స్టార్ యాంకర్ ఓంకార్ కు హారర్ సినిమాలు తీయడంలో ప్రత్యేక ఇమేజ్ ఉంది. దెయ్యలతో కామెడీ చేయించడంలో లారెన్స్ తర్వాత అంత గుర్తింపు వచ్చింది తనకే. అందుకే నాగార్జున, సమంతా లాంటి స్టార్లు సైతం రాజుగారి గది 2లో నటించేందుకు ముందుకొచ్చారు. అయితే దాని మూడో భాగం ఫెయిలవ్వడంతో కొంత గ్యాప్ తీసుకున్న ఓంకార్ ఈసారి వెబ్ సిరీస్ తో వచ్చాడు. మాన్షన్ 24 పేరుతో ఆరు ఎపిసోడ్ల సిరీస్ మొన్నటి నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ట్రైలర్ గట్రా ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకులు ఓ లుక్ వేద్దామనుకున్నారు. ఇంతకీ మాన్షన్ భయపెట్టిందా.
పురావస్తు శాఖలో పని చేసే కాళిదాసు(సత్యరాజ్) అదృశ్యం కావడంతో అతని మీద దేశద్రోహం కేసు నమోదవుతుంది. ఆ దిగులుతో తల్లి మంచాన పడటంతో అసలేం జరిగిందో కనుక్కుందామని కూతురు అమృత(వరలక్ష్మి శరత్ కుమార్) తండ్రి చివరిసారి వెళ్లిన మాన్షన్ హౌస్ కు ఒంటరిగా వెళ్తుంది. అక్కడ వాచ్ మెన్(రావు రమేష్) ఆ అపార్ట్ మెంట్ లో ఉన్న ఆరు ఫ్లాట్లలో జరిగిన దారుణమైన కథలను అమృతకు రోజుకొకటి చొప్పున వివరిస్తాడు. అయినా సరే ఇంకేదో రహస్యముందని గుర్తించిన అమృత చివరికి కాళిదాస్ జాడ ఎలా కనుక్కుంది, నిజంగా అక్కడ దెయ్యాలు ఏం చేశాయనేది స్టోరీ.
వర్మ డర్నా మనా హై స్టైల్ లో ఆరు విభిన్న నేపథ్యం కలిగిన హారర్ కాన్సెప్ట్స్ తీసుకున్న ఓంకార్ దాన్ని భయపెట్టేలా, ఆసక్తికరంగా మలిచేలా తడబడటంతో సగానికి పైగా కథలు చప్పగా సాగాయి. ఈజీగా ఊహించేలా ట్విస్టులు ఉండటం కారణమైతే, మరీ సినిమాటిక్ స్టైల్ లో రెగ్యులర్ క్లైమాక్స్ ని ఎంచుకోవడం ఉన్న కాసింత ఇంప్రెషన్ ని తగ్గించేసింది. క్యాస్టింగ్ లో సీనియర్ ఆర్టిస్టులను తీసుకోవడం, ప్రొడక్షన్ వేల్యూస్ గ్రాండ్ గా ఉండటం కొంత మేర కాపాడాయి కానీ అసలైన కంటెంట్ అంచనాలకు తగ్గట్టు లేకపోవడంతో మాన్షన్ 24 థ్రిల్స్ ను సరైన మోతాదులో ఇవ్వలేకపోయింది.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…