ఒక మోహన్ బాబు సినిమాలో ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు అనే పాట ఉంటుంది. అంటే బిల్డప్ ఇవ్వడం తప్ప ఏమి చేయలేని వారిని ఉద్దేశించి లిరిక్స్ ఉంటాయి. ఇవి టైగర్ శ్రోఫ్ సినిమాకు అతికినట్టు సరిపోతున్నాయి. దసరా పండగ సందర్బంగా మొన్న అక్టోబర్ 20న భారీ ఎత్తున విడుదల చేసిన గణపథ్ పరిస్థితి మరీ అన్యాయంగా మారిపోయింది. రెండు రోజులకు కలిపి కనీసం 5 కోట్లు వసూలు చేయలేని దీన స్థితి చూసి బయ్యర్లు లబోదిబోమంటున్నారు. దేశం మొత్తం షోల ఆక్యుపెన్సీ 10 శాతం దాటడమే గగనంగా మారడంతో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగలనుంది.
హిందీలో పోటీ లేకుండా రిలీజైనా దాన్ని వాడుకోలేకపోవడం కన్నాపెద్ద ట్రాజెడీ ఏముంటుంది. మరోపక్క దీన్ని నమ్ముకుని ఎనిమిది వారాల ఓటిటి గ్యాప్ లేదని లియోని నిషేధించి బిల్డప్ ఇచ్చిన కొన్ని ఉత్తరాది మల్టీప్లెక్సులు ఘొల్లుమంటున్నాయి. జవాన్ తర్వాత నార్త్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ రాలేదు. దాన్నే మూడు వారాలు నమ్ముకుని మంచి ఫీడింగ్ తెచ్చుకున్నారు కానీ ఇప్పటికే జనం విపరీతంగా చూసేయడంతో కొన్ని కేంద్రాలు మినహాయించి అన్ని చోట్ల డ్రాప్ అయిపోయింది. గణపథ్ కనీసం యావరేజ్ ఉన్నా సరే ఏదోలే అని జనం థియేటర్లు వచ్చేవారు.
ఇంకో పెద్ద కామెడీ ఏంటంటే దర్శకుడు వికాస్ బహ్ల్ దీన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కే దిక్కు లేదంటే సీక్వెల్ ని కొనే నాథుడు ఉండడు. మాస్ లో మంచి పట్టుందని పేరున్న టైగర్ శ్రోఫ్ కి ఇంత దారుణమైన ఓపెనింగ్ రావడం ట్రేడ్ ని ఆశ్చర్య పరుస్తోంది. మితిమీరిన హీరోయిజంతో ఇతగాడిని అతిగా చూపించే డైరెక్టర్లకు గణపథ్ ఫలితం ఒకరకంగా చెంపపెట్టు లాంటిది. అర్థం లేని కథా కథనాలు, తలా తోక లేని గ్రాఫిక్స్ తో ఆడియన్స్ సహనంతో ఆడుకున్నందుకు తగిన మూల్యం చెల్లించారు. ఈ ప్రభావం టైగర్ బాబు నెక్స్ట్ మూవీ చోటే మియా బడే మియా మీద పడేలా ఉంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…