హఠాత్తుగా మధ్యాన్నం నుంచి లియో తెలుగు వెర్షన్ వాయిదా పడుతుందనే వార్తలు గుప్పుమనడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ తిన్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ మంచి స్వింగ్ లో ఉండి ఉదయం ఏడు గంటల షోలకు రెడీ అవుతున్న టైంలో ఈ పిడుగుపాటు ఊహించనిది. అసలు వివరాలు చూస్తే లియో టైటిల్ ఆల్రెడీ ఒక నిర్మాత రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. తన అనుమతి లేకుండా విజయ్ సినిమాకు వాడుకున్నారని కోర్టులో పిటీషన్ వేయడంతో అతనికి అనుగుణంగా అక్టోబర్ 20 దాకా రిలీజ్ ని వాయిదా వేస్తూ ఆర్డర్ ఇవ్వడంతో కలకలం రేగింది.
ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నిర్మాత నాగవంశీ స్వయంగా ప్రెస్ మీట్ ద్వారా దీని గురించిన క్లారిటీ ఇచ్చారు. ఇష్యూ వచ్చిన మాట వాస్తవమేనని, అతనెవరో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి ఒక మీడియా వ్యక్తి చెప్పాకే తనకూ తెలిసిందని, దీని బదులు ముందే మమ్మల్ని సంప్రదించి ఉంటే ఇప్పుడీ సమస్య వచ్చేది కాదని చెప్పారు. వీలైనంత త్వరగా వివాదాన్ని పరిష్కరించుకుని గురువారం మార్నింగ్ షోలకు సైతం ఎలాంటి ఇబ్బంది కలగకుండా యధాతథంగా రిలీజ్ చేయబోతున్నామని క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ హమ్మయ్యా అనుకుంటున్నారు.
బుకింగ్స్ ట్రెండ్ లో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు కన్నా వేగంగా ఉన్న లియోకి ఇప్పుడే చిన్న బ్రేక్ పడ్డా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ ఎగ్జైట్ మెంట్ ని మొదటి రోజు క్యాష్ చేసుకున్నంతగా తర్వాత కొనసాగించలేం. పైగా తమిళంలో వచ్చి తెలుగులో లేట్ అయితే అప్పటికే టాక్ గట్రా తెలుసుకున్న జనాల ఆసక్తి సహజంగానే తగ్గిపోతుంది. లోకేష్ కనగరాజ్ బ్రాండ్, అనిరుద్ రవిచందర్ సంగీతం, విజయ్ ఇమేజ్, లేని రామ్ చరణ్ క్యామియో గురించి ప్రచారం మొత్తం కలిసి లియో హైప్ ని అమాంతం మెట్రో స్పీడ్ లో పరుగులు పెట్టిస్తున్నాయి.
This post was last modified on October 17, 2023 5:59 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…