బాక్సాఫీస్ వద్ద దసరా బ్లాక్ బస్టర్ గా నిలిచిన భగవంత్ కేసరి ఈ జోరు కనీసం ఇంకో వారం కొనసాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే 55 శాతం దాకా రికవరీ జరిగిపోయిన నేపథ్యంలో మిగిలింది నవంబర్ తొలినాటికి పూర్తయ్యే సూచనలు గట్టిగానే కనిపిస్తున్నాయి. కంటెంట్ పరంగా అనిల్ రావిపూడి ఎప్పుడూ చూడని కథని చెప్పలేదు కానీ తండ్రి కాని తండ్రి సెంటిమెంట్ తో బాలయ్య, శ్రీలీల మధ్య చూపించిన ఎమోషన్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటూ ఆడపిల్లలకు ఇచ్చిన సందేశం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. లియో, టైగర్ నాగేశ్వరరావు కన్నా బెటర్ ఆప్షన్ గా నిలుస్తోంది.
ఇదిలా ఉండగా ఇంత విజయం సాధించిన భగవంత్ కేసరి ఫలితం పట్ల కళ్యాణ్ రామ్ మౌనంగా ఉండటం పట్ల నందమూరి అభిమానుల్లో పలురకాల చర్చలు జరుగుతున్నాయి. మాములుగా బాబాయ్ ఏదైనా పెద్ద హిట్టు కొట్టినప్పుడు తను స్పందించడం చాలా సార్లు జరిగింది. అఖండ, వీరసింహారెడ్డిలకు కూడా ట్వీట్లు పెట్టాడు. మరి కళ్ళముందు కనిపిస్తున్న భగవంత్ కేసరి గురించి ఒక్క మాట చెప్పకపోవడం ఎందుకోనని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇవాళ పండగ సందర్భంగా డెవిల్ పోస్టర్ షేర్ చేసుకున్న కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో తన సినిమా వరకు యాక్టివ్ గానే ఉన్నాడు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత సైలెంట్ గా ఉండటం పట్ల తన మీద తమ్ముడి మీద వచ్చిన కామెంట్లను దృష్టిలో పెట్టుకుని రెస్పాన్స్ ఇవ్వడం లేదా ఇంకొన్ని రోజులు ఆగుదామనుకున్నాడా తెలియాల్సి ఉంది. వచ్చే నెల డెవిల్ రిలీజ్ కాబోతోంది. దర్శకుడి మార్పు విషయంలో ఆల్రెడీ రచ్చ జరిగింది. దాని గురించి కూడా కళ్యాణ్ రామ్ మౌనంగానే ఉన్నాడు. త్వరలోనే డెవిల్ పబ్లిసిటీ మొదలు పెట్టాలి. మీడియా ముందుకు రావాలి. రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి. కేవలం సినిమాకు మాత్రమే కట్టుబడి ఎవరూ అడగరు కాబట్టి ముందస్తు ప్రిపరేషన్ అవసరం అయ్యేలా ఉంది.
This post was last modified on October 23, 2023 8:48 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…