కన్నడలో కల్ట్ ఫిలింగా పేరు తెచ్చుకోవడమే కాదు మంచి వసూళ్లను కూడా రాబట్టిన సప్త సాగరాలు దాటి సైడ్ ఏ తెలుగులో ఎలాంటి మేజిక్ చేయలేకపోయింది. ఇది థియేటర్లలో వచ్చి వెళ్లిందనే సంగతి కూడా ఎవరికీ గుర్తు లేనంత వేగంగా మాయమైపోయింది. దీనికి తోడు డబ్బింగ్ వెర్షన్ వచ్చిన వారం రోజులకే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయడంతో ఉన్న కాసిన్ని ఆశలు ఆవిరయ్యాయి. రక్షిత్ శెట్టి హీరోగా రూపొందిన ఈ లవ్ కం జైలు డ్రామాలో బోలెడంత ఎమోషన్ ని దట్టించారు దర్శకుడు హేమంత్ రావు. శాండల్ వుడ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి కానీ మనవాళ్లకు ఎక్కలేదు.
ఇప్పుడు కీలకమైన రెండో భాగం రిలీజ్ కు రెడీ అవుతోంది. వాస్తవానికి అక్టోబర్ 27 విడుదల ప్లాన్ చేసుకున్నారు. కానీ శివరాజ్ కుమార్ ఘోస్ట్ తో పాటు పక్క బాషల లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావుల నుంచి దసరా పోటీ తీవ్రంగా ఉండటంతో రిస్క్ అవుతుందని భావించి నవంబర్ 17కి షిఫ్ట్ చేశారు. ఆ టైంలో పెద్దగా పోటీ లేదు. నిజానికి సప్తసాగరాలు దారి సైడ్ బిలో అసలు స్టోరీ ఉంటుంది. హీరో శిక్ష పూర్తి చేసుకుని బయటికి వచ్చాక హీరోయిన్ దూరమైపోయి ఉంటుంది. కొత్త లైఫ్ పార్ట్ నర్ ని వెతుక్కుంటాడు. తన లైఫ్ ని నాశనం చేసిన వాళ్ళ పని పట్టేందుకు సంకల్పిస్తాడు.
అయితే ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యుంటే తెలుగు ప్రేక్షకులు కూడా సీక్వెల్ ని థియేటర్లలో చూసేందుకు ఆసక్తి ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడా ఛాన్స్ తక్కువే. ప్రమోషన్ పరంగా ఏదైనా మేజిక్ చేస్తే జనం అప్పుడు కదులుతారేమో కానీ ప్రస్తుతానికి బజ్ ఏర్పరచడం అంత సులభం కాదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హక్కులను కొన్న సంగతి తెలిసిందే. సైడ్ ఏ వర్కౌట్ కాకపోయినా దీని మీద నమ్మకం చూపిస్తున్నారు. ఈ మధ్య ఇతర బాషల ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమాలు మన జనాలకు అంతగా ఎక్కడం లేదు. సిద్దార్థ్ గొప్పగా చెప్పుకున్న చిన్నా సైతం ఇక్కడ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది.
This post was last modified on October 20, 2023 5:59 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…