ఈ ఏడాది క్రిస్మస్ బాక్సాఫీస్ క్లాష్ విషయంలో ఏం జరుగుతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. షారుఖ్ ఖాన్ మూవీ ‘డుంకి’కి ఎప్పుడో క్రిస్మస్ డేట్ ఖాయం చేసుకున్నారు. కానీ ఈ మధ్యే ప్రభాస్ సినిమా ‘సలార్’ను కూడా క్రిస్మస్ రేసులోకి తీసుకొచ్చారు. సెప్టెంబరు 28 నుంచి వాయిదా పడ్డ ఆ చిత్రం కోసం పలు డేట్లను పరిశీలించి చివరికి ‘డుంకి’ ఉందని తెలిసి కూడా క్రిస్మస్ సీజన్ను ఎంచుకున్నారు.
ఐతే షారుఖ్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఆలస్యం అవుతోందని.. ‘సలార్’తో క్లాష్కు భయపడుతున్నారని.. అందుకే ఆ చిత్రాన్ని వాయిదా వేయబోతున్నారని కొన్ని రోజులు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలు నిరాధారమని తర్వాత ‘డుంకి’ టీం నుంచి సంకేతాలు అందాయి. ఇప్పుడు ఆ విషయమే ఖరారు చేస్తూ.. ‘డుంకి’ని క్రిస్మస్ బరిలో దించుతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు.
డుంకిని ఇండియాలో డిసెంబరు 22న, విదేశాల్లో మాత్రం డిసెంబరు 21న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆ విషయాన్నే ధ్రువీకరించారు. విదేశాల్లో ఈ చిత్రాన్ని ఒక రోజు ముందుగా రిలీజ్ చేయనున్న విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా ఈ రోజు కన్ఫమ్ చేశారు. ఒక సైనికుడు ఒక మాటను నెరవేర్చేందుకు చేసిన ప్రయాణమే ఈ సినిమా అనే విషయాన్ని పోస్టర్ మీద రాశారు. సలార్ డిసెంబరు 22న రాబోతుండగా.. దానికి ఒక్క రోజు ముందే అంతర్జాతీయంగా ‘డుంకి’ సందడి చేయబోతోంది.
మొత్తానికి డుంకి క్రిస్మస్కే రాబోతోందన్న విషయంలో సందేహాలేమీ లేవు. దీన్ని బట్టి ‘సలార్’ను చూసి ‘డుంకి’ టీం భయపడటం లాంటిదేమీ జరగట్లేదని స్పష్టమైంది. ఇప్పటిదాకా తాను తీసిన ప్రతి సినిమాతోనూ బ్లాక్ బస్టర్ కొట్టిన రాజ్ కుమార్ హిరాని మీద నమ్మకంతోనే షారుఖ్ సాహసానికి సిద్ధపడి ఉండొచ్చు. రెండు భారీ చిత్రాలూ క్రిస్మస్నే టార్గెట్ చేయడంతో ఇక ఇండియాలో మరే భాషలో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు క్రిస్మస్కు రానట్లే. ఈ రెండు చిత్రాల కోసం ఎక్కడికక్కడ భారీగా థియేటర్లను దక్కించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి క్రిస్మస్కు బాక్సాఫీస్లో అదిరిపోయే క్లాష్ చూడబోతున్నామన్నమాట.
This post was last modified on October 22, 2023 10:05 am
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…