సినిమా కుటుంబాల మధ్య పెళ్లి సంబంధాలు కుదరడం కొత్తేమీ కాదు. బాలీవుడ్లో ఈ ఒరవడి బాగా ఎక్కువ. టాలీవుడ్లోనూ అప్పుడప్పుడూ ఇలా సంబంధాలు సెట్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి కలయికే చూడబోతున్నట్లు సమాచారం. కీరవాణి కుటుంబం మురళీ మోహన్ కుటుంబంతో వియ్యం అందుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి.. మురళీ మోహన్ మనవరాలిని పెళ్లాడబోతున్నాడట.
సింహాకు ఆ అమ్మాయితో ఇప్పటికే పరిచయం ఉందని.. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని.. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఆమోద ముద్ర వేశాయని తెలుస్తోంది. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా ఉండొచ్చని అంటున్నారు. ఐతే ఇంకా కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవకు పెళ్లి కాలేదు. మరి ముందు తన వివాహం జరిపించి తర్వాత సింహా పెళ్లి సంగతి చూస్తారేమో తెలియదు. సింహా అయితే ఎంగేజ్ అయిపోయాడని తెలుస్తోంది.
కాలభైరవ, సింహా ఒకేసారి ‘మత్తువదలరా’ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయ్యారు. కాలభైరవ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సంగీత దర్శకుడిగా మారితే.. సింహా హీరోగా అరంగేట్రం చేశాడు. కాలభైరవ కెరీర్ ఇప్పుడు బాగానే సాగుతోంది కానీ… తొలి సినిమా సక్సెస్ తర్వాత సింహా మాత్రం తడబడుతున్నాడు.
తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్.. ఇలా అతను చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. వీటిలో ‘ఉస్తాద్’ విషయం ఉన్న సినిమానే అయినా.. ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయింది. హీరోగా నిలదొక్కుకోవడానికి అతను కష్టపడుతున్నాడు. మురళీ మోహన్ మనవరాలు బిజినెస్ ఉమన్ అని తెలుస్తోంది. మురళీ మోహన్ కుటుంబం ఇప్పుడు సినిమాలకు దాదాపుగా దూరంగా ఉంటోంది. వారికి భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఉన్నాయి.
This post was last modified on October 24, 2023 5:06 pm
పెళ్లి లేదు ప్రెగ్నెంటూ లేదు, కొడుకు పేరు కృష్ణమనోహర్ అనేది కొత్త సామెత. కొన్ని రిలీజ్ డేట్ల వ్యవహారం చూస్తుంటే…
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…