దర్శకుడు లోకేష్ కనగరాజ్ లియో విషయంలో అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయినా వసూళ్లు మాత్రం రచ్చ చేస్తున్నాయి. ఒక్కసారయినా చూడాల్సిందేనని మూవీ లవర్స్ గట్టిగా డిసైడైపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయి. తమిళనాడులో సహజమే కానీ తెలుగులోనూ భారీ ఫిగర్స్ నమోదు కావడం విశేషం. విజయ్ పోషించిన పార్తిబన్, లియో పాత్రలకు సంబంధించి ఫ్యాన్స్ పూర్తిగా సంతృప్తిపడకపోవడంతో రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ని లోకేష్ ఎలా డీల్ చేస్తాడనే టెన్షన్ తలైవా అభిమానుల్లో మొదలైంది. దాని కన్నా ముందు మూవీ లవర్స్ డిమాండ్ మరొకటి ఉంది.
కార్తీతో లోకేష్ కనగరాజ్ చేసిన ఖైదీ 2 ముందు కావాలని అడుగుతున్నారు. ఒక్క రాత్రిలో జరిగే సంఘటనలతో ఒక సూపర్ క్రైమ్ థ్రిల్లర్ చూసిన అనుభూతి ఇప్పట్లో మర్చిపోవడం కష్టం. ముఖ్యంగా ఢిల్లీ క్యారెక్టర్ లో కార్తీ పరకాయ ప్రవేశం చేసిన తీరు, పోలీసులను కాపాడే ముందు డేక్షా బిర్యానిని ముందేసుకుని తిన్న ఎపిసోడ్ మాములుగా పేలలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రౌడీ గ్యాంగ్ చుట్టుముట్టిన పోలీస్ స్టేషన్ ఫైట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఢిల్లీ ఎందుకు జైలుకు వెళ్ళాడనే ప్రశ్నకు సమాధానం రెండో భాగంలో చూపిస్తానని లోకేష్ పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు.
ఇప్పుడు దానికి సమాధానం దొరకాలి. లోకేష్ సినిమాటిక్ యునివర్స్ ని కొనసాగించాలంటే ముందు ఢిల్లీని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాలి. విక్రమ్ కన్నా ముందు ఇతని ఫ్లాష్ బ్యాక్ రివీల్ కావాలి. అయితే రజనీకాంత్ 171 పూర్తి చేయడానికి టైం పడుతుంది. ఆ తర్వాతే ఖైదీ 2 ఉంటుంది. ఎంత లేదన్నా 2025 కు ముందు సాధ్యపడదు. అప్పటిదాకా వెయిటింగ్ తప్పదు. లియో కూడా లోకేష్ అనుసంధాన ప్రపంచంలో భాగమని క్లారిటీ వచ్చేసింది కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా కార్తీ, సూర్య, విజయ్, కమల్ హాసన్ లను ఒకే ఫ్రేమ్ లో చూస్తే అంతకన్నా అరాచకం ఊహించుకోవడం కూడా కష్టమే.
This post was last modified on October 21, 2023 12:59 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…