టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో సినిమా అనగానే కొన్నేళ్ల కిందట దక్షిణాది ప్రేక్షకులందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఓకే అయిన దగ్గర్నుంచి ఒక సెన్సేషన్గానూ ఉంటూ వచ్చింది. విడుదలకు ముందు అంచనాలు మామూలుగా లేవు. కానీ ఆ అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది స్పైడర్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చి, అతి పెద్ద డిజాస్టర్గా నిలిచింది. మంచి ఫాంలో ఉన్న మురుగదాస్..మహేష్తో ఇలాంటి సినిమా తీస్తాడని ఎవరూ ఊహించలేదు. అక్కడి నుంచే మరుగదాస్ పతనం మొదలైంది. ఆ తర్వాత ఆయన తీసిన రెండు సినిమాలూ నిరాశపరిచాయి.
ఇప్పుడున్న ఫాంలో మురుగదాస్తో మహేషే కాదు.. ఏ టాలీవుడ్ టాప్ స్టార్ కూడా పని చేస్తాడని అనుకోలేం. అలాంటిది మళ్లీ మహేష్ బాబుతో సినిమా చేయడానికి మురుగదాస్ ప్రయత్నిస్తుండటం విశేషం. ఈ విషయాన్ని ఓ తమిళ మీడియా సంస్థతో మురుగదాసే స్వయంగా వెల్లడించాడు. తాను మహేష్ కోసం మళ్లీ ఓ కథ రాస్తున్నానని.. అది పూర్తి కావస్తోందని.. త్వరలోనే మహేష్కు కథ చెబుతానని మురుగదాస్ తెలిపాడు. మరి మురుగదాస్తో మళ్లీ సినిమా చేయడం సంగతటుంచితే.. కథ వినడానికైనా మహేష్ సుముఖంగా ఉన్నాడా అన్నది ప్రశ్న. స్పైడర్ డిజాస్టర్ అయినా.. ఆ తర్వాత రెండు సినిమాలు తీసినా… మురుగదాస్ మాత్రం ఇప్పటికీ ట్విట్టర్ ప్రొఫైల్ పిక్గా స్పైడర్ పోస్టరే కొనసాగిస్తుండటాన్ని బట్టి మహేష్ మీద అభిమానం తగ్గలేదనే అనుకోవాలి.
పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…
నాలుగు నెలల తర్వాత ఏపీ తెలంగాణ థియేటర్లు నిండుగా కళకళలాడుతూ కనిపించాయి. కారణం పెద్ది. ఒక పెద్ద స్టార్ హీరో…
ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…