ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండు నడుస్తోంది. హిట్ అయిన ప్రతి సినిమాకూ సీక్వెల్, లేదా సెకండ్ పార్ట్ అనౌన్స్ చేసేస్తున్నారు. ఈ దిశగా సినిమాల చివర్లో హింట్ కూడా ఇస్తున్నారు. ఐతే చాలా వరకు ఈ సినిమాలు ప్రకటనల వరకే పరిమితం అవుతున్నాయి. తర్వాత సీక్వెల్, సెకండ్ పార్ట్ ఊసే ఎత్తట్లేదు ఎవ్వరూ. టాలీవుడ్ లేటెస్ట్ హిట్ ‘భగవంత్ కేసరి’కి సీక్వెల్ ఉంటుందా అనే ఒక చర్చ నడుస్తుండగా.. అనిల్ రావిపూడి అది కష్టమే అన్నట్లు మాట్లాడాడు.
‘భగవంత్ కేసరి’ సక్సెస్ సెలబ్రేషన్లలో అనిల్కు ఈ సినిమా సీక్వెల్ మీద ప్రశ్న ఎదురైంది. దానికి అతను బదులిస్తూ.. ‘‘భగవంత్ కేసరికి సీక్వెల్ తీసేంత ధైర్యం నాకు లేదు. ఇప్పటికే నేను మోయలేనంత భారం మోసి అలసిపోయాను. ఒకవేళ సీక్వెల్ తీసేంత ధైర్యం, దమ్ము నాకు బాలకృష్ణ గారు ఇస్తే.. సీక్వెల్ గురించి ఆలోచిస్తా’’ అని చెప్పాడు.
ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అగ్ర నిర్మాత దిల్ రాజు ‘భగవంత్ కేసరి’ చాలా రోజుల పాటు ఆడే సినిమా అన్నారు. అనిల్ రావిపూడి చివరి అయిదు సినిమాలూ తన బేనర్లోనే చేశాడని.. ‘భగవంత్ కేసరి’ కథను తాను ఎప్పుడో విన్నానని ఆయన వెల్లడించారు. ‘‘ఈ కథ నాకు ఎప్పుడో చెప్పాడు అనిల్. తెలంగాణ మాండలికంలో బాలయ్య గారు డైలాగ్స్ చెబితే చాలా కొత్తగా ఉంటుందని చెప్పా.
ముందు ఈ సినిమాకు ‘బ్రో.. ఐ డోంట్ కేర్’ అనే టైటిలే అనుకున్నాడు అనిల్. చివరికి ‘భగవంత్ కేసరి’గా మార్చాడు. ‘భగవంత్ కేసరి’ సినిమా ఫ్యామిలీస్, లేడీస్కి బాగా కనెక్టయింది. ఈ రోజు నాకు తెలిసిన డాక్టర్లు ఇద్దరు ఈ సినిమా చూసి భలే ఉందని చెప్పారు. ఫ్యామిలీస్కి కనెక్ట్ అయిన సినిమా ఎక్కడికో వెళ్లిపోతుంది. ఈ సినిమాను చాలా రోజుల పాటు ప్రమోట్ చేస్తూనే ఉండాలి. ఇది లాంగ్ రన్ ఫిల్మ్’’ అని దిల్ రాజు అభిప్రాయపడ్డాడు.
This post was last modified on October 24, 2023 4:39 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…