాత ఆయన తీసిన రెండు సినిమాలూ నిరాశపరిచాయి.
ఇప్పుడున్న ఫాంలో మురుగదాస్తో మహేషే కాదు.. ఏ టాలీవుడ్ టాప్ స్టార్ కూడా పని చేస్తాడని అనుకోలేం. అలాంటిది మళ్లీ మహేష్ బాబుతో సినిమా చేయడానికి మురుగదాస్ ప్రయత్నిస్తుండటం విశేషం. ఈ విషయాన్ని ఓ తమిళ మీడియా సంస్థతో మురుగదాసే స్వయంగా వెల్లడించాడు. తాను మహేష్ కోసం మళ్లీ ఓ కథ రాస్తున్నానని.. అది పూర్తి కావస్తోందని.. త్వరలోనే మహేష్కు కథ చెబుతానని మురుగదాస్ తెలిపాడు. మరి మురుగదాస్తో మళ్లీ సినిమా చేయడం సంగతటుంచితే.. కథ వినడానికైనా మహేష్ సుముఖంగా ఉన్నాడా అన్నది ప్రశ్న. స్పైడర్ డిజాస్టర్ అయినా.. ఆ తర్వాత రెండు సినిమాలు తీసినా… మురుగదాస్ మాత్రం ఇప్పటికీ ట్విట్టర్ ప్రొఫైల్ పిక్గా స్పైడర్ పోస్టరే కొనసాగిస్తుండటాన్ని బట్టి మహేష్ మీద అభిమానం తగ్గలేదనే అనుకోవాలి.
This post was last modified on August 27, 2020 1:55 am
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…