దర్శకుడు లోకేష్ కనగరాజ్ లియో విషయంలో అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయినా వసూళ్లు మాత్రం రచ్చ చేస్తున్నాయి. ఒక్కసారయినా చూడాల్సిందేనని మూవీ లవర్స్ గట్టిగా డిసైడైపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయి. తమిళనాడులో సహజమే కానీ తెలుగులోనూ భారీ ఫిగర్స్ నమోదు కావడం విశేషం. విజయ్ పోషించిన పార్తిబన్, లియో పాత్రలకు సంబంధించి ఫ్యాన్స్ పూర్తిగా సంతృప్తిపడకపోవడంతో రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ని లోకేష్ ఎలా డీల్ చేస్తాడనే టెన్షన్ తలైవా అభిమానుల్లో మొదలైంది. దాని కన్నా ముందు మూవీ లవర్స్ డిమాండ్ మరొకటి ఉంది.
కార్తీతో లోకేష్ కనగరాజ్ చేసిన ఖైదీ 2 ముందు కావాలని అడుగుతున్నారు. ఒక్క రాత్రిలో జరిగే సంఘటనలతో ఒక సూపర్ క్రైమ్ థ్రిల్లర్ చూసిన అనుభూతి ఇప్పట్లో మర్చిపోవడం కష్టం. ముఖ్యంగా ఢిల్లీ క్యారెక్టర్ లో కార్తీ పరకాయ ప్రవేశం చేసిన తీరు, పోలీసులను కాపాడే ముందు డేక్షా బిర్యానిని ముందేసుకుని తిన్న ఎపిసోడ్ మాములుగా పేలలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రౌడీ గ్యాంగ్ చుట్టుముట్టిన పోలీస్ స్టేషన్ ఫైట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఢిల్లీ ఎందుకు జైలుకు వెళ్ళాడనే ప్రశ్నకు సమాధానం రెండో భాగంలో చూపిస్తానని లోకేష్ పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు.
ఇప్పుడు దానికి సమాధానం దొరకాలి. లోకేష్ సినిమాటిక్ యునివర్స్ ని కొనసాగించాలంటే ముందు ఢిల్లీని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాలి. విక్రమ్ కన్నా ముందు ఇతని ఫ్లాష్ బ్యాక్ రివీల్ కావాలి. అయితే రజనీకాంత్ 171 పూర్తి చేయడానికి టైం పడుతుంది. ఆ తర్వాతే ఖైదీ 2 ఉంటుంది. ఎంత లేదన్నా 2025 కు ముందు సాధ్యపడదు. అప్పటిదాకా వెయిటింగ్ తప్పదు. లియో కూడా లోకేష్ అనుసంధాన ప్రపంచంలో భాగమని క్లారిటీ వచ్చేసింది కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా కార్తీ, సూర్య, విజయ్, కమల్ హాసన్ లను ఒకే ఫ్రేమ్ లో చూస్తే అంతకన్నా అరాచకం ఊహించుకోవడం కూడా కష్టమే.
This post was last modified on October 21, 2023 12:59 am
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…