టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో సినిమా అనగానే కొన్నేళ్ల కిందట దక్షిణాది ప్రేక్షకులందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఓకే అయిన దగ్గర్నుంచి ఒక సెన్సేషన్గానూ ఉంటూ వచ్చింది. విడుదలకు ముందు అంచనాలు మామూలుగా లేవు. కానీ ఆ అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది స్పైడర్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చి, అతి పెద్ద డిజాస్టర్గా నిలిచింది. మంచి ఫాంలో ఉన్న మురుగదాస్..మహేష్తో ఇలాంటి సినిమా తీస్తాడని ఎవరూ ఊహించలేదు. అక్కడి నుంచే మరుగదాస్ పతనం మొదలైంది. ఆ తర్వాత ఆయన తీసిన రెండు సినిమాలూ నిరాశపరిచాయి.
ఇప్పుడున్న ఫాంలో మురుగదాస్తో మహేషే కాదు.. ఏ టాలీవుడ్ టాప్ స్టార్ కూడా పని చేస్తాడని అనుకోలేం. అలాంటిది మళ్లీ మహేష్ బాబుతో సినిమా చేయడానికి మురుగదాస్ ప్రయత్నిస్తుండటం విశేషం. ఈ విషయాన్ని ఓ తమిళ మీడియా సంస్థతో మురుగదాసే స్వయంగా వెల్లడించాడు. తాను మహేష్ కోసం మళ్లీ ఓ కథ రాస్తున్నానని.. అది పూర్తి కావస్తోందని.. త్వరలోనే మహేష్కు కథ చెబుతానని మురుగదాస్ తెలిపాడు. మరి మురుగదాస్తో మళ్లీ సినిమా చేయడం సంగతటుంచితే.. కథ వినడానికైనా మహేష్ సుముఖంగా ఉన్నాడా అన్నది ప్రశ్న. స్పైడర్ డిజాస్టర్ అయినా.. ఆ తర్వాత రెండు సినిమాలు తీసినా… మురుగదాస్ మాత్రం ఇప్పటికీ ట్విట్టర్ ప్రొఫైల్ పిక్గా స్పైడర్ పోస్టరే కొనసాగిస్తుండటాన్ని బట్టి మహేష్ మీద అభిమానం తగ్గలేదనే అనుకోవాలి.
This post was last modified on August 27, 2020 1:55 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…