ఒకప్పటి వింటేజ్ బ్లాక్ బస్టర్లు ఎన్నింటిలోనో హీరోయిన్ గా అగ్ర హీరోలతో భాగం పంచుకున్న లేడీ అమితాబ్ గా పేరొందిన విజయశాంతి చాలా కాలంగా తెరకు దూరంగా ఉన్నారు. ఎన్ని ఆఫర్లు వచ్చినా సరే ఏళ్ళ తరబడి నో మేకప్ అంటూ వచ్చారు. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ ముద్ర వేయాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు కోసం ఆవిడను ఒప్పించగలిగాడు. మహేష్ బాబు సినిమా కావడంతో పాటు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇవ్వడం వెంటనే చేసేయడం, అది బ్లాక్ బస్టర్ కావడం జరిగిపోయాయి.
ఆ సమయంలో భవిష్యత్తులో మళ్ళీ సినిమాలు చేసే అవకాశం లేదన్న విజయశాంతికి మరో కథ నచ్చేసింది. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ఇవాళ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఓపెనింగ్ కి ప్రధాన తారాగణం విచ్చేశారు. హీరొయిన్ సయీ మంజ్రేకర్. విజయశాంతిని అంతగా మెప్పించిందంటే స్టోరీలో గట్టి మ్యాటరే ఉందన్న మాట. ఈ ప్రదీప్ గతంలో నారా రోహిత్ తో రాజా చెయ్యి వేస్తే తీశాడు. ఆశించిన ఫలితం అందుకోలేదు. తిరిగి ఇంత విరామం తర్వాత నందమూరి హీరోని ఒప్పించి ప్రాజెక్టు ఓకే చేసుకున్నాడు.
ఇలాగే విజయశాంతి కొనసాగితే బాగుటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. బాబాయ్ బాలయ్యతో ముద్దుల మావయ్య, మువ్వగోపాలుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ లో తెరను పంచుకున్న సీనియర్ నటితో తాను నటించడం కళ్యాణ్ రామ్ కు ఒక మెమరీగా ఉండిపోతుంది. ప్రస్తుతం డెవిల్ విడుదల కోసం ఎదురు చూస్తున్న ఈ నందమూరి హీరో దాని మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వరస ఫ్లాపులతో డౌన్ లో ఉన్న మార్కెట్ ని ఒక్కసారిగా బింబిసార తిరిగి ఇచ్చేసింది. దీంతో కాంబినేషన్ల ఎంపికలో కళ్యాణ్ రామ్ జాగ్రత్తగా ఉంటున్నాడు. వేరే దర్శకుడితో బింబిసార 2 ప్లానింగ్ ఉందని ఇన్ సైడ్ టాక్.
This post was last modified on October 20, 2023 8:04 pm
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…