సినిమా కుటుంబాల మధ్య పెళ్లి సంబంధాలు కుదరడం కొత్తేమీ కాదు. బాలీవుడ్లో ఈ ఒరవడి బాగా ఎక్కువ. టాలీవుడ్లోనూ అప్పుడప్పుడూ ఇలా సంబంధాలు సెట్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి కలయికే చూడబోతున్నట్లు సమాచారం. కీరవాణి కుటుంబం మురళీ మోహన్ కుటుంబంతో వియ్యం అందుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి.. మురళీ మోహన్ మనవరాలిని పెళ్లాడబోతున్నాడట.
సింహాకు ఆ అమ్మాయితో ఇప్పటికే పరిచయం ఉందని.. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని.. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఆమోద ముద్ర వేశాయని తెలుస్తోంది. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా ఉండొచ్చని అంటున్నారు. ఐతే ఇంకా కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవకు పెళ్లి కాలేదు. మరి ముందు తన వివాహం జరిపించి తర్వాత సింహా పెళ్లి సంగతి చూస్తారేమో తెలియదు. సింహా అయితే ఎంగేజ్ అయిపోయాడని తెలుస్తోంది.
కాలభైరవ, సింహా ఒకేసారి ‘మత్తువదలరా’ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయ్యారు. కాలభైరవ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సంగీత దర్శకుడిగా మారితే.. సింహా హీరోగా అరంగేట్రం చేశాడు. కాలభైరవ కెరీర్ ఇప్పుడు బాగానే సాగుతోంది కానీ… తొలి సినిమా సక్సెస్ తర్వాత సింహా మాత్రం తడబడుతున్నాడు.
తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్.. ఇలా అతను చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. వీటిలో ‘ఉస్తాద్’ విషయం ఉన్న సినిమానే అయినా.. ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయింది. హీరోగా నిలదొక్కుకోవడానికి అతను కష్టపడుతున్నాడు. మురళీ మోహన్ మనవరాలు బిజినెస్ ఉమన్ అని తెలుస్తోంది. మురళీ మోహన్ కుటుంబం ఇప్పుడు సినిమాలకు దాదాపుగా దూరంగా ఉంటోంది. వారికి భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఉన్నాయి.
This post was last modified on October 24, 2023 5:06 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…