సినిమా కుటుంబాల మధ్య పెళ్లి సంబంధాలు కుదరడం కొత్తేమీ కాదు. బాలీవుడ్లో ఈ ఒరవడి బాగా ఎక్కువ. టాలీవుడ్లోనూ అప్పుడప్పుడూ ఇలా సంబంధాలు సెట్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి కలయికే చూడబోతున్నట్లు సమాచారం. కీరవాణి కుటుంబం మురళీ మోహన్ కుటుంబంతో వియ్యం అందుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి.. మురళీ మోహన్ మనవరాలిని పెళ్లాడబోతున్నాడట.
సింహాకు ఆ అమ్మాయితో ఇప్పటికే పరిచయం ఉందని.. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని.. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఆమోద ముద్ర వేశాయని తెలుస్తోంది. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా ఉండొచ్చని అంటున్నారు. ఐతే ఇంకా కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవకు పెళ్లి కాలేదు. మరి ముందు తన వివాహం జరిపించి తర్వాత సింహా పెళ్లి సంగతి చూస్తారేమో తెలియదు. సింహా అయితే ఎంగేజ్ అయిపోయాడని తెలుస్తోంది.
కాలభైరవ, సింహా ఒకేసారి ‘మత్తువదలరా’ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయ్యారు. కాలభైరవ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సంగీత దర్శకుడిగా మారితే.. సింహా హీరోగా అరంగేట్రం చేశాడు. కాలభైరవ కెరీర్ ఇప్పుడు బాగానే సాగుతోంది కానీ… తొలి సినిమా సక్సెస్ తర్వాత సింహా మాత్రం తడబడుతున్నాడు.
తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్.. ఇలా అతను చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. వీటిలో ‘ఉస్తాద్’ విషయం ఉన్న సినిమానే అయినా.. ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయింది. హీరోగా నిలదొక్కుకోవడానికి అతను కష్టపడుతున్నాడు. మురళీ మోహన్ మనవరాలు బిజినెస్ ఉమన్ అని తెలుస్తోంది. మురళీ మోహన్ కుటుంబం ఇప్పుడు సినిమాలకు దాదాపుగా దూరంగా ఉంటోంది. వారికి భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఉన్నాయి.
This post was last modified on October 24, 2023 5:06 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…