సినిమా కుటుంబాల మధ్య పెళ్లి సంబంధాలు కుదరడం కొత్తేమీ కాదు. బాలీవుడ్లో ఈ ఒరవడి బాగా ఎక్కువ. టాలీవుడ్లోనూ అప్పుడప్పుడూ ఇలా సంబంధాలు సెట్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి కలయికే చూడబోతున్నట్లు సమాచారం. కీరవాణి కుటుంబం మురళీ మోహన్ కుటుంబంతో వియ్యం అందుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి.. మురళీ మోహన్ మనవరాలిని పెళ్లాడబోతున్నాడట.
సింహాకు ఆ అమ్మాయితో ఇప్పటికే పరిచయం ఉందని.. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని.. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఆమోద ముద్ర వేశాయని తెలుస్తోంది. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా ఉండొచ్చని అంటున్నారు. ఐతే ఇంకా కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవకు పెళ్లి కాలేదు. మరి ముందు తన వివాహం జరిపించి తర్వాత సింహా పెళ్లి సంగతి చూస్తారేమో తెలియదు. సింహా అయితే ఎంగేజ్ అయిపోయాడని తెలుస్తోంది.
కాలభైరవ, సింహా ఒకేసారి ‘మత్తువదలరా’ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయ్యారు. కాలభైరవ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సంగీత దర్శకుడిగా మారితే.. సింహా హీరోగా అరంగేట్రం చేశాడు. కాలభైరవ కెరీర్ ఇప్పుడు బాగానే సాగుతోంది కానీ… తొలి సినిమా సక్సెస్ తర్వాత సింహా మాత్రం తడబడుతున్నాడు.
తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్.. ఇలా అతను చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. వీటిలో ‘ఉస్తాద్’ విషయం ఉన్న సినిమానే అయినా.. ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయింది. హీరోగా నిలదొక్కుకోవడానికి అతను కష్టపడుతున్నాడు. మురళీ మోహన్ మనవరాలు బిజినెస్ ఉమన్ అని తెలుస్తోంది. మురళీ మోహన్ కుటుంబం ఇప్పుడు సినిమాలకు దాదాపుగా దూరంగా ఉంటోంది. వారికి భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఉన్నాయి.
This post was last modified on October 24, 2023 5:06 pm
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…
దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా కొనసాగుతున్న తమిళనాడులో శుక్రవారం రాజకీయంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న…